Just In
- 1 hr ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- 4 hrs ago కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- 11 hrs ago మారుతి స్విఫ్ట్ ధరలు పెరిగాయండోయ్!.. ఇప్పుడే తెలుసుకోండి
- 18 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
Don't Miss
- News ప్రచారం పక్కనపెట్టి గర్భిణీకి ప్రసవం.. దర్శి టీడీపీ అభ్యర్థికి హ్యాట్సాఫ్!!
- Lifestyle మామిడికాయ పచ్చడిని ఈజీగా ఇలా తయారు చేసుకోండి..
- Sports అనూహ్య ఘటనను ఎదుర్కొన్న రోహిత్ శర్మ
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Movies Market Mahalakshmi Review: మార్కెట్ మహాలక్ష్మీ మెప్పించిందా? మూవీ ఎలా ఉందంటే?
కొత్త విమానంలో ప్రయాణించిన భారత రాష్ట్రపతి ; ఇంతకీ ఈ విమానం ప్రత్యేకత ఏంటో తెలుసా
బోయింగ్ ప్లైట్ వివిఐపి వ్యక్తుల కోసం తీసుకురావడానికి కొంతకాలం ముందు, దీనిని అక్టోబర్ లో ఢిల్లీకి తీసుకువచ్చారు. ఈ ప్లైట్ ప్రధానమంత్రి, రాష్ట్రపతి వంటి వివిఐపిల కోసం ఇది ఉపయోగించబడుతుంది. ఈ రోజు రాష్ట్రపతి ఈ ప్లైట్ ప్రారంభించారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఈ ఎయిర్ ఇండియా వన్ విమానంలో చెన్నైకి వెళుతున్నారు, అతను ఆంధ్రప్రదేశ్ లోని తిరుమల వెనకటేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ ఎయిర్ ఇండియా వన్ - బి 777 విమానం అతని మొదటి ప్లైట్. ఈ సందర్భంగా పైలట్లు, సిబ్బంది, రాష్ట్రపతి సహా మొత్తం బృందం పలకరించారు.
ఇది చాలా ఆధునికమైనది మరియు సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విమానం, భారత వైమానిక దళ పైలట్లు ఈ విమానం నడుపుతారు. అంతేకాని ఇది ఎయిర్ ఇండియా ఆధీనంలో ఉండదు. అంతకుముందు ఇతర విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడిపారు. ఈ కొత్త ప్లైట్ మంచి ఇంటీరియర్స్ తో తీసుకురాబడింది.
MOST READ:ఖాళీ డబ్బాలతో ఇలా కూడా చేయవచ్చా.. నిజంగా సూపర్ గురూ
బి 777 విమానంలో లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్ మెసెర్స్ మరియు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ అనే కొత్త మిస్సైల్ డిఫెన్సీ సిస్టం ఉంటుంది. ఇది ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను కలిగి ఉంది, దీని సహాయంతో ఆడియో మరియు వీడియో కమ్యూనికేషన్లను ఎయిర్ ఫ్లైట్ సమయంలో హ్యాక్ చేయకుండా ఉపయోగించవచ్చు.
ఈ కొత్త విమానాన్ని ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (AIESL), ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ నిర్వహించనుంది. ఈ విమానం వివిఐపి ప్రజలు మాత్రమే ఉపయోగించుకోబడుతుంది. ఇది చాలా కొత్త టెక్నాలజీలను కలిగి ఉంటుంది. కాబట్టి మంచి సేఫ్టీ ఫీచరస్ కూడా ఇందులో ఉంటాయి.
MOST READ:కియా సోనెట్ డెలివరీ ఇప్పుడు కొత్త స్టైల్లో.. ఎలాగో మీరే చూడండి
ఈ కొత్త విమానంలో మొదటిసారిగా, విమానాల యొక్క సెల్ఫ్ ప్రొటక్షన్ సూట్లు ఇవ్వబడ్డాయి, అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కౌంటర్మెజర్ సూట్లు, కౌంటర్మెజర్ పంపిణీ సిస్టం మరియు మిస్సైల్ వార్ణింగ్ సెన్సార్లు ఇవ్వబడ్డాయి. ఇది చాలా సురక్షితంగా ఉండే విధంగా చేస్తుంది.
ప్రధానమంత్రి, రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎయిర్ ఇండియా బి 747 ను ఉపయోగించారు. ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడుపుతారు. ఇంతకుముందు కోవిడ్ కారణంగా ఎవరూ ఈ విమానం ఉపయోగించలేదు. ఎయిర్ ఇండియా వన్ - బి 777 ను వివిఐపి వాడకంతో ఖాళీగా ఉన్నప్పుడు వాణిజ్య ఉపయోగం కోసం తీసుకురావచ్చు, తద్వారా ఇది పూర్తిగా ఉపయోగించుకోబడుతుంది.
MOST READ:యువకుల ఉత్సాహంతో జరిగిన అపశృతి ; గాలిలోకి ఎగిరిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ [వీడియో]
Image Source: PresidentOfIndia/Twitter