ట్రంప్ ని రిసీవ్ చేసుకోవడానికి నరేంద్ర మోడీ ఏ కారులో వచ్చారంటే.. ?
రెండు రోజులు భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటించడం అందరికి తెలిసిన విషయమే. ఈ పర్యటనలో భాగంగానే ట్రంప్ సోమవారం భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన ట్రంప్ ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, భారతప్రధాని ఏ కారులో వెళ్లారు అనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీ కోసం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అత్యంత విలాసవంతమైన కాడిలాక్ వన్ లో ప్రయాణించారు. మనదేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా భారతదేశ విలాసవంతమైన కారు రేంజ్ రోవర్ కారులో ట్రంప్ ని ఆహ్వానించడానికి వెళ్ళాడు.

ట్రంప్ ప్రయాణించిన ఈ కారు ది బెస్ట్ అనిపించుకుంది. ఇది చాలా ప్రత్యేకమైన ఫీచర్స్ కలిగి ఉండటమే కాకుండా, అత్యంత విలక్షణమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ కారులో ట్రంప్ కి ఎలాంటి ప్రమాదం జరిగే అవకాశమే లేదు, అంత కట్టుదిట్టమైన భద్రతలను ఏర్పాటు చేసారు.

భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రయాణించిన రేంజ్ రోవర్ కూడా పుల్ ప్రొటక్షన్ కలిగి ఉంటుంది. ఈ మధ్య కాలంలో భారతదేశంలో రేంజ్ రోవర్ కార్లు చాలా సర్వసాధారణంగా ఉపయోగించబడుతున్నాయి. కానీ సాధారణ రేంజ్ రోవర్ కార్లకంటే ఇది చాలా భిన్నంగా మంచి భద్రతా లక్షణాలను కలిగి ఉంటుంది.

నరేంద్ర మోడీ ట్రంప్ ని ఆహ్వానించడానికి నల్ల రంగు సాయుధ రేంజ్ రోవర్ ఎస్యువిలో అహ్మదాబాద్ విమానాశ్రయానికి వచ్చారు. సాధారణంగా మోడీ 2017 స్వతంత్ర దినోత్సవం తరువాత ఈ నల్ల రంగు సాయుధ రేంజ్ రోవర్ ఎస్యువి ని ఉపయోగించడం ఇది మొదటి సారి కాదు.

2014 మే లో మోడీ ప్రధానమంత్రిగా భాద్యతలు స్వీకరించినప్పుడు అనుకూలించబడిన బిఎమ్డబ్ల్యూ 7 సిరీస్ ఉపయోగించేవారు. వివిధ నివేదికల ప్రకారం 2017 ఆగస్టు నుంచి రేంజ్ రోవర్ కారుని ఉపయోగిస్తున్నారని తెలిసింది. నరేంద్ర మోడీ బిఎమ్డబ్ల్యూ 7 సిరీస్ ని ఆకస్మికంగా మార్చడానికి ప్రధాన కారణం అయితే స్పష్టంగా తెలియదు, కానీ ఇది మరింత భద్రతా లక్షణాలను కలిగి ఉంటడం వల్ల మార్చి ఉండవచ్చు అను అనుకుంటున్నారు.

మోడీ ప్రయాణించిన ఈ ఎస్యువి 2010 రేంజ్ రోవర్ హెచ్ఎస్ఇ. ఇది 5.0 లీటర్ వి 8 ఇంజిన్ ప్యాక్ ని కలిగి ఉంటుంది. ఈ లగ్జరీ ఎస్యువిని భారతీయ ఆటో మేజర్ టాటా మోటార్స్ యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ తయారు చేస్తుంది. డోనాల్డ్ ట్రంప్ ప్రఖ్యాత కాడిలాక్ వన్, 'ది బీస్ట్' అని కూడా పిలువబడే సాయుధ అధ్యక్ష లిమోలో ప్రయాణించారు.


Click it and Unblock the Notifications








