వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోడం జరుగుతోంది. ముంబై పోలీసు శాఖ ఇటీవల అక్కడి స్థానికులకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చింది. ముంబైలో ఉద్యోగం లేకుండా ఉండేవారు 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

ముంబై పోలీసులు ఆదివారం కరోనా నివారణలో భాగంగా కొన్ని కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ మార్గదర్శకాలలో భాగంగా సరైన కారణం లేకుండా డ్రైవర్ ఇంటి నుంచి బయటికి వచ్చినట్లైతే ఆ వాహనదారుని యొక్క వాహనం జప్తు చేయబడుతుంది.

వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

మహారాష్ట్రలో కరోనా వైరస్ సంక్రమణ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముంబై నగరంలో మాత్రమే కాకుండా, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రజల సంఖ్య మరింత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేయబడ్డాయి.

MOST READ:బిఎస్-6 హోండా ఎక్స్-బ్లేడ్ 160 బైక్ : ధర & ఇతర వివరాలు

వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

ప్రజలు షాపింగ్ లేదా ఇతర కార్యకలాపాలకు వెళితే, వారు తమ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలోనే అలాంటి పని చేయాల్సి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఎవరైనా ఈ సూచనలను ఉల్లంఘిస్తే, అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

ముంబై పోలీసులు ఇవి మాత్రమే కాకుండా మరిన్ని సూచనలు జారీ చేశారు. అవసరమైన పని మినహా అన్ని బహిరంగ కార్యకలాపాలను పూర్తిగా మూసివేయాలని ఆయన అన్నారు. ఇంటి నుండి బయలుదేరే ముందు ఫేస్ మాస్క్ ధరించడం తప్పనిసరి.

MOST READ:బుడతడు ఉపయోగించడానికి బుల్లి కారు తయారుచేసిన తండ్రి

వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

మార్కెట్లు మరియు సెలూన్‌లకు కూడా ఇది వర్తిస్తుంది. వాహనదారులు తమ ఇంటి నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కెట్లు మరియు సెలూన్‌లను మాత్రమే సందర్శించాలని సూచించారు. ఈ పరిధిని మించి కొనుగోలు చేయడం నిషేధించబడింది.

వాహదారులు అక్కడ 2 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఏమవుతుందో తెలుసా ?

ఆఫీసులు మరియు వైద్య అత్యవసర సేవల కొరకు ప్రయాణించే వారికి మాత్రమే 2 కి.మీ కంటే ఎక్కువ ప్రయాణించడానికి అనుమతి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. వీటితో పాటు సామజిక దూరాన్ని పాటించాలని పోలీసులు కఠినమైన సూచనలు చేసారు.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : పండ్లు అమ్ముకుంటున్న టాక్సీ & క్యాబ్ డ్రైవర్లు

Most Read Articles

English summary
Police to seize vehicles in Mumbai for travelling more than 2 kms without valid reason. Read in Telugu.
Story first published: Monday, June 29, 2020, 20:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X