పెట్రోల్ అసలు ధర 57 రూపాయలు మాత్రమే.. కానీ సెంట్రల్ టాక్స్, స్టేట్ వ్యాట్, డీలర్ కమీషన్ ఎంతో తెలుసా??
దేశంలో పెట్రోల్ లేకుండా ప్రజలు మనుగడ సాధించడం కష్టం. పెట్రోల్ ధర పెరిగితే ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. నిత్యావసర సరుకులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించడానికి పెట్రోల్ ఓ ప్రధాన వనరుగా ఉంది. భారతదేశం అంతటా లీటర్ పెట్రోల్ సగటున రూ .100కు అమ్ముడవుతోంది. రాష్ట్రాన్ని బట్టి ధర మారుతుంటాయి. అయితే రాష్ట్రాన్ని బట్టి పెట్రోల్ ధరలు ఎందుకు మారుతుంటాయి? అసలు మనం చెల్లిచే సొమ్ములో ఎంత పెట్రోల్ తయారు చేసే కంపెనీకి వెళ్తుంది? దీని వల్ల ప్రభుత్వానికి ఎంత మేలు జరుగుతుందనే విషయం చాలా మందికి తెలియదు. రాష్ట్రాల్లో పెట్రోల్ ధరను ఎలా నిర్ణయిస్తారో స్పష్టమైన వివరణ మీకోసం..
క్రూడ్ ఆయిల్: పెట్రోల్, డీజీల్తో సహా అన్ని ఇంధనాలు ముడి చమురు నుంచి తయారవుతాయి. భారత్ తన ముడి చమురులో 85 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల మరియు తగ్గుదల భారతదేశంలో విక్రయించే పెట్రోల్ మరియు డీజీల్ ధరలపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగితే భారత్ లోనూ పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతాయి.

అదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర తగ్గినప్పుడు, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా తగ్గుతాయి. కానీ గత కొన్నేళ్లుగా క్రూడాయిల్ ధరల పెరుగుదల, పతనం భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా ప్రభావితం చేయలేదు. దేశంలో కొన్ని రోజులుగా పెట్రోల్, డీజీల్ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం ధరలు స్థిరంగా ఉండటానికి ప్రధానం కారణం ఇదే.
విదేశీ మారకద్రవ్యం: భారతదేశం విదేశాల నుండి ముడి చమురును కొనుగోలు చేసినప్పుడు, అది US డాలర్లలో ట్రేడ్ అవుతుంది. అందువల్ల ముడిచమురు ధర అమెరికా డాలర్లలోనే ఉంటుంది. అమెరికా డాలర్ తో పోలిస్తే విదేశీ మారకంలో భారత కరెన్సీ విలువ పెరిగితే అది నేరుగా పెట్రోల్, డీజీల్ ధరలపై ప్రభావం చూపుతుంది.

ఉదాహరణకు ఈ రోజు ఒక అమెరికా డాలర్ భారత రూపాయి మారకం విలువ 83.43 రూపాయలుగా ఉంది. భవిష్యత్తులో ముడిచమురు ధరలు పెరిగితే ఈ విదేశీ మారకద్రవ్యం కారణంగా భారత్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భారత రూపాయి విలువ క్షీణిస్తే పెట్రోల్ ధర కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ పన్ను: క్రూడాయిల్ నుంచి తీసిన పెట్రోల్, డీజీల్, ఇతర ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్పై రూ.19.90 డీజీల్పై రూ.15.80 వివిధ పన్నులు విధిస్తోంది. ఈ పన్ను డబ్బు పెట్రోల్, డీజీల్ ధరల్లో భాగంగా ఉంటుంది.

రాష్ట్ర పన్నులు: పెట్రోల్, డీజీల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పన్నులు విధిస్తాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పన్ను విధానం ఉంటుంది. పెట్రోల్, డీజీల్ ధరలపై వ్యాట్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పన్నును వసూలు చేసి ఆదాయం పొందుతుంది.
ఉదాహరణకు తెలంగాణ రాష్ట్రంలో టాక్స్లు చూసుకుంటే లీటర్ పెట్రోల్ ధర రూ.109.66-నుంచి 110.88గా ఉంది. పెట్రోల్ ధర రూ. 57.35గా ఉంటే సెంట్రల్ టాక్స్ ఎక్సైజ్ డ్యూటీ కింద కేంద్రానికి రూ. 19.90, అదనంగా రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ రూ. 28.44, డీలర్ కమీషన్ అదనంగా రూ.3.97 గా ఉంటుంది.
ప్రస్తుతం భారతదేశంలో పెట్రోల్, డీజీల్పై జీఎస్టీలోకి తీసుకురాలేదు. పెట్రోల్, డీజీల్ ధరలను వసూలు చేసే సంస్థ ఉత్పత్తులను నేరుగా డీలర్షిప్లకు చేరవేస్తుంది. అక్కడి నుంచి డీలర్షిప్లు కమీషన్ పద్ధతిలో రిటైల్ చేస్తుంటాయి. ఇందుకోసం వారికి లీటరుకు కొంత మొత్తాన్ని కమీషన్గా తీసుకుంటారు. డీలర్ చేసిన అమ్మకాల మొత్తాన్ని బట్టి కమీషన్ అతడికి అందుతుంది.


Click it and Unblock the Notifications








