Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 13 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు ఈ మోయలేకపోతున్నారు. ఇంధన ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.
నిత్యావసరాల ధరలు పెరిగితే సామాన్య ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేయడానికి కూడా ఇది ప్రధాన కారణం. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రజలకు ఒక శుభవార్త ఇచ్చారు. శీతాకాలం చివరి నాటికి పెట్రోలియం ఉత్పత్తుల ధర తగ్గుతాయని అయన తెలిపారు.
పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన ఈ మాటలు ప్రజలలో కొంత ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని గురించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రజలను ప్రభావితం చేసిందన్నారు.
శీతాకాలం ముగియడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగేకొద్దీ భారత మార్కెట్లో కూడా ధర కూడా పెరుగుతుంది. శీతాకాలంలో ఇది సాధారణం. శీతాకాలం ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని ఆయన వివరించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా తగ్గిస్తారనే దానిపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఆయన చేసిన ఈ ప్రకటన వాహనదారులలో ఏర్పడిన ఆందోళన తగ్గిస్తుంది. తమిళనాడు, పాండిచేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు భావిస్తున్నారు.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
గతంలో చమురు కంపెనీలు భారతదేశంలో అనేక అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో పెట్రోల్ మరియు డీజిల్ తగ్గాయి. అన్ని ఇప్పుడు భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాహనదారులు అభిప్రాయపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో, భారతదేశంలో అధిక మైలేజ్ అందించే బైకుల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ, కొంతమంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఇంధన ధరలు ఇలాగె ఉంటె సమీప భవిష్యత్ లో రోడ్లపై తిరిగే ఎల్రక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]