భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

కేంద్ర రహదారి మరియు రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' 2019 లో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి లోక్‌సభకు ఒక సమాచారం ఇచ్చారు. ఈ గణాంకాల ప్రకారం 2019 లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 1,51,113 మంది మరణించినట్లు తెలిసింది. 2019 లో జరిగిన మరణాల సంఖ్యతో పోలిస్తే, 2018 లో 0.20 శాతం తక్కువ అని గడ్కరీ తెలిపారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

ఈ రోడ్డు ప్రమాదాల గురించి లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ నితిన్ గడ్కరీ 2019 లో మొత్తం 4,49,002 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని, ఇది సరిగ్గా ఏడాది క్రితం అంటే మునుపటి ఏడాది 2018 కంటే 3.9 శాతం తక్కువ అని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరగటానికి అనేక కారణాలు ఉన్నాయని కూడా ఆయన లోక్‌సభలో వ్యక్తం చేశారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

నితిన్ గడ్కరీ ప్రకారం ఓవర్‌ స్పీడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ వాడకపోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వాడటం వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణమని తెలిపారు. వీటన్నింటిని వీలైనంత చర్యలతో తగ్గించాలని ఆయన అన్నారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

లోక్‌సభలో గడ్కరీ దీనిపై స్పందిస్తూ అత్యవసర సంరక్షణ ఆధారంగా రహదారి భద్రత సమస్యను పరిష్కరించడానికి మంత్రిత్వ శాఖ బహుముఖ వ్యూహాన్ని సిద్ధం చేసిందన్నారు, రహదారిపై ఉన్న బ్లాక్‌ స్పాట్‌లను మంత్రిత్వ శాఖ గుర్తించి వాటిని మెరుగుపరుస్తోందని కూడా అన్నారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

కొత్త ప్రాజెక్టులలో రోడ్ల రూపకల్పనకు సంబంధించిన మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. రహదారులపై సాంకేతిక మెరుగుదలల కోసం బ్లాక్ స్పాట్‌లను గుర్తించే పనిని స్థానిక అధికారులకు అప్పగించారు మరియు కొత్త మెరుగుదలలను త్వరగా అమలు చేయాలని ఆదేశించారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

రహదారులపై వాహనాల వేగ పరిమితిని 20 కిలోమీటర్లకు పెంచాలని ఇటీవల నితిన్ గడ్కరీ నిర్ణయించిన విషయం కూడా అందరికి తెలిసిందే. మంత్రిత్వ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ, కాలక్రమేణా రహదారుల పరిస్థితి మెరుగుపడిందని, కాబట్టి ఇప్పుడు వాహనాల వేగాన్ని పెంచడం మరియు ప్రయాణ సమయాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టడం అవసరం అన్నారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

దేశంలోని ప్రజా రవాణా మరియు లాజిస్టిక్‌లను 100% స్వచ్ఛమైన ఇంధన వనరులకు మార్చాలని నితిన్ గడ్కరీ యోచిస్తున్నారు. గత దశాబ్దంలో గ్రీన్ ఎనర్జీని మెరుగుపరచడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ఆయన అన్నారు. 2022 నాటికి భారతదేశం పునరుత్పాదక ఇంధన వనరుల నుండి 175 జిగావాట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

దేశంలో ప్రత్యామ్నాయ రవాణా వనరులు వృద్ధి చెందుతున్నాయని, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రోప్‌వే, కేబుల్ కార్లు ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయని ఆయన అన్నారు. ఈ వనరులు జలవిద్యుత్ ప్రాజెక్ట్ ద్వారా ఉత్పత్తి చేయబడిన విద్యుత్తు ద్వారా నడపబడతాయి.

భారత్‌లో గణనీయంగా తగ్గిన రోడ్డు ప్రమాదాలు: మరింత తగ్గుదలకు కొత్త వ్యూహాలు

పునరుత్పాదక ఇంధన వనరులు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించబోతున్నాయని ఆయన అన్నారు. ఇది ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కూడా కల్పించనుంది. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు 2050 నాటికి సుమారు 3 మిలియన్ల మందికి ఉపాధి కల్పిస్తాయని చెబుతున్నారు. లాజిస్టిక్స్ లో ఎల్‌ఎన్‌జి, హైడ్రోజన్‌ను ఇంధనంగా ఉపయోగించడంపై దృష్టి పెడుతున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు.

More from DriveSpark

Article Published On: Wednesday, July 28, 2021, 9:54 [IST]
English summary
Around 4.49 Lakh Road Accidents In 2019. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+