Just In
- 10 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 11 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 13 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 16 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI
దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చాలా అధికంగా ఉంది. ఈ మహమ్మరి వల్ల ఎంతోమంది ప్రజలు మరణిస్తున్నారు. లెక్కకుమించిన ప్రజలు రోజూ ఈ వైరస్ భారిన పడుతున్నారు. ప్రస్తుతం మనదేశంలో కరోనా వల్ల చనిపోవడానికి ప్రధాన కారణం ఆక్సిజన్ కొరత.
దేశంలో ఆక్సిజన్ కొరతని తీర్చడానికి ప్రభుత్వాలు మరియు సామాజిక సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు కరోనా సోకిన వారు లక్షల్లో ఉంటారని అంచనా, కావున వీరందరికి ఆక్సిజన్ సరఫరా చేయడం అనేది చిన్న విషయమైతే కాదు. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని.
ఆక్సిజన్ కొరతను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వంతో చేతులు కలిపిన అనేక ఆటోమొబైల్ కంపెనీలు ఆక్సిజన్ కొరతను తగ్గించడానికి తమ తయారీ కర్మాగారాల్లో ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆటో మొబైల్ కంపెనీలు ఉత్పత్తులను నిలిపివేసి ఆక్సిజన్ తయారీలో నిమగ్నమై ఉన్నాయి.
MOST READ:నడి రోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు పోలీసులు[వీడియో].. కారణం ఏమిటంటే?
ప్రజలు ఆక్సిజన్ కొరత వల్ల చనిపోకుండా ఉండటానికి ప్రభుత్వం మరియు ఇతర సంస్థలు తమ వంతు కృషి చేస్తున్న సమయంలో సాయంగా నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఆక్సిజన్ను తీసుకెళ్లే ట్యాంకర్లకు టోల్ నుంచి మినహాయింపు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియ ప్రకారం ఇప్పుడు ఆక్సిజన్ రవాణా చేసే వాహనాలు టోల్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆక్సిజన్ రవాణా చేయడంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా సమయానికి ఆక్సిజన్ను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఎన్హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.
MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు
ప్రస్తుతం ఆక్సిజన్ దృష్టిలో ఉంచుకుని, ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లను, ప్రాణాలను రక్షించే అంబులెన్స్లతో పోల్చడం ద్వారా ఈ విధమైన మినహాయింపు ప్రకటించారు. అందువల్లనే ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్లు ఏ జాతీయ రహదారులపై టోల్ చెల్లించాల్సిన అవసరం లేదు.
రాబోయే రెండు నెలలు లేదా నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ మినహాయింపు అమలులో ఉంటుంది. అత్యవసర సమయంలో నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా నిర్ణయం ప్రశంసనీయం.
MOST READ:ఆంధ్రప్రదేశ్లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి
మెడికల్ ఆక్సిజన్ తీసుకెళ్లే ట్యాంకర్ డ్రైవర్లు కూడా ప్రస్తుతం ప్రశంసించబడుతున్నారు. కరోనా వైరస్ యొక్క ఫస్ట్ వేవ్ లో వెంటిలేటర్లకు డిమాండ్ ఉండేది. అయితే ప్రస్తుతం ఆక్సిజన్ కి ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. కావున ఆక్సిజన్ త్వరితగతిన అందించడానికి ఆక్సిజన్ ట్యాంకర్లు గమ్యాన్ని చేరుకోవాలి కావున నేషనల్ హైవే అథారిటీ అఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.