Just In
- 55 min ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 1 hr ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 2 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 3 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Movies The Goat Life Collections ఆడుజీవితం భారీ ఓపెనింగ్స్.. పృథ్వీరాజ్ సుకుమారన్కు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వరుసగా 5 వ రోజు పెరిగిన పెట్రోల్ & డీజిల్ ధరలు; వివరాలు
భారతదేశంలో రోజురోజుకి పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిన్న సోమవారం ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం మళ్ళీ వరుసగా ఐదవ వారంలో పెరిగాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ. 100 దాటింది.
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విడుదల చేసిన ధర నోటిఫికేషన్ ప్రకారం లీటరు పెట్రోల్ ధర ఇప్పుడు 26 పైసలు, లీటర్ డీజిల్ ధర 33 పైసలు వరకు పెరిగింది. ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు 18 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలను ఏ మాత్రం పెంచలేదు.
కానీ ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీయే ఎన్నికలు ముగిశాక పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రారంభమైంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగటం వరుసగా ఇది ఐదవరోజు. మహారాష్ట్రలోని పర్భానిలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 100.20 గా ఉంది. గతంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో లీటరు పెట్రోల్ ధర రూ. 100 దాటింది.
MOST READ:ఆంధ్రప్రదేశ్లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు వ్యాట్ మరియు సరుకు వంటి స్థానిక పన్నులను బట్టి రాష్ట్రానికి మారుతూ ఉంటాయి. గత ఒక వారంలో పెట్రోల్ ధర లీటరుపై రూ. 1.14, డీజిల్ ధర లీటరుపై రూ. 1.33 పెరిగినట్లు తెలిసింది. ఈ ధరలు సామాన్యుడిపై పెనుభారాన్ని మోపనున్నాయి.
ప్రతి రోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్ మరియు డీజిల్ ధరలు మారుతాయి. కావున ఉదయం 6 నుండి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఎక్సైజ్ టాక్స్ మరియు ఇతర టాక్స్ కలిపిన తరువాత పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెంచబడతాయి. వీటన్నిటిని కలిపిన తర్వాత కొత్త ధర అమల్లోకి వస్తుంది.
MOST READ:ఆనంద్ మహీంద్రా ట్వీట్; బహుశా.. ఇదోరకమైన సామజిక దూరమేమో
దేశంలో అనేక పన్నుల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ మారక రేట్లు మరియు ముడి చమురు ధరల ఆధారంగా రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ ఈ పెరిగే ధరలపై ప్రభావితమవుతాయి.
ప్రతి రోజూ పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ధరలను ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ ప్రకారం, పెట్రోల్ మరియు డీజిల్ ధర తెలుసుకోవటానికి, మొబైల్లో ఆర్ఎస్పి టైప్ చేసి, సిటీ పిన్ కోడ్ ఎంటర్ చేసి 9224992249 కు ఎస్ఎంఎస్ పంపడం ద్వారా పెరిగిన పెట్రోల్ ధరలు తెలుస్తాయి.
ఒక పక్క కరోనా మహమ్మారి మరో పక్క పెరుగుతున్న పెట్రోల్ ధరలు ప్రజలకు చాలా కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ సమయుడికి మోయలేని భారంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు దీనిపై స్పందించి వీలైనంతవరకు ప్రజలకు సానుకూలంగా ఉండే చర్యలు తీసుకోవాలి.