ప్యారిస్ టెర్రరిస్ట్ల దాడిని రికార్డ్ చేసిన కారు కెమెరా
భారతదేశపు అతి పెద్ద వాణిజ్య నగరమైన ముంబయ్లో 2008లో జరగిని బాంబు దాడుల దేశాన్నే కుదిపేశాయి. అయితే ముంబాయ్ బాంబు దాడుల తరహాలోనే ప్యారిస్లో దాడులు జరిగిగాయి. ఆ సంఘటన యావత్ ప్రపంచాన్నే నిర్ఘాంతపోయేలా చేసింది.
ఈ దాడుల జరుగుతున్న నేపథ్యంలో ఒక కారులో ముందు భాగాన అమర్చిన కెమెరా ఆ సన్నివేశాలన బంధించింది. కారుకు ముందు భాగాన గల డ్యాష్క్యామ్ అనే పరకరం వాటిని రికార్డు చేసింది.
ఈ కారులో గల డ్యాష్క్యామ్ చెప్పిన మరిన్ని సంగతులు క్రింద గల కథనాల ద్వారా తెలుకుందాం రండి...

ట్యాక్సి డ్రైవర్ తన ట్యాక్సిని ప్యారిస్లోని రు డి కరోని అనే రెస్టారెంట్ దగ్గరలో ఉన్నప్పుడు తన కారు డ్యాష్ బోర్డ్లో గల కెమెరె అక్కడి సమీపంలో కాల్పులు జరుపుతుండగా రికార్డ్ చేసింది.

అయితే ట్యాక్సి డ్రైవర్ కథనం ప్రకారం ఇక్కడి దగ్గరలో కాల్పులు జరిపినపుడు ఆ శబ్దాన్ని విని అందరు పరుగు అందుకున్నారని తెలిపాడు. కొంత మంది దీనిని కొట్టి పారేశారు. కాని కారు డ్యాష్ బోర్డులో ఉన్న కెమెరా రికార్డు శబ్దం విన్న తరునవాత ఇది నిజం అని తెలిపారు.

కాల్పుల శబ్దం విన్న తరువాత కారులో గల డ్రైవర్ మరియు ప్యాసింజర్ ఈ విధంగా మాట్లాడుకున్నారు. ఎదో చెడు జరుగుతోంది, నాకు తెలిసి టెర్రరిస్టులు కాల్పులు జరుపుతున్నారని వెనుక కూర్చున్న ప్యాసింజర్ డ్రైవర్తో వివరించారు. అది నిజమే అని డ్రైవర్ కారును ఆ రెస్టారెంట్కు దూరంగా కారును వెనక్కు తిప్పాడు.

అయితే ఆ దాడులు జరుగుతున్నపుడు డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాలు దగ్గించుకున్నాని ఆ ప్యాసింజర్ వివరణ ఇవ్వడం జరింది.

ప్యారిస్లో జరిగిన ఈ భయంకరమైన దాడులలో దాదాపుగా 129 మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ప్యారిస్లో జరిగిన భీకర యుద్ద దాడిలో నెలకొన్న భయంకరపు కాల్పుల శబ్దాన్ని ఇక్కడ గల వీడియో ద్వారా వినవచ్చు.



Click it and Unblock the Notifications








