Just In
- 7 hrs ago త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- 9 hrs ago బెంజ్ కారు కొన్న సోషల్ మీడియా సెన్సేషన్ 'కుషా కపిల'.. ధర తెలిస్తే షాకవుతారు!
- 9 hrs ago MG గ్లోస్టర్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఖర్చులన్నీ ఉచితంగా.. సంస్థ బంపర్ ఆఫర్.!!
- 11 hrs ago సెకండ్ హ్యాండ్ కార్లలో ఎక్కువగా వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారట.. ఆ కార్లపైనే క్రేజ్ ఎక్కువ!!
Don't Miss
- News పవన్ కళ్యాణ్ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Movies ఎన్టీఆర్ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ నిర్ణయం!
కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు
చాలా మంది వాహనదారులకు లాంగ్ డ్రైవ్ చేయాలంటే చాలా ఇష్టం. లాంగ్ డ్రైవ్ అంటే ఎక్కువ భాగం యువకులే చేస్తారని తెలుసు. కానీ వృద్దులు కూడా లాంగ్ డ్రైవ్ చేస్తారన్న సంగతి చాలా అరుదుగా తెలిసి ఉంటుంది. ఇలాంటి లాంగ్ డ్రైవ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే ఒక వృద్ధ దంపతుల జంట ఇటీవల కరోనా మహమ్మారి వల్ల కన్ను మూశారు.. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
బెంగళూరు నగరానికి చెందిన 71 ఏళ్ల ఓంప్రకాష్ సిద్ధనంజప్ప మరియు అతని భార్య 66 ఏళ్ల సావిత్రి ఓంప్రకాష్ భారతదేశంలో చాలా చోట్ల తమ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై లాంగ్ డ్రైవ్ వెళ్లారు. వీరు బెంగళూరులోని జయనగర్ లో నివసించేవారు. వీరు రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ వృద్ధ దంపతుల జంట ముఖ్యంగా రాయల్ ఎన్ఫీల్డ్ నిర్వహించిన రైడర్ మానియా కార్యక్రమంలో కూడా పాల్గొంది. కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించడం వల్ల గత సంవత్సరం దేశం మొత్తం లాక్ డౌ విధించబడింది. ప్రస్తుతం సెకండ్ వేవ్ మరింత ఉదృతంగా వ్యాపిస్తున్న సమయంలో వీరిని బయటకు వెళ్లకూడదని చెప్పారు.
MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI
అయితే, అవేమి పట్టించుకోకుండా ఈ జంట రాయల్ ఎన్ఫీల్డ్ బైక్పై తమ ప్రయాణాన్ని కొనసాగించినట్లు చెబుతున్నారు. ఇటీవల, ఈ జంట కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ కారణంగా గత బుధవారం ఓంప్రకాష్ మరణించారు. తరువాత శుక్రవారం సావిత్రి కన్నుమూసింది.
ఈ వృద్ద దంపతులు చనిపోయినట్లు మైసూర్కు చెందిన తమ స్నేహితుడు సన్నీ తెలియజేశాడు. ఈ జంట మరణంతో బెంగళూరుకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ బైకర్ టీమ్ చాలా దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ జంట వయసు మీద పడుతున్నప్పయికి లాంగ్ డ్రైవ్ చేయడం నిజంగా ఆశ్చర్యమే.
MOST READ:వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు
ఓం ప్రకాష్ సిద్ధనంజప్ప తన 16 సంవత్సరాల వయస్సులో లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి సన్నాహాలు సిద్ధం చేసారు. లాంగ్ డ్రైవ్ మీద వున్నా ఆసక్తే అతన్నీ కరోనా సమయంలో కూడా బయటకు వెళ్లేలా చేసింది. ఓం ప్రకాష్ రిటైర్డ్ డిప్యూటీ అకౌంటెంట్ అఫ్ ఇండియన్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ సర్వీస్ ఆఫీసర్.
ఇతనికి లాంగ్ డ్రైవ్ వెళ్లాలంటే చాలా ఇష్టం, చాలా కాలంగా కలిసి ప్రయాణిస్తున్న ఈ జంట రెండు రోజుల వ్యవధిలో మరణించడం నిజంగా విషాదకరమైన సంఘంటన. ఈ జంట తమ లాంగ్ డ్రైవ్ కి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్ను ఉపయోగిస్తుంది. లాంగ్ డ్రైవ్ లో టెంట్ మరియు ఇతర అవసరమైన వస్తువులు తీసుకెళ్లేవారు.
MOST READ:ఆంధ్రప్రదేశ్లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి
వాహనదారులకు లాంగ్ డ్రైవ్ అనేవి చాలా ఉత్సాహాన్ని అందిస్తాయి. అంతే కాదు రకరకాలైన ప్రదేశాలు మరియు ప్రాంతాలకు వెళ్లడం వల్ల అక్కడి సంస్కృతులు మరియు సంప్రదాయాలు తెలుస్తాయి. నిజంగా లాంగ్ డ్రైవ్స్ అనేవి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయి.
Source:Timesofindia