నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

భారతదేశం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా ఇప్పటికే భారతీయ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. కాబట్టి అత్యవసర వస్తువులను రవాణా చేయడానికి వాహనాల అంతరాష్ట్ర రాకపోకలకు వీలుగా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.

నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

నితిన్ గడ్కరీ రహదారి నిర్మాణాలకు భూసేకరణను వేగవంతం చేయాలని మరియు రహదారుల నిర్మాణాలకు రూ. 25 వేల కోట్లు ఉపయోగించాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. రాష్ట్ర రవాణా మంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌లో గడ్కరీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు సౌకర్యాలను మెరుగుపరచడానికి రాష్ట్రాల సహకారాన్ని కోరారు.

నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన నితిన్ గడ్కరీ, అంతరాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలలో ట్రక్కులు, ట్రక్కులపై ఆంక్షలు త్వరలో ఎత్తివేసే అవకాశం కూడా ఉందని ప్రకటించారు.

నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ, మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకుని స్థానిక లేదా జిల్లా పాలన ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు మరియు శానిటైసర్లు ఉపయోగించుకుని కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి పొందాలని ఆదేశించారు.

నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

భారతదేశంలో ఇటీవల లాక్ డౌన్ నుంచి పాక్షిక సడలింపులు చేస్తూ దీనిలో భాగంగా కొన్ని సంస్థలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ కార్మికులు కనీసం ఒక మీటర్ దూరాన్ని పాటించాలని, మాస్కులు మరియు ముసుగులు, శానిటైజర్లను వాడాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

అత్యవసర పరిస్థితుల్లో విధుల్లో పాల్గొనే కార్మికులకు భోజనం అందించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా డాబాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యాప్ ఆధారిత ద్విచక్ర వాహన టాక్సీ సేవలను ప్రారంభించాలని రాష్ట్ర రవాణా మంత్రులకు గడ్కరీ ఆదేశించారు.

నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్

ప్రజలందరూ సామజిక దూరాన్ని పాటిస్తూ అత్యవసర సమయాల్లో బయటికి రావడానికి ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు కరోనా నివారణలో అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వాలకు ప్రజలు కూడా తమ వంతు మద్దతు ప్రకటించాలి. అప్పుడే కరోనా నుంచి వీలైనంత త్వరగా విముక్తి పొందే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 29, 2020, 19:26 [IST]
English summary
Nitin Gadkari requests essential good transport between states to be allowed. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+