Just In
- 6 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 7 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 8 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 9 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా
ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపితే ట్రాఫిక్ పోలీసులు భారీ జరిమానాలు విధిస్తారని అందరికి తెలుసు. కానీ ఇక్కడ ఒక ట్రక్ డ్రైవర్ హెల్మెట్ ధరించనందుకు ట్రాఫిక్ పోలీసులు అతడికి రూ. 1,000 జరిమానా విధించిన వింత ఘటన వెలుగులోకి వచ్చింది.
నివేదికల ప్రకారం ఒడిశాలో, ట్రక్ డ్రైవర్ ప్రమోద్ కుమార్ తన వెహికల్ పర్మిట్ రెన్యూవల్ చేసుకోవడం కోసం గంజాం జిల్లా ప్రాంతీయ రవాణా కార్యాలయానికి వెళ్ళారు. కానీ అతని రెన్యూవల్ అనుమతిని అధికారులు ఖండించారు. ఎందుకు అని అడిగితే అతడు జరిమానా చెల్లించాలని సంబంధిత అధికారులు తెలిపారు.
ఆ ట్రక్ డ్రైవర్ జరిమానా ఎందుకు విధించారో అడిగితే, పోలీసులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ కేసు నమోదు చేసి రూ. 1000 జరిమానా విధించారు. మీరు జరిమానా చెల్లించకాపోతే వెహికల్ రెన్యూవల్ అనుమతించబోమని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ మాటలు విన్న ట్రక్ డ్రైవర్ ప్రమోద్ కుమార్ ఆశ్చర్యపోయాడు.
MOST READ:అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..
అప్పుడు ట్రక్ డ్రైవర్ నా జీవితంలో నేను ఎప్పుడూ ట్రక్కును కాకుండా ఇతర వాహాన్ని నడపలేదని చెప్పాడు. కానీ ఒడిశాలో జరిమానా లేకుండా పర్మిట్ను పునరుద్ధరించలేమని పోలీసులు తెలిపారు.
అప్పుడు ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, చట్టం ఆమోదించబడితే నేను కూడా అదే చేస్తాను. అయితే, లంచంపై అసమంజసమైన ఆరోపణలు చేస్తున్న వీరిపై ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ప్రమోద్ కుమార్ డిమాండ్ చేశారు.
MOST READ:2021 ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ 10 డీజిల్ కార్స్; వాటి వివరాలు
ఈ కార్యక్రమం సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా ట్రోలింగ్ చేయబడింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు. ఇంతకుముందు కూడా ఆటో డ్రైవర్ హెల్మెట్ ధరించలేదని అతనికి కూడా జరిమానా విధించిన సంఘటన గురించ్గి మునుపటి కథనాలలో తెలుసుకున్నాం.
ఇటీవల కాలంలో భారతదేశంలో ట్రాఫిక్ నియమాలను మరింత కఠినతరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అదనపు సిసిటివి కెమెరాలు, అదనపు సిబ్బందిని విధుల్లో మోహరించారు. దీనివల్ల పెద్ద మొత్తంలో జరిమానాలు వసూలు చేయబడతాయి. ఏది ఏమైనా ట్రక్కు డ్రైవర్ కి జరిగిన అమానుషమైన సంఘటనపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇటువంటి ఆగడాలు ఆనకట్ట వేసినట్లు అవుతుంది.
MOST READ:చూస్తే ఒక్కసారైనా రైడ్ చేయాలనిపించే మాడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్
NOTE:ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫొటోలో కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే