భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో ప్రధాని మోదీ.. తమ భవిష్యత్తు ఉత్పత్తులను వివరించిన TVS
టీవీఎస్ మోటార్ కంపెనీ దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024లో తమ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఈ ఎక్స్పోను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. దేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ వృద్ధి, ఈ రంగం భవిష్యత్తుపై ఆయన మాట్లాడారు. టీవీఎస్ ఏర్పాటు చేసిన ప్రదర్శనలను ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2024లో టీవీఎస్ తమ కంపెనీ నుంచి కొన్ని వాహనాలు, ఇతర అధునాతన టెక్నాలజీని ప్రదర్శిస్తోంది. 2020 లో ఆ కంపెనీకి చెందిన బ్రిటిష్ తయారీదారు నార్టన్ మోటార్ సైకిల్స్ V4CR కేఫ్ రేసర్ని ఈ ఈవెంట్లో సంస్థ ప్రదర్శించింది. నార్టన్ వి4సిఆర్ భారత్లో అరంగేట్రం చేయనుంది. ఇది 1200 సిసి వి 4 ఇంజిన్ తో పనిచేస్తుంది, ఇది 185 బిహెచ్ పి మరియు 125 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్ పూర్తిగా సర్దుబాటు చేయగల ఒహ్లిన్స్ సస్పెన్షన్, పెద్ద బ్రెంబో డిస్క్ బ్రేకులు (ముందు భాగంలో ట్విన్ 330 మిమీ మరియు వెనుక భాగంలో సింగిల్ 245 మిమీ), పూర్తి కార్బన్-ఫైబర్ బాడీతో పాటు అల్యూమినియం లేదా కార్బన్ ఫైబర్ చక్రాలు మరియు కార్బన్ ఫైబర్ అండర్ సీట్ ఫ్యూయల్ ట్యాంక్ని కలిగి ఉంది. ఈ ప్రదర్శనలో ఈ బైక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ప్రీమియం టీవీఎస్ ఎక్స్ ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ స్కూటర్తో పాటు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరియు బీఎండబ్ల్యూ మోటోరాడ్ భాగస్వామ్యంతో హోసూర్ ప్లాంట్లో ఉత్పత్తి చేసే అపాచీ 310 సిరీస్ టూవీలర్స్తో సహా ఇతర కంపెనీ బ్రాండ్ వాహనాలను కూడా టీవీఎస్ ప్రదర్శిస్తోంది. ప్రధాని వీటిని సందర్శించడం ప్రత్యేకతను సంతరించుకుంది.

ఈ ఎక్స్పో పై ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సుదర్శన్ వేణు మాట్లాడుతూ.. సంస్థ యొక్క పూర్తి వివరాలు రాబోయే ప్రొడక్ట్స్ గురించి ప్రధాన మంత్రి అడిగి తెలుసుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు. ఈ ప్రోత్సాహం మాకు మరింత శక్తిని అందిస్తుందని ఆయన ఉద్ఘాటించారు. భవిష్యత్తులో భారత్ ఆటోరంగంలో వివిధ ఆవిష్కరణలకు మరియు ప్రపంచ తయారీ స్థావరంగా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టీవీఎస్ మోటార్ ఈ ప్రయాణంలో తన వంతు పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందని.. మా ప్రధాన లక్ష్యం ఇంజనీరింగ్ మరియు R& D అని ఆయన తెలిపారు. దాదాపు 2000లకు పైగా అభిరుచి కలిగిన ఇంజనీర్లచే సంస్థలో పలు ఆవిష్కరణలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మా వినియోగదారులకు పూర్తి స్థాయిలో సాంకేతికత, కనెక్టివిటీ మరియు అత్యాధునిక డిజైన్లతో కనెక్ట్ చేయడం మా విజన్ అని ఆయన తెలిపారు.

భవిష్యత్ సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు డిజిటల్ సామర్థ్యాల రూపకల్పన, ఇతర సంస్థ అభివృద్ధి మరియు విస్తరణ కోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడికి సంస్థ సిద్ధంగా ఉంది. ప్రస్తుంత TVS భారతదేశంలో బ్యాటరీ తయారీ, బ్యాటరీ నిర్వహణ వ్యవస్థ, వాహన నియంత్రణ యూనిట్ మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో సహా ఎండ్-టు-ఎండ్ ఇన్-హౌస్ EV మరియు కనెక్ట్ చేయబడిన సర్వీస్లను సంస్థ అందిస్తోంది.
TVS భారత్ మొబిలిటీ ఎక్స్పో 2024లో అంతర్జాతీయ ఒప్పందాలు మరియు పెట్టుబడులపై సంస్థ దృష్టి సారించింది. అలాగే EVలు, బైక్లు మరియు టెక్లలో తమ సంస్థ ప్రదర్శిచింది. అదే సమయంలో తన ఫ్యాక్టరీలలో మరియు వెలుపల మహిళలు మరియు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సైతం సంస్థ దృష్టి సారించింది. అందులో భాగంగానే సంస్థ పలు సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications








