Just In
- 4 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 4 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 5 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 6 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- News ఐటీ హబ్ శివార్లలో 647 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్, సీఎం సంచలన నిర్ణయం?
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా సమయంలో ముంబై పోలీసులకు కొత్త సమస్య, అదేంటో మీరే చూడండి
భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి 2020 మార్చి 24 నుంచి దేశం లాక్డౌన్ అమలు చేయబడింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో బస్సులు, ఆటో మరియు టాక్సీలతో సహా అన్ని రకాల ప్రజా రవాణా సేవలను నిషేధించారు.
ప్రైవేట్ మరియు ద్విచక్ర వాహనాల ట్రాఫిక్ కూడా పరిమితం చేయబడింది. ఈ పరిమితిని ఉల్లంఘిస్తూ అనవసరంగా బయట తిరుగుతున్న వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కారణంగా, లాక్ డౌన్ సమయంలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దశలవారీగా లాక్ డౌన్ సడలించడం జరిగింది.
దీనివల్ల నేడు వాహనాల రద్దీ సాధారణ స్థితికి చేరుకుంది. కరోనావైరస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, లాక్ డౌన్ ఇప్పటికీ అమలులోనే ఉంది. ఇటువంటి ప్రాంతాలలో ముంబై కూడా ఒకటి.
MOST READ:టెస్టింగ్ దశలో మహీంద్రా మోజో బిఎస్6; త్వరలో విడుదల - వివరాలు
కరోనావైరస్ హాట్ స్పాట్గా అవతరించిన ముంబైలో అనవసరంగా బయట తిరిగే వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం, ముంబై పోలీసులు ఏ కారణం లేకుండా ఏ వ్యక్తి అయినా 2 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించరాదని ఒక నిబంధన కూడా జారీ చేశారు.
ఈముంబై లో 2 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారై వాహనాలు స్వాధీనం చేసుకోబడుతున్నాయి. కానీ ఆఫీసులకు వెళ్లి అవసరమైన సేవలను అందించే వారికి ఈ నియమం నుండి మినహాయింపు ఉంటుంది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారి వాహనాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే 3దాదాపు 4,000 వాహనాలను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కానీ ముంబై పోలీసులు ఇప్పుడు కొత్త తలనొప్పిని ఎదుర్కొంటున్నారు.
MOST READ:ఆటో రిక్షాలకు సరి & బేసి విధానం, ఎక్కడో తెలుసా ?
స్వాధీనం చేసుకున్న వాహనాల పార్కింగ్కు తగినంత స్థలం లేకపోవడమే దీనికి కారణం. పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాల్లో లగ్జరీ వాహనాలు ఉన్నాయి. ఈ వాహనాలు దొంగిలించబడతాయనే భయంతో పోలీసులు వాహనాలను వారి యజమానులకు తిరిగి ఇచ్చారు.
దీని గురించి మాట్లాడుతూ, జప్తు చేసిన వాహనాలు దొంగిలించబడవచ్చు లేదా దెబ్బతినే అవకాశం ఉంది. వాహన యజమానులు వారి పరిస్థితి గురించి ఫిర్యాదు చేయడాన్ని మేము అంగీకరించాము. ఈ కారణంగా వాటిని వారి యజమానులకు తిరిగి ఇవ్వడం జరుగుతోంది.
MOST READ:మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే
పార్కింగ్ సమస్య నుండి వాహనాలు సులభంగా బయటపడగలవు కాబట్టి అనవసరంగా ఇంటి నుండి బయట తిరగ కూడదని పోలీసులు విజ్ఞప్తి చేసారు. పోలీసుల చర్యలు ఆయా ప్రాంతాలకు అనుగుణంగా మారవచ్చు. కరోనా సమస్య ముగిసే వరకు అనవసరమైన ప్రయాణం చేయకపోవడం, అనవసరంగా బయట తిరగటం వంటివి చేయకపోవడం చాలా మంచిది.
ఎందుకంటే రోజు రోజుకి కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి నివారణలో భాగంగా పోలీసులు తమ విధులను నిర్వహిస్తుంటే ప్రజలు వీటిని ఏ మాత్రం పట్టించుకోకుండా బయట తిరగటం ఏ మాత్రం సబబు కాదు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి కరోనా నివారణలో తమ వంతు సహాయంగా ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండాలి.