Just In
- 1 hr ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 4 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 6 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 6 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News వాళ్ళను తిడుతూనే.. వైఎస్ జగన్, భారతి వద్ద కోట్లలో వైఎస్ షర్మిలమ్మ అప్పులచిట్టా ఇదే!!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Movies నాగార్జున ఇంటికి కోడలుగా రాబోతున్న మరో హీరోయిన్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
నిత్యావసర సరుకుల రవాణాకు కేంద్ర మంత్రి గ్రీన్ సిగ్నల్
భారతదేశం లాక్ డౌన్ లో ఉన్న కారణంగా ఇప్పటికే భారతీయ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. కాబట్టి అత్యవసర వస్తువులను రవాణా చేయడానికి వాహనాల అంతరాష్ట్ర రాకపోకలకు వీలుగా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
నితిన్ గడ్కరీ రహదారి నిర్మాణాలకు భూసేకరణను వేగవంతం చేయాలని మరియు రహదారుల నిర్మాణాలకు రూ. 25 వేల కోట్లు ఉపయోగించాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించారు. రాష్ట్ర రవాణా మంత్రితో వీడియో కాన్ఫరెన్స్లో గడ్కరీ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడానికి మరియు సౌకర్యాలను మెరుగుపరచడానికి రాష్ట్రాల సహకారాన్ని కోరారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసిన నితిన్ గడ్కరీ, అంతరాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలలో ట్రక్కులు, ట్రక్కులపై ఆంక్షలు త్వరలో ఎత్తివేసే అవకాశం కూడా ఉందని ప్రకటించారు.
MOST READ:దుమ్మురేపుతున్న డుకాటీ పానిగలే V 2 టీజర్ ఇమేజ్
ఈ సమావేశంలో కేంద్ర మంత్రి గడ్కరీ మాట్లాడుతూ, మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకుని స్థానిక లేదా జిల్లా పాలన ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు మరియు శానిటైసర్లు ఉపయోగించుకుని కరోనా మహమ్మారి నుంచి త్వరగా విముక్తి పొందాలని ఆదేశించారు.
భారతదేశంలో ఇటీవల లాక్ డౌన్ నుంచి పాక్షిక సడలింపులు చేస్తూ దీనిలో భాగంగా కొన్ని సంస్థలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించారు. ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ కార్మికులు కనీసం ఒక మీటర్ దూరాన్ని పాటించాలని, మాస్కులు మరియు ముసుగులు, శానిటైజర్లను వాడాలని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
MOST READ:లాక్డౌన్ లో కూడా అమ్మకాలలో పెరుగుదలను చూపించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే
అత్యవసర పరిస్థితుల్లో విధుల్లో పాల్గొనే కార్మికులకు భోజనం అందించడం, పరిశుభ్రత పాటించడం ద్వారా డాబాలు, హోటళ్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో కూడా సామాజిక దూరాన్ని పాటించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యాప్ ఆధారిత ద్విచక్ర వాహన టాక్సీ సేవలను ప్రారంభించాలని రాష్ట్ర రవాణా మంత్రులకు గడ్కరీ ఆదేశించారు.
ప్రజలందరూ సామజిక దూరాన్ని పాటిస్తూ అత్యవసర సమయాల్లో బయటికి రావడానికి ప్రభుత్వం ఆదేశాలు జరీ చేసింది. ఈ నేపథ్యంలో వీలైనంత వరకు కరోనా నివారణలో అహర్నిశలు కష్టపడుతున్న ప్రభుత్వాలకు ప్రజలు కూడా తమ వంతు మద్దతు ప్రకటించాలి. అప్పుడే కరోనా నుంచి వీలైనంత త్వరగా విముక్తి పొందే అవకాశం ఉంటుంది.
MOST READ:భారత్ లో ప్రారంభం కానున్న నెక్జు మొబిలిటీ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్