Just In
- 5 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 6 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 8 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 11 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Sports PBKS vs MI: నిప్పులు చెరిగిన బుమ్రా.. ఓడిపోయే మ్యాచ్లో గెలిచిన ముంబై ఇండియన్స్!
- News పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
భారత వైమానిక దళాన్ని అభినందించిన నరేంద్ర మోడీ, ఎందుకో తెలుసా.. !
భారతదేశంలో రాను రాను చమురు వినియోగం చాలా ఎక్కువైంది. ఎందుకంటే పెరుగుతున్న వాహనాలకు దేశంలో ఉండే చమురు ఉత్పత్తులు సరిపోకపోవడంతో ఇతర దేశాలనుండి చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం అందరికి తెలిసిందే. కానీ భారత వైమానిక దళంలో ఎఎన్-32 రవాణా విమానంలో ఐఎఎఫ్ బయో ఇంధనాన్ని ఉపయోగించి ప్రధాని ప్రశంసలు అందుకున్నారు. అసలు వైమానిక దళం ఉపయోగించిన బయో ఇంధనం ఏది, ప్రధాని ఎందుకు ప్రసంశించారు అనే దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం!
భారత రక్షణ వ్యవస్థకు వైమానికదళం తలమానికంగా ఉంది. రక్షణ వ్యవస్థకు ఖర్చులు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. సాధారణంగా విమానాలకు చమురు ఉపయోగించేవారు. కానీ ఇటీవల కాలంలో వైమానిక దళ రవాణా విమానం ప్రయాణించడానికి 10 శాతం దేశీయంగా ఉత్పత్తి చేయబడిన బయో- జెట్ ఇంధనాన్ని ఉపయోగించారు. ఈ విధంగా విమానానికి దేశీయ బయో - జెట్ ఇంధనాన్ని ఉపయోగించడం చాలా గర్వకారణం అని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు.
నరేంద్ర మోడీ ప్రతినెల నిర్వహించే "మన్ కి బాత్" రేడియో కార్యక్రమంలో భారత వైమానిక దళాన్ని ప్రశంసించారు. ఈ విధంగా బయో ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల ఇతర దేశాలనుంచి ముడి చమురుని దిగుమతి చేసుకోవడం తగ్గుతుందని చెప్పారు. అంతే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించినట్లు కూడా ఉంటుందన్నారు.
బయో ఇంధనాన్ని ఉపయోగించడం వల్ల కార్బన్ వినియోగం తగ్గుతుందని, తద్వారా పర్యావరణం సమతుల్యం జరుగుతుందని, వాతావరణం కలుషితం కాకుండా ఉండటం వల్ల జీవులు చాల సుఖంగా జీవించగలుగుతాయని చెప్పారు.
బయో జెట్ ఇంజిన్ మిశ్రమాన్ని రెండు ఇంజిన్లలో ఉపయోగించడం ఇదే మొదటిసారి. అంతే కాదు ఈ ఇంధనాన్ని ఉపయోగించే ఈ విమానం లే నుండి బయలుదేరింది. బయో-జెట్ ఇంధనాన్ని "నాన్ ఎడిబుల్ ట్రీ ద్వారా ఉత్పత్తి చేసే నూనె" నుండి తయారు చేసి, భారతదేశంలోని వివిధ గిరిజన ప్రాంతాల నుండి సేకరించినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ ప్రయత్నాలు కార్బన్ ఉద్గారాలను తగ్గించడమే కాక, ముడి చమురు దిగుమతులపై భారతదేశం ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తాయి. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరినీ, ముఖ్యంగా సిఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్) మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను.
బయో ఇంధనంతో విమానం ఎగరడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం సాధ్యం చేయడం హర్షించదగ్గ విషయం. ఇటువంటి ప్రయత్నాలు ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా చొరవకు కూడా అధికారం ఇస్తాయని ప్రధాని ప్రస్తావించారు.