Just In
- 12 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 13 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 14 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 15 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- News Money astrology March 29th: ఈ రాశులవారికి ధనలక్ష్మీ కటాక్షం!!
- Movies Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్కు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. ఇంతకీ హిట్టేనా అంటే!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
ఇతర దేశాలతో పోలిస్తే, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సామాన్య ప్రజలు ఈ మోయలేకపోతున్నారు. ఇంధన ధరల పెరుగుదల నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది.
నిత్యావసరాల ధరలు పెరిగితే సామాన్య ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని ప్రజలు డిమాండ్ చేయడానికి కూడా ఇది ప్రధాన కారణం. కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రజలకు ఒక శుభవార్త ఇచ్చారు. శీతాకాలం చివరి నాటికి పెట్రోలియం ఉత్పత్తుల ధర తగ్గుతాయని అయన తెలిపారు.
పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పిన ఈ మాటలు ప్రజలలో కొంత ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది. దీని గురించి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ, అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదల ప్రజలను ప్రభావితం చేసిందన్నారు.
శీతాకాలం ముగియడంతో ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరిగేకొద్దీ భారత మార్కెట్లో కూడా ధర కూడా పెరుగుతుంది. శీతాకాలంలో ఇది సాధారణం. శీతాకాలం ముగియడంతో పెట్రోల్, డీజిల్ ధరలు ఖచ్చితంగా తగ్గుతాయని ఆయన వివరించారు.
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా తగ్గిస్తారనే దానిపై మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఆయన చేసిన ఈ ప్రకటన వాహనదారులలో ఏర్పడిన ఆందోళన తగ్గిస్తుంది. తమిళనాడు, పాండిచేరి, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల తరువాత పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని వాహనదారులు భావిస్తున్నారు.
MOST READ:సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
గతంలో చమురు కంపెనీలు భారతదేశంలో అనేక అసెంబ్లీ మరియు లోక్ సభ ఎన్నికలలో పెట్రోల్ మరియు డీజిల్ తగ్గాయి. అన్ని ఇప్పుడు భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ 5 రాష్ట్రాల్లో ఓటింగ్ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వాహనదారులు అభిప్రాయపడ్డారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో, భారతదేశంలో అధిక మైలేజ్ అందించే బైకుల అమ్మకాలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ, కొంతమంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఇంధన ధరలు ఇలాగె ఉంటె సమీప భవిష్యత్ లో రోడ్లపై తిరిగే ఎల్రక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
MOST READ:కార్ టైర్ మారుస్తూ కనిపించిన డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి [వీడియో]