Just In
- 26 min ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 1 hr ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 2 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- 2 hrs ago దిశా పటానీ కార్ల ప్రపంచం చూసారా.. చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..
Don't Miss
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Movies Till Square Review: నాన్ స్టాప్ ఫన్ అండ్ లాఫింగ్ రైడ్.. టిల్లు స్క్వేర్ మూవీ రివ్యూ!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రూ. 115 కి చేరిన ఇంధన ధరలు: దేశంలో ఈ రోజు ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
భారతదేశంలో గత కొన్ని రోజులుగా వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈరోజు మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు తారా స్థాయికి చేరాయి. ఇంధన కంపెనీలు వరుసగా ఆరో రోజు రిటైల్ ఇంధన ధరలను భారీగా పెంచేసాయి. తాజా నివేదికల ప్రకారం ధరల పెరుగుదల తరువాత ఈ రోజు కలకత్తా నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 110 కి చేరుకోగా, దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ. 115 కి చేరింది.
అయితే భారత రాజధాని నగరం ఢిల్లోలో ఈ రోజు పెట్రోల్ ధర ధర 35 పైసలు పెరిగి, లీటరుకు పెట్రోల్ ధర రూ.109.34 చేరింది. అదేవిధంగా డీజిల్ ధర ఢిల్లీలో రూ. 98.07 కు చేరింది. అదేవిధంగా ముంబైకి విషయానికి వస్తే, ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. రూ.115.15 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 106.23 కు చేరింది.
ధరల పెరుగుదల తరువాత కలకత్తా నగరంలో ఇప్పుడు లీటరు పెట్రోల్ ధర రూ. 110.15 కు చేరింది. ఇక డీజిల్ ధరల విషయానికి వస్తే, లీటరు డీజిల్ ధర రూ. 101.56 కు పెరిగింది. ఇక తమిళనాడు (చెన్నై) లో లీటరు పెట్రోల్ ధర రూ. 106.35 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 102.59 గా ఉంది.
తెలుగు రాష్ట్రమైన తెలంగాణ హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర ఈ రోజు రూ. 114.12 కాగా, లీటరు డీజిల్ ధర రూ. 107.4 కి చేరింది. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.113.15కు విక్రయిస్తుండగా, డీజిల్ ధర రూ. 104.09కి పెరిగింది. అయితే రాజస్థాన్ సరిహద్దు పట్టణమైన శ్రీ గంగానగర్లో పెట్రోలు-డీజిల్ అత్యధిక ధరకు విక్రయిస్తున్నారు. ఇక్కడ పెట్రోలు ధర లీటరుకు రూ. 121.62 అనూహ్య స్థాయికి చేరుకుంది, అయితే డీజిల్ ధర లీటరు రూ. 112.52 కి చేరి, దేశంలోని అనేక ప్రధాన నగరాల్లోకంటే ఎక్కువగా ఉంది.
సెప్టెంబర్ 28 నుంచి పెట్రోల్ ధర 25 రెట్లు పెరగడంతో లీటరుకు రూ. 8.15 పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి ఇప్పటి వరకు 28 పెంపుదలలో డీజిల్ ధర లీటరుకు రూ. 9.45 పెరిగింది. ఈ ఏడాది మే 4 మరియు జూలై 17 మధ్య, భారతదేశంలో పెట్రోల్ ధరలు లీటరుకు రూ. 11.44 పెరగగా, డీజిల్ ధర 10 వారాల్లో రూ. 9.14 పెరిగింది.
రోజురోజుకి చమురు ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి, అయితే ఈ పెరుగుదలకు కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే,
గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ఒక బ్యారెల్ ధర రూ. $ 85 కి చేరుకుందని, దీని కారణంగా ఇంధన రిటైల్ ధర నిరంతరం పెరుగుతోందని కొన్ని నివేదికల ద్వారా తెలుస్తుంది. రోజురోజకి పెరుగుతున్న ఇంధన ధరల నుంచి ఉపశమనం కోసం భారత ప్రభుత్వం సౌదీ అరేబియా, రష్యా వంటి చమురు ఎగుమతి దేశాలతో చర్చలు జరుపుతోంది.
అయితే, ఈ చర్చలు ఇప్పటివరకు ఎటువంటి ఫలితాలను ఇవ్వలేదు, ఒక వేళా ఈ చర్చలు సఫలమైతే దేశంలో ఇంధన ధరలు బాగా తగ్గే అవకాశం ఉంటుంది. అయితే దీనిపై ఎటువంటి స్పందన రాలేదు, కావున ఇంధన ధరలు తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి.
మీ నగరంలో లేటెస్ట్ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను టెస్ట్ చేయడం ఎలా?
రోజురోజుకి అమాంతం ధరలు పెరుగుతున్న సమయమూ ఏ నగరంలో ఎంత ధర ఉంది అని మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ పెట్రోల్ మరియు డీజిల్ ధరలను కనుగొనడం చాలా సులభం. మీరు ఇప్పుడు మీ స్మార్ట్ఫోన్ నుండి రోజువారీ ఇంధన ధరలను కూడా సులభంగా తెలుసుకోవచ్చు.
తాజా ఇంధన ధరలను తెలుసుకోవడానికి మీరు ఇండియన్ ఆయిల్ SMS సర్వీస్ మొబైల్ నంబర్ 9224992249కి SMS పంపి తెలుసుకోవచ్చు. లేదా మెసేజ్ ద్వారా తాజా ధరలను తెలుసుకోవడానికి, మెసేజ్ బాక్స్లో - RSPPetrol Pump Dealer Code అని టైప్ చేయండి. మీరు ఇంటర్నెట్ని సందర్శించడం ద్వారా మీ ప్రాంతం యొక్క RSP కోడ్ని తనిఖీ చేయవచ్చు. సందేశం పంపిన తర్వాత, పెట్రోల్ మరియు డీజిల్ తాజా ధర గురించి మీకు తెలియజేయబడుతుంది. ఇది ఆ రోజు ధరలను మీకు తెలుపుతుంది.
భారతదేశంలో రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు సాధారణ ప్రజలకు చాలా భారాన్ని మోపుతోంది. అయితే ఈ సమయంలో ఇంధన ధరల నుంచి కొంత ఉపశమనం పొందటానికి ఇప్పుడు ఎక్కుమంది ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో సాధార వాహనాల వినియోగం కంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఎక్కువగా ఉంటుంది.