Just In
- 12 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 14 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 16 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 19 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Movies Karthika Deepam 2 నా బిడ్డకు దూరంగా ఉండు.. కార్తీక్కు దీప షాక్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు
భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న సోమవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం మళ్ళీ వరుసగా ఐదవ వారంలో పెరిగాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ. 100 దాటింది.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విడుదల చేసిన ధర నోటిఫికేషన్ ప్రకారం లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు 26 పైసలు, లీటర్ డీజిల్ ధర 33 పైసలు వరకు పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు 18 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏ మాత్రం పెంచలేదు.
కానీ ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీయే ఎన్నికలు ముగిశాక పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వరుసగా ఇది ఐదవరోజు. మహారాష్ట్రలోని పర్భానిలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 గా ఉంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటింది.
MOST READ:ఆంధ్రప్రదేశ్లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వ్యాట్ మరియు సరుకు వంటి స్థానిక పన్నులను బట్టి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. గత ఒక వారంలో పెట్రోల్ ధర లీటరుపై రూ. 1.14, డీజిల్ ధర లీటరుపై రూ. 1.33 పెరిగినట్లు తెలిసింది. ఈ ధరలు సామాన్యుడిపై పెనుభారాన్ని మోపనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతాయి. కావున ఉదయం 6 నుండి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఎక్సైజ్ టాక్స్ మరియు ఇతర టాక్స్ కలిపిన తరువాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచబడతాయి. వీటన్నిటిని కలిపిన తర్వాత కొత్త ధర అమల్లోకి వస్తుంది.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో
దేశంలో అనేక పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ మారక రేట్లు మరియు ముడి చమురు ధరల ఆధారంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ పెరిగే ధరలపై ప్రభావితమవుతాయి.
ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం, పెట్రోల్ మరియు డీజిల్ ధర తెలుసుకోవటానికి, మొబైల్లో ఆర్ఎస్పి టైప్ చేసి, సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి 9224992249 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పెరిగిన పెట్రోల్ ధరలు తెలుస్తాయి.
ఒక పక్క కరోనా మహమ్మారి మరో పక్క పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజలకు చాలా కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ సమయుడికి మోయలేని భారంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు దీనిపై స్పందించి వీలైనంతవరకు ప్రజలకు సానుకూలంగా ఉండే చర్యలు తీసుకోవాలి.