Just In
- 7 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 8 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 9 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Movies ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
చదివేది డాక్టరేట్, చేసేది దొంగతనం.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా 300 పైనే
దేశంలో వాహన దొంగతనాలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. పోలీసులు ఈ దొంగతనాలను పూర్తిగా రూపుమాపడానికి ఎన్ని కఠినమైన చర్యలు తీనుకుంటున్నప్పటికీ వాహన దొంగతనాలను మాత్రం పూర్తిగా నిలువరించలేకపోతున్నారు. అంతే కాకుండా వాహన తయారీదారులు కూడా దొంగతనాలు జరగకుండా ఉండటానికి లేటెస్ట్ ఫీచర్స్ కూడా వాహనాల్లో పొందుపరుస్తున్నారు. దొంగలు కూడా అధునాతన పరికరాలను వినియోగించి సులభంగా దొంగతనాలు చేస్తున్నారు.
ఇటీవల వెల్లడైన ఒక నివేదిక ప్రకారం, ఇద్దరు దొంగలు ఏకంగా 300 కార్లు దొంగలించినట్లు తెలిసింది. ఈ దొంగతనాలకు పాల్పడిన వారు ఉన్నత చదువు చదువుకున్న వారే. ఇందులో ఒకరు పీహెచ్డీ గ్రాడ్యుయేట్ కాగా మరొకరు ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్ధి అని తెలిసింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, ఒకరు మెహతాబ్గా మరొకరు తాద్రిష్ గా గుర్తించారు. మెహతాబ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అయిన నెట్ పాసయ్యాడు, అంతే కాకుండా డాక్టరేట్ (పీహెచ్డీ) చేస్తున్నట్లు తెలిసింది. తాద్రిష్ ఢిల్లీ యూనివర్సిటీ వంటి గొప్ప కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. అంతే కాదు అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ కూడా పొందాడు.
వీరిద్దరూ సుమారు 300 కార్లను దొంగలించినట్లు పోలీసుల కథనం ప్రకారం తెలిసింది. కార్లు మాత్రమే కాదు బైకులు కూడా దొంగతనం చేసినట్లు తెలిసింది. దొంగలించబడిన చాలా వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేశారు.
అయితే పోలీసులు ఏ వాహనాలను పట్టుకున్నారు అనేదాని గురించి మాత్రం ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు. ప్రస్తుతం వాహన దొంగతనం ముఠాలోని ఇద్దరు సభ్యులు మాత్రమే పట్టుబడ్డారు. దొంగతనానికి సంబంధించి మణిపూర్ నుంచి 12 ఖరీదైన కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ముఠాలోని ఇతర సభ్యులను అరెస్టు చేయడానికి మణిపూర్ పోలీసులు శోధిస్తున్నారు. ఈ ఆపరేషన్లో మణిపూర్ పోలీసులతో ఢిల్లీ పోలీసులతో చేతులు కలిపారు. త్వరలో వీటిని కూడా పట్టుకునే అవకాశం ఉంది.
పోలీసులు విడుదల చేసిన ఫోటోలలో టయోటా ఫార్చ్యూనర్, హ్యుందాయ్ క్రెటా, మహీంద్రా స్కార్పియో, మారుతి సుజుకి విటారా బ్రెజ్జ వంటి వాటితో సహా పలు కార్లు ఉన్నాయి. ఈ కార్లన్నీ దేశీయ మార్కెట్లో ప్రాచుర్యం పొందిన కార్లు, ఈ కార్లను పోలీసులు విడుదల చేసిన ఫొటోలో చూడవచ్చు.