Just In
- 9 min ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 1 hr ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 2 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- 4 hrs ago హ్యుందాయ్ కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. వేసవిలో ప్రత్యేకంగా సర్వీస్ క్యాంప్.. ఎప్పటివరకు అంటే.??
Don't Miss
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Movies Adivi Sesh: "అకీరాతో స్నేహం అలా కుదిరింది.. కచ్చితంగా అతడితో సినిమా చేస్తా"
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
లాక్డౌన్ ఉల్లంఘించిన ప్రముఖ నటి, ఎవరో తెలుసా ?
కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా ఇప్పటికీ లాక్ డౌన్ అమలులో ఉంది. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం భారతదేశాన్ని మొత్తాన్ని గ్రీన్ జోన్, ఆరంజ్ జోన్ మరియు రెడ్ జోన్ లుగా విభజించారు. ఈ జోన్లు ప్రకటించడం ద్వారా లాక్ డౌన్ నెమ్మదిగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది. లాక్ డౌన్ సమయంలో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇల్లు వదిలి బయటకు రాకూడదని ఆంక్షలు కూడా విధించారు.
భారతదేశంలో మహారాష్ట్రలో కొరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో కరోనా ఎక్కువగా వ్యాపించింది. కరోనాకి వ్యతిరేఖంగా పోలీసులు మరియు వైద్యులు రాత్రి పగలు కష్టపడుతున్నారు. పోలీసులు ప్రజలు బయటకు రాకుండా చూస్తున్నారు. కానీ ఈ విషయాన్ని చాలామంది సీరియస్ గా తీసుకోవడం లేదు. చాలామంది లాక్ డౌన్ లో విచ్చలవిడిగా బయట తిరుగుతున్నారు.
కరోనా వైరస్ కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన ఈ సమయంలో నటి పూనం పాండే ముంబైలో అనవసరంగా బయట కనపడింది. ఈ కారణంతో పోలీసులు ఆమెను అరెస్టు చేసి తన కారు బిఎమ్డబ్ల్యూను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం ఇటీవల విషయం వెలుగులోకి వచ్చింది.
MOST READ:ఇప్పుడే చూడండి.. కైలాష్ యాత్రకు కొత్త రహదారి ఇదే
పూనమ్ పాండే తన స్నేహితుడు సామ్ అహ్మద్తో కలిసి లగ్జరీ బిఎమ్డబ్ల్యూ 5 సిరీస్ కారుతో పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసును ముంబైకి చెందిన మెరైన్ డ్రైవ్ పోలీసులు కేసు బుక్ చేశారు. తరువాత వారిని విడుదల చేశారు.
వారు ప్రయాణిస్తున్న బిఎమ్డబ్ల్యూ 5 సిరీస్ సెడాన్ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూనమ్ పాండే మరియు ఆమె స్నేహితుడిపై జాతీయ విపత్తు నిబంధనల చట్టంలోని సెక్షన్ 269 మరియు సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.
MOST READ:కరోనాపై పోరాటానికి తమిళనాడు సిఎం రిలీఫ్ ఫండ్కు ఓలా ఇచ్చిన విరాళం ఎంతో తెలుసా ?
పూనమ్ పాండే ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. ఆమె నిర్లక్ష్య చర్యల కారణంగా, ఇప్పటికే చాలా వరకు మీడియా మరియు సోషల్ నెట్వర్క్లో వైరల్ గా మారారు. ఇప్పటికే భారతదేశంలో చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల వారి వాహనాలను పోలీసులు జప్తు చేశారు.
లాక్ డౌన్ కారణంగా చాలా రాష్ట్రాల్లో లక్షలాది వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలు లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనదారునికి తిరిగి ఇవ్వబడతాయి. మహారాష్ట్రలోని చాలా ప్రదేశాలలో లాక్ డౌన్ నియమాలు ఖచ్చితంగా పాటించబడుతున్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ కరోనా కేసులు ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి వరుసలో ఉంది.
MOST READ:బిఎస్ 6 ఇంజిన్లో విడుదలైన కొత్త కవాసకి నింజా 650 బైక్
ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఇద్దరు యువతులు లాక్ డౌన్ మధ్యలో పోలీసులను తప్పించుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి, వారు నడుపుతున్న స్కూటర్ను స్వాధీనం చేసుకున్నారు.