Just In
- 4 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 5 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 7 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 10 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు
చాలా మంది వాహనదారులకు లాంగ్ డ్రైవ్ చేయాలంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కువ భాగం యువకులే చేస్తారని తెలుసు. కానీ వృద్దులు కూడా లాంగ్ డ్రైవ్ చేస్తారన్న సంగతి చాలా అరుదుగా తెలిసి ఉంటుంది. ఇలాంటి లాంగ్ డ్రైవ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే ఒక వృద్ధ దంపతుల జంట ఇటీవల కరోనా మహమ్మారి వల్ల కన్ను మూశారు.. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
బెంగళూరు నగరానికి చెందిన 71 ఏళ్ల ఓంప్రకాష్ సిద్ధనంజప్ప మరియు అతని భార్య 66 ఏళ్ల సావిత్రి ఓంప్రకాష్ భారతదేశంలో చాలా చోట్ల తమ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై లాంగ్ డ్రైవ్ వెళ్లారు. వీరు బెంగళూరులోని జయనగర్ లో నివసించేవారు. వీరు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ వృద్ధ దంపతుల జంట ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ నిర్వహించిన రైడర్ మానియా కార్యక్రమంలో కూడా పాల్గొంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడం వల్ల గత సంవత్సరం దేశం మొత్తం లాక్ డౌ విధించబడింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా వ్యాపిస్తున్న సమయంలో వీరిని బయటకు వెళ్లకూడదని చెప్పారు.
MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI
అయితే, అవేమి పట్టించుకోకుండా ఈ జంట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు చెబుతున్నారు. ఇటీవల, ఈ జంట కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా గత బుధవారం ఓంప్రకాష్ మరణించారు. తరువాత శుక్రవారం సావిత్రి కన్నుమూసింది.
ఈ వృద్ద దంపతులు చనిపోయినట్లు మైసూర్కు చెందిన తమ స్నేహితుడు సన్నీ తెలియజేశాడు. ఈ జంట మరణంతో బెంగళూరుకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్ టీమ్ చాలా దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ జంట వయసు మీద పడుతున్నప్పయికి లాంగ్ డ్రైవ్ చేయడం నిజంగా ఆశ్చర్యమే.
MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు
ఓం ప్రకాష్ సిద్ధనంజప్ప తన 16 సంవత్సరాల వయస్సులో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి సన్నాహాలు సిద్ధం చేసారు. లాంగ్ డ్రైవ్ మీద వున్నా ఆసక్తే అతన్నీ కరోనా సమయంలో కూడా బయటకు వెళ్లేలా చేసింది. ఓం ప్రకాష్ రిటైర్డ్ డిప్యూటీ అకౌంటెంట్ అఫ్ ఇండియన్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ సర్వీస్ ఆఫీసర్.
ఇతనికి లాంగ్ డ్రైవ్ వెళ్లాలంటే చాలా ఇష్టం, చాలా కాలంగా కలిసి ప్రయాణిస్తున్న ఈ జంట రెండు రోజుల వ్యవధిలో మరణించడం నిజంగా విషాదకరమైన సంఘంటన. ఈ జంట తమ లాంగ్ డ్రైవ్ కి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ను ఉపయోగిస్తుంది. లాంగ్ డ్రైవ్ లో టెంట్ మరియు ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళ్లేవారు.
MOST READ:ఆంధ్రప్రదేశ్లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి
వాహనదారులకు లాంగ్ డ్రైవ్ అనేవి చాలా ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతే కాదు రకరకాలైన ప్రదేశాలు మరియు ప్రాంతాలకు వెళ్లడం వల్ల అక్కడి సంస్కృతులు మరియు సంప్రదాయాలు తెలుస్తాయి. నిజంగా లాంగ్ డ్రైవ్స్ అనేవి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.
Source:Timesofindia