Just In
- 13 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 14 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 16 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 18 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Sports ఆ నిర్ణయమే మమ్మల్ని గెలిపించింది- పంత్
- Movies Brahmamudi April 25th episode: కావ్యకు సవతి వచ్చినా ఫర్వాలేదా?.. నీవు నా మొగుడిని తగులుకుంటావా? అనామిక
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆటో రిక్షాలకు సరి & బేసి విధానం, ఎక్కడో తెలుసా ?
కరోనావైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఈ భయంకరమైన అంటువ్యాధి ప్రజల జీవితాలను దెబ్బతీసింది. చాలామంది ప్రజలు జీవనోపాధిని కోల్పోయారు.ఈ కరోనా కారణంగా ప్రజలు ఇంటిని విడిచిపెట్టి బయటికి రాకూడదని ప్రభుత్వాలు ఆదేశాలు జరీ చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో కరోనా లాక్ డౌన్ కొన్ని సడలింపులతో సడలించడం జరిగింది. ఈ క్రమంలో చాలామంది వాహనదారులు ఇళ్ల నుంచి బయట తిరుగుతున్నారు. భారతదేశంలో మహారాష్ట్ర రాష్ట్రం కరోనా వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. మహారాష్ట్రలో ట్రాఫిక్ బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, మహారాష్ట్రలో నడుస్తున్న ఆటోరిక్షాల ట్రాఫిక్ కోసం సరి మరియు బేసి నిబంధనను అమలు చేయడానికి మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ ఆలోచిస్తోంది.
ట్రాఫిక్ రద్దీని నిరోధించడం ద్వారా కరోనావైరస్ సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటమే దీని వెనుక ఉన్న ఆలోచన. ఈ నియమం ప్రకారం, రిజిస్ట్రేషన్ నెంబర్ చివరిలో బేసి సంఖ్యలతో కూడిన ఆటోరిక్షాలు బేసి రోజులలో రహదారిపై ఉంటాయి, సరి సంఖ్యలతో ఉన్న ఆటోలు సరి రోజుల్లో రహదారులపై తిరుగుతాయి.
MOST READ:కొత్త 2020 మహీంద్రా థార్ స్పై పిక్చర్స్, ఫుల్ డిటేల్స్
దీని గురించి మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్ పరాబ్ మాట్లాడుతూ ప్రజా రవాణాను తిరిగి ప్రారంభించాలని సలహా ఇవ్వడానికి నియమించిన టాస్క్ఫోర్స్ ఈ విషయంపై మరోసారి చర్చిస్తుందని అన్నారు. ప్రజా రవాణాను వ్యవస్థీకృత పద్ధతిలో తిరిగి ప్రారంభించడం మరియు రవాణాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడం దీని ప్రధాన ఉద్దేశ్యం.
ప్రస్తుతం ఆటోరిక్షాలు బస్సులకు మాత్రమే అనుమతించబడతాయి. అన్ని రకాల ప్రజా రవాణా సేవలు అనేక నిబంధనలతో దశల వారీగా తిరిగి ప్రారంభించబడుతుంది. వీటిలో సరి మరియు బేసి నియమాలు కూడా అమలులో ఉన్నాయి.
MOST READ:టాప్ బైక్ న్యూస్ - హోండా లివో, హీరో ఎక్స్ట్రీమ్, హ్యార్లీ బడ్జెట్ బైక్
మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని భావించిన ఈ నియమాన్ని విమర్శించిన రిక్షా పంచాయతీకి చెందిన నితిన్ పవార్, మొదట ఉచిత లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి. ప్రస్తుతం 40% నుండి 50% ఆటోరిక్షాలు మాత్రమే కదులుతున్నాయి. బేసి-సరి నిబంధనను అవలంబించడం వల్ల డ్రైవర్లకు మరింత సమస్యలు వస్తాయని ఆయన అన్నారు.
ప్రైవేటు వాహనాల కదలికను నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నియమాన్ని ఉపయోగించాలని నితిన్ పవార్ అన్నారు. మహారాష్ట్రలో 10 లక్షలకు పైగా ఆటోరిక్షాలు ఉన్నాయి, వీటిలో 3 లక్షలకు పైగా పూణే మరియు ముంబైలలో ఉన్నాయి. ఏదిఏమైనా ఈ కొత్త విధానం ద్వారా రోజు వారి ఆటతో కార్మికులు కొత్త వరకు ఉపశమనం పొందుతారు. అంతే కాకుండా కరోనా సంక్రమణను కూడా కొంత వరకు నియంత్రించవచ్చు.
MOST READ:మీకు తెలుసా.. నాగార్జున గ్యారేజీలో చేరిన కొత్త కార్, ఇదే