వాహ్.. మీరాబాయ్ చాను.. నీ మనసు బంగారం కాను
జపాన్ రాజధాని టోక్యో నగరంలో ఒలంపిక్ గేమ్స్ అంగరంగ వైభవంగా ఎంతో కోలాహలంగా దేశవిదేశాల నుంచి గొప్ప ఆటగాళ్లతో అట్టహాసంగా జరిగింది. ప్రపంచ దేశాలలోని గొప్ప ఆటగాళ్లకు దీటుగా నిలబడి, టోక్యో ఒలింపిక్స్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపటి అన్ని ఒలింపిక్స్ల కంటే ఇప్పుడు భారతదేశం ఎక్కువ పతకాలు కైవసం చేసుకుంది. ప్రస్తుతం 2020 టోక్యో ఒలింపిక్స్లో భారత్ మొత్తం ఏడు పతకాలు సాధించింది.

ఒలింపిక్ క్రీడల్లో జావెలిన్ త్రోలో భారతదేశపు ముద్దుబిడ్డ 'నీరజ్ చోప్రా' బంగారు పతకం సాధించాడు. 2020 ఒలింపిక్స్లో ఇది భారతదేశానికి మొదటి బంగారు పతకం. అథ్లెటిక్స్లో భారత్ బంగారు పతకం సాధించడం ఇదే మొదటిసారి. ఇది దేశ గర్వించదగ్గ విషయం.

మీరాబాయి చాను కొన్ని రోజుల క్రితం ఇదే ఒలింపిక్స్లో భారతదేశానికి మొదటి పతకం సాధించి శుభారంభం చేసింది. వెయిట్ లిఫ్టింగ్ పోటీలో రజత పతకాన్ని గెలుపొంది దేశానికీ వన్నె తెచ్చిన మీరాబాయి చాను చాలా కష్టాలను ఎదుర్కొంది.

మీరాబాయ్ చాను తన తల్లిదండ్రులతో కలిసి మణిపూర్ రాజధాని ఇంఫాల్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో నివసిస్తున్నారు. మీరాబాయి చాను తల్లితండ్రులకు ఎటువంటి లేదు. వారు నివసించే గ్రామం ప్రాథమిక సౌకర్యాలకు కూడా దూరంగా ఉంది. దీనికి తోడు ఆర్థిక పరిస్థితుల కారణంగా, మీరాబాయి చాను తన గ్రామం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంఫాల్ ట్రైనింగ్ సెంటర్ కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.

ట్రైనింగ్ సెంటర్ కి వెళ్లడానికి మీరాబాయి చాను ఆ రోడ్డు మీదుగా వెళ్లే ట్రక్కుల సహాయంతో ప్రయాణించేది. ఇలాంటి కష్టాలను ఎదుర్కొని చివరకు ఒలంపిక్స్ లో రజిత పతకాన్ని ముద్దాడింది. ఒలింపిక్స్లో పతకం గెలిచి ఇంటికి తిరిగి వచ్చిన మీరాబాయి చాను, తమకు లిఫ్ట్ ఇచ్చిన 150 లారీ డ్రైవర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ క్రమంలోనే లారీ డ్రైవర్లందరిని కూడా సన్మానించి, తన కృతజ్ఞతను తెలుపుకుంది.దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చక్కర్లు కొట్టాయి. తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆదుకున్న 150 మంది లారీ డ్రైవర్లందరికి కూడా చాను కృతజ్ఞత తెలుపుకుంది.

టోక్యో ఒలింపిక్స్లో మీరాబాయ్ చాను మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో 202 కేజీలు ఎత్తి రజత పతకం సాధించింది. తాము పతకం సాధించినందుకు భారతీయులందరూ ఎంతగానో సంతోషించారు. ముఖ్యంగా ఆమె స్వగ్రామంలో, గొప్ప విజయోత్సవాలు జరుపుకున్నారు.

నివేదికల ప్రకారం, మీరాబాయి చాను ప్రతి లారీ డ్రైవర్కు ఒక షర్ట్, మణిపూర్ కండువా మరియు భోజనం అందించినట్లు తెలిసింది. మీరాబాయి చానుకు లారీ డ్రైవర్లంటే చాలా ఇష్టం. ఎందుకంటే శిక్షణ సమయంలో లారీ డ్రైవర్లకు లిఫ్ట్ ఇవ్వకపోతే, ఆమె వెయిట్ లిఫ్టర్గా ఉండేది కాదు, రజత పతకాన్ని కూడా గెలిచేది కాదు.

ఈ సందర్భంగా చాను ట్రక్కు డ్రైవర్లను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్పారు. మీరా బాయి చాను చేసిన ఈ కృతజ్ఞతా చర్యకు ప్రజానీకం ప్రశంసించబడింది. మీరా బాయి చాను ప్రపంచం మొత్తాన్ని విజయవంతం చేసేలా చేసింది, కానీ తనకు సహాయం చేసిన వారిని మర్చిపోలేదు. ఇది వారి హృదయ విశాలతను చూపుతుంది. ఏది ఏమైనా సహాయం చేసిన వ్యక్తులకు మన కృతజ్ఞత చూపడం చాలా అవసరం. అదే మానవత్వం.


Click it and Unblock the Notifications








