Just In
- 29 min ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 3 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 5 hrs ago కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 9 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
Don't Miss
- News కోర్టు తీర్పుతో ఎన్నికల అస్త్రాన్ని కోల్పోయిన వైఎస్ షర్మిల, సునీత.. వాట్ నెక్స్ట్!!
- Sports IPL: ఆ కుర్రాడిపై అంబానీ కన్ను!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Movies Tenent Review: మర్డర్ మిస్టరీ మెప్పించిందా? సత్యం రాజేష్కు హిట్ పడిందా? టెనెంట్ రివ్యూ
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ప్రపంచంలోనే అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభించిన నరేంద్ర మోదీ.. ఈ టన్నెల్ గురించి మీకు తెలుసా !
ప్రపంచంలో అత్యంత పొడవైన అటల్ టన్నెల్ ఈ రోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీనిని మనాలి నుండి లేహ్ మధ్య నిర్మించారు. ఈ టన్నెల్ మనాలి మరియు లే మధ్య దూరాన్ని 46 కిలోమీటర్లు తగ్గిస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికీ ఈ అటల్ టన్నెల్ని అంకితం చేశారు.
ఈ సొరంగం 10,000 అడుగుల ఎత్తులో నిర్మించబడింది మరియు దీని పొడవు 9.02 కిలోమీటర్లు. ఈ సొరంగ మార్గం మనాలి మరియు లే మధ్య 46 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తుంది మరియు ప్రయాణీకులకు 4 గంటల సమయం ఆదా చేస్తుంది. సుమారు ఈ సొరంగ మార్గం యొక్క నిర్మాణానానికి 3,300 కోట్ల రూపాయల ఖర్చు అయింది.
అటల్ టన్నెల్ ప్రతిరోజూ 3 వేల కార్లు మరియు 1500 ట్రక్కులు ప్రయాణించే విధంగా నిర్మించబడింది. ప్రతి 250 మీటర్లకు సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేయబడ్డాయి మరియు సొరంగం లోపల ప్రతి 500 మీటర్లకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నిర్మించబడింది.
భద్రతను దృష్టిలో ఉంచుకుని, ప్రతి 60 మీటర్లకు సొరంగంలో ఫైర్ హైడ్రాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి మరియు ప్రతి 150 మీటర్లకు టెలిఫోన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. దీనితో ప్రతి 1 కిలోమీటరుకు ఎయిర్ క్వాలిటీ మానిటర్ ఏర్పాటు చేయబడింది. ఈ సొరంగం యొక్క రెండు వైపులా 1 మీటర్ పేవ్మెంట్ ఉంది, ఇది కలిసి 10.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంది.
లేహ్ను మెయిన్ స్ట్రీమ్ కి అనుసంధానించడానికి ఇది ఒక ముఖ్యమైన దశగా భావించబడుతుంది. ఈ సొరంగం నిర్మాణం వల్ల, లడఖ్లోని సైనికులకు ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. తద్వారా శీతాకాలంలో కూడా ఆయుధాలు మరియు రేషన్ సులభంగా సరఫరా చేయబడతాయి.
MOST READ:ఈ ఫ్యాన్సీ నెంబర్ ధర అక్షరాలా రూ. 10.10 లక్షలు.. ఆ నెంబర్ ఎదో తెలుసా ?
ఈ సొరంగ మార్గం యొక్క నిర్మాణానికి 6 సంవత్సరాల కన్నా తక్కువ కాలం పడుతుందని ఊహించారు, కానీ ఇది పదేళ్ళలో పూర్తయింది. ఇందులో ఎక్కువ భాగం బోర్డర్ రోడ్స్ సంస్థ నిర్మించింది. ఈ సమయంలో వాతావరణం, కొండ భూభాగం వంటి అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.
అటల్ టన్నెల్లో వేగా పరిమితి గంటకు 80 కి.మీ. ఈ సొరంగం హిమాలయాల పిర్ పంజాల్ పర్వత శ్రేణి మధ్యలో నిర్మించబడింది. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రహదారి సొరంగం మరియు ఇప్పుడు ఈ రికార్డులో కూడా భారతదేశం పేరు నిలుస్తుంది. దీనితో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ను భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లోని చెనాబ్ నదిపై నిర్మిస్తున్నారు, ఇది 2022 నాటికి పూర్తవుతుంది.
MOST READ:ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టిన కొత్త మహీంద్రా థార్ : ధర & ఇతర వివరాలు
ఈ అటల్ టన్నెల్ ప్రారంభించే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు. అటల్ టన్నెల్ మాజీ ప్రధాని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. ఏది ఏమైనా ఈ అత్యంత పొడవైన అటల్ టన్నెల్ వల్ల మన దేశం కూడా ఒక రికార్డ్ సాధించింది.