Just In
- 14 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 14 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 15 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 16 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Movies యాంకర్ దీపికా పిల్లి బెడ్ వీడియో వైరల్: కళ్లు చెదిరేలా ప్యాంటు లేకుండా!
- News నిప్పుల కుంపటిలా ఏపీ.. ఈ జిల్లాలలో వడగాలులు.. జాగ్రత్త; వాతావరణశాఖ అలెర్ట్!!
- Sports రోహిత్ శర్మ ప్లేస్లో..!!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్డౌన్లో చిన్న బిడ్డ పుట్టిన రోజుకి పోలీస్ ఎస్కార్ట్, ఎక్కడో తెలుసా ?
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచదేశాలతో వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్ మహమ్మారి భారతదేశంలో కూడా విస్తరించింది. కోవిడ్ -19 వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి భారతదేశంలో లాక్డౌన్ ప్రస్తుతం మే 17 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన జారీ చేసింది.
మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు భారతదేశంలో మొదటి దశ లాక్డౌన్ అమలు చేయబడింది. తరువాత దీనిని మే 3 వరకు పొడిగించారు. లాక్డౌన్ యొక్క మూడవ దశ ఇప్పుడు మే 17 వరకు పొడిగించబడింది. లాక్డౌన్ కారణంగా ప్రజలు తమ ఇళ్ళనుంచి బయటికి రాకూడదని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.
భారతదేశంలో కరోనా వల్ల వివాహాది శుభకార్యాలు కూడా వాయిదా పడ్డాయి. ఆఖరికి పుట్టినరోజులు కూడా జరుపుకోవడం లేదు. సాధారణంగా పుట్టినరోజులు ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైనవి. పిల్లల మొదటి పుట్టినరోజు అయితే, తల్లిదండ్రులు దీనిని జరుపుకోవడానికి అనేక ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తారు.
MOST READ:గుడ్ న్యూస్.. కరోనా నుంచి కాపాడే రోబో వచ్చేసింది
కానీ కరోనా లాక్ డౌన్ అన్ని రకాల శుభకార్యాలు విచ్ఛిన్నం చేసింది. కానీ ఉత్తర ప్రదేశ్లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. లాక్డౌన్ మధ్య తమ బిడ్డ మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఉత్తర ప్రదేశ్ పోలీసు శాఖ ఎస్కార్ట్ పంపింది.
ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మధురలో జరిగింది. బాలిక మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు పోలీసు వాహనాలు కవాతు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో ఉత్తరప్రదేశ్ పోలీసుల అధికారిక వాహనాలను చూడవచ్చు.
MOST READ:వావ్ అమేజింగ్ : ఇది రెండు చక్రాలపై నడిచే ట్రాక్టర్..!
కాన్వాయ్లో రెండు బజాజ్ పల్సర్ బైక్లు, తరువాత మూడు టయోటా ఇన్నోవా మరియు చివర్లో రెండు బజాజ్ పల్సర్ బైక్లు ఉన్నాయి. ఈ వాహనాలన్నీ వేర్వేరు రంగుల బెలూన్లతో అలంకరించబడి ఉంటాయి.
ఈ వాహనాలు సైరన్ తో పిల్లల ఇంటికి వస్తాయి. పోలీసులు ఫేస్ షీల్డ్ మరియు గ్లౌజులు ధరించి పిల్లలకి కేక్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
MOST READ:కొత్త ఇండియన్ ఎఫ్టీఆర్ బైక్ : ఇది చాలా కాస్ట్ గురూ
ఉత్తర ప్రదేశ్ పోలీసులు తీసుకున్న ఈ చర్య ఎంతో ప్రశంసనీయం. ఇప్పటికే చెప్పినట్లుగా, లాక్డౌన్ కారణంగా వివాహాలతో సహా అనేక సంఘటనలు వాయిదా పడుతున్నాయి. ఈ కారణంగా పిల్లల పుట్టినరోజును సాధారణంగా పోలీసులు జరుపుతున్నారు. సాధారణంగా, రాజకీయ నాయకులు మరియు వివిఐపిలు నడిపే వాహనాలతో పాటు ఎస్కార్ట్ దళాలు సైర్ అవుతాయి. ఈ కార్యక్రమంలో శిశువు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి ఎస్కార్ట్ దళాలు వచ్చాయి.
భారతదేశంలో కోవిడ్ -19 వైరస్ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ కారణంగా లాక్డౌన్ను మే 17 వరకు పొడిగించిన విషయం అందరికి ఎలిసిందే. కానీ ఈ మూడవదశ లాక్డౌన్ లో కొన్ని మినహాయింపులు కొన్ని వ్యాపారాలను నిర్వహించడానికి అనుమతించబడతాయి.
MOST READ:ఓలా క్యాబ్ లో ప్రయాణించాలా, అయితే ఇవి తప్పకుండా పాటించాల్సిందే
లాక్డౌన్ నుండి మినహాయింపు ఉన్నప్పటికీ, సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండటం మంచిది. కోవిడ్ -19 వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకునే ఏకైక మార్గం సామాజిక అంతరాలను నిర్వహించడం. లాక్డౌన్ లో అనవసరంగా బయటకు వస్తే, పోలీసులు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. గతంలో వాహనాలపై మరియు వాహదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. కరోనా వైరస్ నివారణకు పోరాడుతున్న ప్రభుత్వాలకు ప్రజలు కూడా మద్దతుని ప్రకటించాలి.