Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 18 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పెరుగుదల దిశగా పెట్రోల్ & డీజిల్ ధరలు.. గత రెండు రోజులుగా పెరిగిన ధరలు ఎలా ఉన్నాయంటే
భారతదేశంలో గత కొన్ని నెలలుగా ప్రతి రోజు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్న సంగతి తెలిసిందే. అయితే సుమారు తొమ్మిది వారాలుగా పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉండిపోయాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎట్టకేలకు పెరిగిపోతున్నాయి.
ఇటీవల తమిళనాడు, కేరళ, పాండిచేరి, అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత, చమురు కంపెనీలు మరోసారి పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచనున్నాయి. భారతదేశంలో ఇంతకుముందు చివరిసారిగా ఫిబ్రవరి 23 న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచారు.
గత ఫిబ్రవరి నుంచి ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం మానేశాయి. కానీ ఇటీవల ఎన్నికలు ముగిసి ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత తొలిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారు.
MOST READ:ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, కానీ మనుషుల కోసం మాత్రం కాదు..
ఒకవైపు కరోనా వైరస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెనుభారంగా మారాయి. నేడు, పెట్రోల్ ధరను 19 పైసలు, డీజిల్ ధరను 21 పైసలు పెంచారు. నిన్న పెట్రోల్ ధరను లీటరుకు 15 పైసలు, డీజిల్ లీటరుకు 18 పైసలు పెంచారు.
ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. సుమారు 9 వారాల పాటు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచని కంపెనీలు నష్టాలను పూడ్చుకునేందుకు సన్నాహాలను సిద్ధం చేస్తూ ఒక్కసారిగా ధరలు పెంచుతున్నారు.
MOST READ:ఆక్సిజెన్ ట్యాంకర్లను దొంగిలిస్తున్నారు.. జిపిఎస్ ట్రాకర్తో అక్రమాలకు చెక్..
ఎన్నికల సమయంలో ధరలను నిలకడగా ఉంచి, చమురు కంపెనీలు ఎన్నికలు జరిగిన వెంటనే ధరలను పెంచడం ఇదే మొదటిసారి కాదు. గత అనేక ఎన్నికలలో చమురు కంపెనీలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. చమురు కంపెనీలు ఈ ధోరణిని అనుసరిస్తున్నాయి, ఎందుకంటే పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఎన్నికలను ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సాధారణ వాహనదారులను మాత్రమే కాకుండా మధ్యతరగతి వారిని కూడా చాలా ఇబ్బందులపాలుచేస్తుంది. పెట్రోల్, డీజిల్ ధర పెరిగితే, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆటోమాటిక్ గా పెరుగుతాయి.
MOST READ:వాహనప్రియులకు గుడ్ న్యూస్.. స్కోడా కుషాక్ బుకింగ్స్ ఎప్పుడో తెలిసిపోయింది
ఈ కారణంగా, పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రజల పట్టుదలను కేంద్ర ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదు. ఈ ధరల పెరుగుదల సామాన్య ప్రజలకు తలకు మించిన భారమవుతోంది