Just In
- 25 min ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 1 hr ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- 2 hrs ago కూతురికి రూ.2 కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి.. ఫిదా చేస్తున్న వీడియో
- 3 hrs ago కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
Don't Miss
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిలిపివేసిన ప్రభుత్వం, ఎక్కడంటే.. ?
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలు జరగడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రధాన కారణం. ఎక్కువగా రాత్రిపూట మందు తాగి వాహనాలు నడపడం వల్ల చాల వరకు ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదాలను ఆపడానికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి జరిమానాలు విధించడం జరుగుతుంది.
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు మందు తాగి డ్రైవ్ చేసేవారిని గుర్తించడానికి బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించబడుతుంది. ఈ బ్రీత్ ఎనలైజర్ ఒక వ్యక్తి తాగాడా లేదా అని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే ఈ బ్రీత్ ఎనలైజర్ ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే చాల మంది వాహనదారులకు ఒకే బ్రీత్ ఎనలైజర్ ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తి చాలా తొందరగా జరుగుతుంది.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షను తమిళనాడు ప్రభుత్వం ఇటీవల కాలంలో నిషేధించింది. కరోనావైరస్ ఇటీవల కాలంలో ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ప్రతిరోజూ చాలా మంది ప్రజలు ఈ వైరస్ వల్ల చనిపోతున్నారు.
ఈ కరోనా వైరస్ యొక్క వ్యాప్తి అనేది ఒకరి నుంచి మరొకరికి చాల తొందరగా వ్యాపిస్తుంది. ఈ ప్రమాదకర వైరస్ ని నిరోధించడానికి మనదేశంలో కేంద్ర ప్రభుత్వం మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా నివారణ చర్యలను చేపట్టారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా పూర్తిగా నిలిపివేసింది.
వాస్తవానికి చైనాలోని వుహాన్లో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలోని 124 కి పైగా దేశాలకు వ్యాపించింది. ఈ కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
వైరస్ ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండటానికి ప్రభుత్వాలు అనేక కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి. దేశంలో చాలా బహిరంగ ప్రదేశాలను మూసివేయాలని ఆదేశించారు. అంతే కాకుండా పాఠశాలలు మరియు కళాశాలలకు కూడా సెలవు మంజూరు చేయబడింది.
తమిళనాడు తరువాత, ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షను నిలిపివేశారు. అడిషినల్ పోలీసు సూపరింటెండెంట్ వినయ్ గార్గావోంకర్ దీనికోసం ఒక సర్క్యులర్ జారీ చేశారు.
ఒక వ్యక్తికి కరోనా ఉంటే ఆ వ్యక్తి ద్వారా పక్కన ఉన్నవారికి వ్యాపించే అవకాశం ఉంది. దీనిని కొంతవరకు తగ్గించడానికి మహారాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణంగా ఈ కరోనా వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి అనేక మార్గాలద్వారా వ్యాప్తి చెందుతుంది.
కరోనా వైరస్ ప్రభావం వల్ల మహారాష్ట్రలో ఇప్పటికి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వాలు చాలా కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టింది.
కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి తొందరగా వ్యాపిస్తుంది కనుక ఈ ప్రాంతాలలో బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించారు. అంతే కాకుండా ఈ కరోనా వైరస్ నుండి రక్షణ పొందటానికి అనువైన మాస్క్ ల వంటి పరికరాలను ధరించడం మంచిది.