Just In
- 8 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 10 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 12 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 15 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నడిరోడ్డుపై బోల్తాపడ్డ ఫోర్డ్ ఎకోస్పోర్ట్: ప్రజల సాహసంతో మళ్ళీ యధాస్థితికి
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణం. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రాణాలు కోల్పోయే వారు, ప్రమాదంలో ఎక్కువగా గాయపడే వారు లెక్కకుమించి ఉన్నారు. అంతే కాకుండా వాహనాలు లోయల్లో పడిపోవడం, లేకుంటే రోడ్డుపై బోర్లా పడిపోవడం వంటి సంఘటనలు కూడా అక్కడక్కడా జరుగుతూ ఉంటాయి.
ఈ విధంగా వాహనాలు బోర్లా పడినప్పుడు క్రేన్లు వంటి వాటిని ఉపయోగిస్తారు. కానీ ఇటీవల ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. అయితే ఈ బోల్తాపడిన కారుని తీయడానికి క్రేన్లు ఉపయోగించలేదు. రోడ్డుపై ఉన్న చుట్టుపక్కల ప్రజలే దీనిని సరిచేశారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
నివేదికల ప్రకారం ఈ సంఘటన దక్షిణ ముంబైలోని వల్కేశ్వర్ లో జరిగినట్లు తెలిసింది. ఈ సంఘటనలో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్యూవీ రోడ్డుపై బోల్తాపడినట్లు తెలుస్తుంది. వీడియోలో రోడ్డుపై ఉన్న ఒక పోలీసు రోడ్డు మీద నడుస్తున్న ప్రజలను బోల్తాపడిన కారును సరిచేయడానికి ఆహ్వానించాడు.
ఆ సమయంలో అక్కడున్న ప్రజలు కొంతమంది అక్కడ బోల్తా పడిన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్యూవీని యధావిధిగా ఉంచడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ ఆ కారు బోల్తాపడటానికి సరైన కారణం తెలియదు. కానీ మొత్తానికి బోల్తా పడింది.
రోడ్డుపైన 10 నుంచి 15 మంది కారును నిఠారుగా చేయడానికి ప్రయత్నిస్తుండటం మీరు వీడియో గమనించవచ్చు. ప్రజలు చేసిన ఈ సాహసానికి కారు కొంత సమయానికి యధావిధిగా నిలబడింది. ఈ వీడియో చూస్తుంటే ఎంత కష్టమైన పని అయినా కలిసి చేస్తే విజయం సాధించవచ్చని మనకు స్పష్టంగా అర్ధమవుతుంది.
వీడియోలో మీరు చూస్తున్న ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్యూవీ బ్లాక్ కలర్ లో ఉంది. కారు బోల్తా పడటం వల్ల కారు యొక్క ముందు భాగం కొద్దిగా వంగి ఉండగా, విండ్స్క్రీన్ పగిలింది. ఈ కారు బోల్తాపడినప్పటికీ ఆ ప్రమాద సమయంలో ఎవరికీ ఎటువంటి కానీ, ప్రాణనష్టం కానీ జరిగినట్లు నివేదికలో ఎవల్లడించలేదు.
ఈ వీడియోపై చాలామంది నెటిజన్లు కామెంట్స్ కూడా చేశారు. అందులో కొంతమంది ముంబై ప్రజలు సహాయంచేయడంలో ఎప్పుడు ముందుగా ఉంటారని అన్నారు. అంతే కాకుండా ముంబై ప్రజలు ఎంత కష్టమైన పనినైనా కలిసికట్టుగా పనిచేసి అందులో తప్పకుండా విజయం సాధిస్తారని అన్నారు.
అది మాతర్మే కాకుండా ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యొక్క బలాన్ని కొందరు ప్రశంసించారు. కారు పూర్తిగా బోల్తాపడిన తర్వాత కూడా మంచి స్థితిలో ఉండటం నిజంగా ప్రశంసనీయం. ఎకోస్పోర్ట్ స్థానంలో వేరే వాహనం ఉంది ఉంటె తప్పకుండా భారీ ప్రమాదానికి గురి కావలసి వచ్చేదని వారు అభిప్రాయపడ్డారు.
భారతీయ మార్కెట్లో ఫోర్డ్ ఎకోస్పోర్ట్ యాంబియంట్, ట్రెండ్, టైటానియం, టైటానియం ప్లస్ మరియు స్పోర్ట్ అనే ఐదు వేరియంట్లలో విక్రయించబడుతోంది. ఈ ఎస్యూవీ టాప్ వేరియంట్ ధర రూ. 11.49 లక్షలు. కొత్త ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికలతో బిఎస్ 6 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లతో లభిస్తుంది.