మెర్సిడెస్ బెంజ్ జి55 ఎస్యూవీని సొంతం చేసుకున్న పవన్

మెర్సిడెస్ బెంజ్ 1970వ సంవత్సర కాలంలో ఆర్మీ కోసం ఈ వాహనాన్ని రూపొందించింది. ఆ తర్వాతి కాలంలో ఇందులో సాధారణ ప్రజలకు కూడా ఉపయోగపడేలా ఈ మోడల్ను డిజైన్ చేసింది. ఆల్-వీల్ (ఫోర్-వీల్) డ్రైవ్ కలిగిన ఈ మెర్సిడెస్ బెంజ్ జి55 ఎస్యూవీ గంటకు గరిష్టంగా 250-260 కి.మీ. వేగంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్ల వ్యవధిలోనే 100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
ఇందులో ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), అన్ని వైపుల నుండి రక్షణ ఇచ్చేలా అమర్చిన ఎయిర్బ్యాగ్స్, వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని ధర సుమారు రూ.1.5 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








