Just In
- 20 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 31 min ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 39 min ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 1 hr ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- News
నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరిన జగన్-తొలిసారి- ఎందుకో తెలుసా ?
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Movies
మెగాస్టార్ సినిమాను రిజెక్ట్ చేసిన అగ్ర దర్శకుడు.. మరో సూపర్ ప్లాన్ వేసిన మెగా టీమ్
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తారని అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఒక ట్రక్ డ్రైవర్ హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ. 1,000 జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది.

నివేదికల ప్రకారం ఒడిశాలో, ట్రక్ డ్రైవర్ ప్రమోద్ కుమార్ తన వెహికల్ పర్మిట్ రెన్యూవల్ చేసుకోవడం కోసం గంజాం జిల్లా ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్ళారు. కానీ అతని రెన్యూవల్ అనుమతిని అధికారులు ఖండించారు. ఎందుకు అని అడిగితే అతడు జరిమానా చెల్లించాలని సంబంధిత అధికారులు తెలిపారు.

ఆ ట్రక్ డ్రైవర్ జరిమానా ఎందుకు విధించారో అడిగితే, పోలీసులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కేసు నమోదు చేసి రూ. 1000 జరిమానా విధించారు. మీరు జరిమానా చెల్లించకాపోతే వెహికల్ రెన్యూవల్ అనుమతించబోమని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మాటలు విన్న ట్రక్ డ్రైవర్ ప్రమోద్ కుమార్ ఆశ్చర్యపోయాడు.
MOST READ:అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

అప్పుడు ట్రక్ డ్రైవర్ నా జీవితంలో నేను ఎప్పుడూ ట్రక్కును కాకుండా ఇతర వాహాన్ని నడపలేదని చెప్పాడు. కానీ ఒడిశాలో జరిమానా లేకుండా పర్మిట్ను పునరుద్ధరించలేమని పోలీసులు తెలిపారు.

అప్పుడు ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, చట్టం ఆమోదించబడితే నేను కూడా అదే చేస్తాను. అయితే, లంచంపై అసమంజసమైన ఆరోపణలు చేస్తున్న వీరిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రమోద్ కుమార్ డిమాండ్ చేశారు.
MOST READ:2021 ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ 10 డీజిల్ కార్స్; వాటి వివరాలు

ఈ కార్యక్రమం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా ట్రోలింగ్ చేయబడింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా ఆటో డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని అతనికి కూడా జరిమానా విధించిన సంఘటన గురించ్గి మునుపటి కథనాలలో తెలుసుకున్నాం.

ఇటీవల కాలంలో భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అదనపు సిసిటివి కెమెరాలు, అదనపు సిబ్బందిని విధుల్లో మోహరించారు. దీనివల్ల పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేయబడతాయి. ఏది ఏమైనా ట్రక్కు డ్రైవర్ కి జరిగిన అమానుషమైన సంఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటి ఆగడాలు ఆనకట్ట వేసినట్లు అవుతుంది.
MOST READ:చూస్తే ఒక్కసారైనా రైడ్ చేయాలనిపించే మాడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్
NOTE:ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫొటోలో కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే