Just In
- 30 min ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 1 hr ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 3 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
- 5 hrs ago బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
Don't Miss
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- News న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీ కంపెనీ గా ప్రసిద్ధి చెందిన నిస్సాన్ తన బ్రాండ్ నుంచి మాగ్నెట్ ఎస్యువిని అందిస్తున్న విషయం తెలిసిందే. నిస్సాన్ మాగ్నెట్ భారతదేశంలో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్యువిగా నిలిచింది. దీనికి కారణం ఈ ఎస్యువి అతి తక్కువ ధర వద్ద మంచి అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం.
భారతదేశంలో అతి తక్కువ ధర కలిగిన కార్లలో నిస్సాన్ మాగ్నెట్ ఒకటి. ఈ కారు ఇప్పటికి దేశీయ మార్కెట్లో అధిక సంఖ్యలో అమ్ముతుంది. తక్కువ ఖర్చు మరియు తక్కువ నిర్వహణ కారణంగా ఈ కారుకు మంచి డిమాండ్ ఉంది.
అయితే ఇటీవల జరిగిన ఒక సంఘటన మాగ్నెట్ కార్ కస్టమర్లను మరియు కొత్త మాగ్నెట్ కారు కొనాలనుకునే వారిని ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురించేసింది. నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇందిరా హర్ష విదేశాల్లో నివసిస్తున్నారు. ఇటీవల అతను తన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు.
MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
అతడు తన మాగ్నెట్ ఎస్యువితో ఎపిఎస్ఆర్టిసి యాజమాన్యంలోని ప్రభుత్వ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అతని మాగ్నెట్ కారుకు తీవ్ర నష్టం వాటిల్లింది. కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. దీనిని మీరు ఫోటోలలో కూడా గమనించవచ్చు.
ఈ కారు ముందుభాగంలో తీవ్రంగా దెబ్బతినటం వల్ల అది నిస్సాన్ మాగ్నెట్ అని గుర్తించడం కూడా చాలా కష్టం. ఈ ప్రమాదంలో వాహనదారునికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఈ కారణంగా అతడు చాలా రోజులుగా ఆసుపత్రిలో ఉన్నాడు.
MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
అతడు హాస్పిటల్ లో ఉన్న సమయంలో, తన సోదరుడు కారును సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లి భీమా అంత చూసుకున్నాడు. అయితే హర్ష ఇటీవల కోలుకుని ఇంటికి వచ్చాడు. తన కార్ కి సర్వీస్ సెంటర్ పంపిన బిల్లు చూసి ఒక్కసారిగా హవాక్కయ్యాడు.
తన మాగ్నెట్ కారుకి నిస్సాన్ సర్వీస్ సెంటర్ పంపిం బిల్లు అక్షరాలా 20,75,640 రూపాయలు. ఇందిరా హర్ష నిస్సాన్ మాగ్నైట్ కారు యొక్క టర్బో ఎక్స్వి ప్రీమియం సివిటి మోడల్ను ఉపయోగిస్తోంది. ఈ కారు ధర రూ. 10 లక్షల కన్నా తక్కువ. కానీ సర్వీస్ సెంటర్ దీనికి దాదాపుగా రూ. 21 లక్షల బిల్లు ఇచ్చింది.
MOST READ:పూర్తి చార్జ్పై 350 కిలోమీటర్లు ప్రయాణించిన మహీంద్రా ఈ2ఓ ప్లస్!
ఈ సంఘటనతో మాగ్నెట్ కార్ కస్టమర్లందరూ షాక్ కి గురయ్యారు. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉన్నందున చాలా మంది నిస్సాన్ మాగ్నైట్ కారును కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో, నిస్సాన్ సర్వీస్ సెంటర్లు, కారు ధర కంటే 100% ఎక్కువ బిల్లులు ఇస్తుందని ఇందిరా హర్ష తెలిపారు.
రిపేర్ కోసం కారును సర్వీస్ సెంటర్లో వదిలిన తర్వాత చివరలో రూ. 21 లక్షలు ఖర్చవుతుందని చెబుతున్నారు. దెబ్బతిన్న విడిభాగాలు మరియు ఇతర ఛార్జీలను కూడా ఈ బిల్లులోనే చేర్చారు. ఏది ఏమైనా ఈ బిల్లు చూస్తే ఏ వాహనదారుడైన హవాక్కవద్దం ఖాయం.
MOST READ:వాహనాలకు స్పీడ్ లిమిట్ తప్పనిసరి; హైకోర్టు ఆదేశం
భారతదేశంలో నిస్సాన్ మాగ్నెట్ కారు ధర రూ .5.59 లక్షల నుండి రూ .9.90 లక్షలు. నిస్సాన్ మాగ్నెట్ కారులో అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ సబ్-కాంపాక్ట్ ఎస్యూవీలో సొగసైన డిజైన్, హైటెక్ ఫీచర్ మరియు శక్తివంతమైన ఇంజన్ కూడా ఉన్నాయి. నిస్సాన్ మాగ్నెట్ కారు
Source:Team BHP