మైండ్తో కంట్రోల్ చేయగల నిస్సాన్ కాన్సెప్ట్ కార్ ; పూర్తి వివరాలు
ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కార్ల తయారీదారులు భవిష్యత్తు కోసం కొత్త కార్ల తయారీలో బిజీగా ఉన్నారు. ఈ కార్లు ఆటో ఎక్స్పో లేదా ఆటో షోలలో ప్రదర్శించబడతాయి. ఇది భవిష్యత్తులో కార్లలో ఉపయోగించే టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి వాహనదారులకు చాలా ఉపయోగపడుతుంది.

ఇటీవల, జపాన్ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ తన జిటిఆర్ (ఎక్స్) 2050 కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. అమెరికాలోని నిస్సాన్ రీసెర్చ్ సెంటర్లో ట్రైనింగ్ పొందుతున్న ఒకరు ఈ కారును రూపొందించారు. ఈ కారులోని ప్రత్యేకత ఏమిటంటే దానిలో ఉండే సీటు. ఇది కూర్చోవడానికి మాత్రమే ఉపయోగపడే సీటు కాదు, నిద్రపోవాదానికి కూడా అనుకూలంగా ఉండే సీటు. నిద్రపోయాక, కాళ్ళు వెనుక భాగంలో ఉన్నప్పుడు డ్రైవర్ తల కారు ముందు ఉంటుంది.

ఈ కారులో ఎక్కే ముందు మీరు ప్రత్యేక సూట్ ధరించాలి. ఈ సూట్తోపాటే హెల్మెట్ కూడా అందించబడుతుంది. ఈ హెల్మెట్ మెదడు నుండి వెలువడే తరంగాల సహాయంతో కారును కంట్రోల్ చేస్తుంది.

హెల్మెట్ ధరించిన తరువాత కారు పూర్తిగా డ్రైవర్ యొక్క మనసు నియంత్రణలో ఉంటుంది. అప్పుడు డ్రైవర్ మనస్సు కోరుకున్న విధంగా కదులుతుంది. ఈ కారులో స్టీరింగ్ ఇవ్వబడదు. కానీ కారులో ఉన్న వ్యక్తి ఆదేశాలతో డ్రైవ్ చేస్తుంది. ఇవన్నీ ఇందులో ప్రత్యేకంగా అమర్చబడి ఉంటాయి.

ఈ కారు 10 అడుగుల పొడవు 2 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ కాన్సెప్ట్ కారు రూపకల్పన సాధారణ కారుకు మాదిరిగా కాకుండా చాలా భిన్నంగా ఉంటుంది. ఈ కారు చూడటానికి స్టార్ ఫిష్ లాగా కనిపిస్తుంది. కారు రూపకల్పనపై ప్రభావం చూపిన సంస్థ ట్రైనింగ్ పొందిన డిజైనర్ను నియమించింది.

రాబోయే రోజుల్లో కంపెనీ దీనిని మరింత అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తుంది. నిస్సాన్ కాన్సెప్ట్ కార్లను అభివృద్ధి చేయడంతో పాటు కొత్త కొత్త కార్లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. ఈ సంస్థ ఇటీవల మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీని భారత్లో విడుదల చేసింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్షోరూమ్).

నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్యూవీ లాంచ్ అయిన అతి తక్కువ కాలంలోనే ఎక్కువమంది ఆదరణను పొందుతోంది. నివేదికల ప్రకారం ఈ ఎస్యూవీ లాంచ్ అయిన కేవలం ఐదు రోజుల్లోనే 5,000 కార్లు బుక్ అయ్యాయి. ఈ ఎస్యూవీ కొనుగోలుదారులు డెలివరీ కోసం ఇప్పుడు చాలా రోజులు వేచి ఉండాలి.

నిస్సాన్ మ్యాగ్నైట్ కాంపాక్ట్ ఎస్యూవీని నాలు మోడల్స్ లో విక్రయించబడుతుంది. అవి ఎక్స్ఇ (బేస్), ఎక్స్ఎల్ (మిడ్), ఎక్స్వి (హై) మరియు ఎక్స్వి (ప్రీమియం) మోడల్స్. ఈ ఎస్యూవీలో అనేక కొత్త ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో టెక్ ప్యాక్ వైర్లెస్ ఛార్జింగ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ మూడ్ లైటింగ్ మరియు జెబిఎల్ స్పీకర్ వంటివి ఉన్నాయి.

నిస్సాన్ మ్యాగ్నైట్ ఎస్యూవీలో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు ఉంటాయి. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు టర్బో పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు పెట్రోల్ ఇంజిన్తో సివిటి గేర్బాక్స్తో జతచేయబడతాయి.

నిస్సాన్ మాగ్నెట్ ఎస్యూవీ దేశీయ మార్కెట్లో కియా సొనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్యూవీ 300, టాటా నెక్సాన్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి వితారా బ్రెజ్జా, టయోటా అర్బన్ క్రూయిజర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

నిస్సాన్ కిక్స్ ఫేస్లిఫ్ట్ మోడల్ను యుఎస్లో ఆవిష్కరించబడింది. ఈ కొత్త కిక్ రూపకల్పన పరంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది అనేక కొత్త ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. నిస్సాన్ కిక్స్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ కూడా 2021 లో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








