Just In
- 9 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 9 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 11 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 12 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కరోనా బాధితులకోసం కొత్త హాస్పిటల్ ప్రారంభించిన ఒమేగా సెకి మొబిలిటీ; పూర్తి వివరాలు
భారతదేశంలో కరోనా వైరస్ అధికంగా వ్యాపిస్తున్న కారణంగా దేశంలో రోగులందరికి కావలసిన బెడ్లు మరియు ఆక్సిజన్ మరియు అంబులెన్సులు అందుబాటులో లేదు. ఈ కారణంగా చాలా మంది వాహనదారులు తమ వాహనాలను అంబులెన్సులుగా మార్చి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.
అయితే హాస్పిటల్ లో బెడ్ల కొరత కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫరీదాబాద్లోని సంజయ్ కాలనీలో ఒమేగా సెకి మొబిలిటీ ఫ్రీ కోవిడ్ -19 హాస్పిటల్ ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో ఒకేసారి 30 మంది రోగులకు సేవలు అందించగల ఈ హాస్పిటల్ కోసం ఒమేగా సెకి మొబిలిటీ సౌత్ కొరియా నుండి ఆక్సిజన్ సాంద్రతలను తీసుకువస్తుంది.
దీనితో పాటు కంపెనీ ఐఎమ్టి ఫరీదాబాద్లో ఆక్సిజన్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ యొక్క సెకండ్ వేవ్ కారణంగా, ఆసుపత్రుల కొరత ఎక్కువగా ఉంది, కాబట్టి ఆటో పరిశ్రమకు సంబంధించిన కంపెనీలు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చాయి.
MOST READ:80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం
ఇదే తరహాలో ఇప్పుడు ఒమేగా గ్రూప్ యొక్క ఒమేగా సెకి మొబిలిటీ ముందుకు వచ్చింది. కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి సంస్థ హర్యానా ప్రభుత్వంతో కలిసి ఒక హాస్పిటల్ ప్రారంభించింది. ఈ హాస్పిటల్ లో ప్రజలకు ఉచితంగా ట్రీట్మెంట్ చేయనున్నారు.
ఇటీవల దీనిని ఫరీదాబాద్ సిఎంఓ డాక్టర్ రణదీప్ సింగ్ పునియా, ఫరీదాబాద్ కౌన్సిలర్ జవీర్ ఖటన మరియు ఒమేగా సెకి మొబిలిటీ ప్రెసిడెంట్ ఉదయ్ నారంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రణదీప్ సింగ్ పునియా మాట్లాడుతూ "ఫరీదాబాద్ ప్రజల కోసం 50 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉందన్నారు.
MOST READ:వేలానికి సిద్ధంగా ఉన్న సూపర్ కండిషన్లో ఉన్న 42 ఏళ్ల మెర్సిడెస్ బెంజ్; వివరాలు
కరోనావైరస్ సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ మరియు బెడ్లకు భారీ డిమాండ్ ఉంది. కరోనా వైరస్ సోకిన వారికి ఈ హాస్పిటల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కరోనా సోకిన వారి పరిస్థితి క్షీణిస్తే అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉన్నాయి. కావున ఇటువంటి వారిని వెంటనే ఐసియులు కల హాస్పిటల్ లో చేర్పించవచ్చని చెప్పారు.
ఈ సందర్భంగా ఒమేగా సెకి మొబిలిటీ చైర్మన్ ఉదయ్ నారంగ్ మాట్లాడుతూ, ఈ మహమ్మారి సమయంలో వైద్య సదుపాయాలు పరిమితం కావడంతో వల్లచాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ఈ సమయంలో డబువా, సంజయ్ కాలనీ ప్రజలకు సహాయం చేయడానికి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు.
MOST READ:కూరగాయల అమ్మకానికి కొత్త టయోటా ఫార్చ్యూనర్.. వినటానికి వింతగా ఉన్నా, ఇది నిజమే
ప్రస్తుతం, ఆసుపత్రిలో నలుగురు డాక్టర్లు మరియు 20 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆసుపత్రి సామర్థ్యం 250 పడకలకు పెంచబడుతుంది. ఈ క్లిష్ట సమయంలో ఎంతో మంది ప్రజలకు ఇది ఆసరాగా ఉంటుంది. ఈ కారణంగానే ఆసుపత్రి ప్రారంభించామని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి సమయంలో, కరోనా వైరస్ పై పోరాడటానికి ఒమేగా సెకి మొబిలిటీ కంపెనీ అనేక చర్యలు తీసుకుంది. కంపెనీ తన రేజ్ ప్లస్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ ద్వారా 2 వ మరియు 3 వ శ్రేణి నగరాల్లో మొబైల్ ఆక్సిజన్ క్యాంపులను ఏర్పాటు చేస్తోంది. ఈ వాహనాల్లో ఆక్సిజన్ సాంద్రతలు ఉన్నాయి, కావున వీటి ద్వారా ఒకేసారి 25 నుండి 30 మందికి ఆక్సిజన్ను అందించవచ్చు.
MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు