Just In
- 6 min ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 1 hr ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 4 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 5 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
భారతదేశంలో గత కొన్ని నెలలుగా ప్రతి రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. అయితే సుమారు తొమ్మిది వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎట్టకేలకు పెరిగిపోతున్నాయి.
ఇటీవల తమిళనాడు, కేరళ, పాండిచేరి, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత, చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచనున్నాయి. భారతదేశంలో ఇంతకుముందు చివరిసారిగా ఫిబ్రవరి 23 న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచారు.
గత ఫిబ్రవరి నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మానేశాయి. కానీ ఇటీవల ఎన్నికలు ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు.
MOST READ:ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..
ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెనుభారంగా మారాయి. నేడు, పెట్రోల్ ధరను 19 పైసలు, డీజిల్ ధరను 21 పైసలు పెంచారు. నిన్న పెట్రోల్ ధరను లీటరుకు 15 పైసలు, డీజిల్ లీటరుకు 18 పైసలు పెంచారు.
ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సుమారు 9 వారాల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని కంపెనీలు నష్టాలను పూడ్చుకునేందుకు సన్నాహాలను సిద్ధం చేస్తూ ఒక్కసారిగా ధరలు పెంచుతున్నారు.
MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్తో అక్రమాలకు చెక్..
ఎన్నికల సమయంలో ధరలను నిలకడగా ఉంచి, చమురు కంపెనీలు ఎన్నికలు జరిగిన వెంటనే ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. గత అనేక ఎన్నికలలో చమురు కంపెనీలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. చమురు కంపెనీలు ఈ ధోరణిని అనుసరిస్తున్నాయి, ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎన్నికలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సాధారణ వాహనదారులను మాత్రమే కాకుండా మధ్యతరగతి వారిని కూడా చాలా ఇబ్బందులపాలుచేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమాటిక్ గా పెరుగుతాయి.
MOST READ:వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది
ఈ కారణంగా, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజల పట్టుదలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు తలకు మించిన భారమవుతోంది