Just In
- 14 min ago స్టైల్ అండ్ డిజైన్లో వీటి స్పెషాలిటీనే వేరు.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో ది బెస్ట్ ఇ స్కూటర్లు
- 1 hr ago భారత్లో 'మెక్లారెన్ 750ఎస్' ఫస్ట్ డెలివరీ.. మైండ్ బ్లోయింగ్ చేస్తున్న వీడియో
- 1 hr ago సెకండ్ హ్యాండ్ రేంజ్ రోవర్ కారులో తళుక్కుమన్న ‘యానిమల్' బ్యూటీ.. వైరల్ వీడియో
- 2 hrs ago చిన్న తప్పు ఎంత ప్రమాదాన్ని కలిగించిందో!.. వీడియో చూడండి
Don't Miss
- News పవన్ కల్యాణ్ ప్రచారానికి అనసూయ?
- Movies టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
- Travel శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఐదు రోజుల ఉగాది మహోత్సవాలు.. ఎప్పుడంటే?!
- Sports SRHకు బ్యాడ్ న్యూస్: స్టార్ ప్లేయర్ దూరం - కెప్టెన్ కమిన్స్
- Finance Tata IPO: డబ్బు ఏర్పాటు చేసుకోండి.. టాటా గ్రూప్ కంపెనీల ఐపీవోలు.. 20 ఏళ్ల తర్వాత..
- Technology Vivo నుంచి రెండు ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పిల్లల్ని పెంచేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి!
నరేంద్ర మోదీ Toyota Land Cruiser: ధర & ఫీచర్స్ అన్నీ ఎక్కువే.. ఎందుకో తెలుసా..!!
'కాశీ' ఇది హిందువులకు పరమపవిత్రమైన ప్రదేశం. ఎక్కడ పుట్టినవారైనా కాశీలో చనిపోవాలని అనుకుంటారు, అనేది ఒకప్పటి నుంచి వింటూనే ఉన్నాము. అంతటి పావన భూమి అయిన కాశీలో రూ. 700 కోట్లతో దాదాపు 33 నెలల్లో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ను దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అయితే ఇప్పుడు ఇది సాధారణ ప్రజల కోసం తెరవబడుతుంది. కావున సాధారణ ప్రజలు కూడా దీనిని సందర్శించవచ్చు.
ఈ కార్యక్రమం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గంగా నదిలో బోటు షికారు చేశారు. కాశీలో జరిగిన ఈ కార్యక్రమంలో సంత్ రవిదాస్కు మోదీ నివాళులర్పించారు. ఇవన్నీ జాతినుద్దేశించి జరిగాయి. అయితే మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొనటానికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన టయోటా యొక్క ల్యాండ్ క్రూయిజర్ SUV ని ఉపయోగించినట్లు సమాచారం.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించిన ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ SUV గురించి చాలామందికి తెలియదు. కావున ఇందులో ఉన్న విశేషాలను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్లో మొదటిసారి కనిపించారని నివేదికల ద్వారా తెలుస్తుంది. అయితే అప్పటి నుండి, అతను ఈ SUV ని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉపయోగించాడు. ఎందుకంటే దీనిని నరేంద్ర మోదీ ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కూడా తెలుస్తోంది.
నరేంద్ర మోదీ ఉపయోగించే ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ సాధారణ ల్యాండ్ క్రూయిజర్ మాత్రం కాదు. దీనిని గమనించాలి. టయోటా ల్యాండ్ క్రూయిజర్ యొక్క కొత్త-తరం మోడల్ ధర రూ. 1.70 కోట్లు (ఎక్స్-షోరూమ్) అయినప్పటికీ, PM మోడీ యొక్క ల్యాండ్ క్రూయిజర్ దాని ప్రామాణిక మోడల్ కాదు. ఈ టయోటా ల్యాండ్ క్రూయిజర్ పూర్తిగా ప్రధాని మోదీ కోసం కస్టమైజ్ చేయబడింది.
మోదీ ఉపయోగించే కారు పటిష్టమైన భద్రతా పరికరాలను కలిగి ఉంటుంది. ఇది ఒక సాయుధ కారు, కాబట్టి గ్రెనేడ్లు మరియు బుల్లెట్లు ఈ కారుపై ప్రభావం చూపే అవకాశం లేదు. ఈ ఆధునిక ఫీచర్స్ కారణంగా, ఇది సాధారణ ల్యాండ్ క్రూయిజర్ కంటే భిన్నంగా ఉంది.
మోదీ యొక్క టయోటా ల్యాండ్ క్రూయిజర్ లో అధునాతన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది సాయుధ కారు కాబట్టి దీనిని టయోటా కంపెనీ కస్టమైజ్ చేసే ఆవకాశం లేదు. అయితే బయట ఉన్న ఏజెన్సీలు దీనిని ప్రత్యేకంగా రూపొందించాయి. కావున ఇందులో దేశ ప్రధాని భద్రతకు ఎటువంటి చింత లేదు. నివేదికల ప్రకారం ఈ కారుపై బుల్లెట్లు మరియు గ్రెనేడ్లు ఎటువంటి ప్రభావం చూపవు, అంతే కాకుండా ఈ కారు ల్యాండ్ మైన్లు మరియు రసాయన దాడుల వల్ల కూడా ప్రభావితం కాదు.
భారతదేశ ప్రధానమంత్రి మోడీ వద్ద ఇది కాకుండా అనేక సాయుధ కార్లు ఉన్నాయి. అయితే టయోటా ల్యాండ్ క్రూయిజర్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 4.5-లీటర్ V8 డీజిల్ ఇంజన్ను ఉపయోగిస్తుంది.
PM మోడీ యొక్క టయోటా ల్యాండ్ క్రూయిజర్ గొప్ప భద్రతా లక్షణాలతో వస్తుంది, మరోవైపు ఈ కారు చాలా శక్తివంతమైన ఇంజన్ను కూడా పొందుతుంది. కంపెనీ ఈ పాత తరం టయోటా ల్యాండ్ క్రూయిజర్లో 4.5-లీటర్ V8 డీజిల్ ఇంజన్ను ఉపయోగిస్తుంది. ఈ ఇంజన్ 262 bhp శక్తిని మరియు 650 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 4-వీల్ డ్రైవ్ సిస్టమ్లో కూడా అందుబాటులో ఉంటుంది.
సాధారణ టయోటా క్రూయిజర్ కంటే PM మోడీ యొక్క ల్యాండ్ క్రూయిజర్ చాలా బరువు కలిగి ఉంది, కానీ దాని శక్తివంతమైన ఇంజన్ కారణంగా, ఈ కారు కేవలం 6.8 సెకన్లలో 0 నుండి 100 కిమీ/గం వరకు వేగవంతం అవుతుంది. అయితే దీని గరిష్ట వేగం 305 కిమీ/గం వరకు ఉంటుంది.
నరేంద్ర మోదీ కేవలం టయోటా ల్యాండ్ క్రూయిజర్ మాత్రమే కాకూండా, రేంజ్ రోవర్ సెంటినెల్, కస్టమైజ్ చేసిన టయోటా ఫార్చ్యూనర్ మరియు మెర్సిడెస్ బెంజ్ స్ప్రింటర్ వ్యాన్ వంటికి కూడా యిన్నాయి. అయితే వీటి ధరలు వరుసగా రూ. 2 నుండి 4 కోట్లు (రేంజ్ రోవర్ సెంటినెల్), రూ. 71 లక్షల వరకు (కస్టమైజ్ చేసిన టయోటా ఫార్చ్యూనర్) మరియు రూ. 1.5 కోట్లు (మెర్సిడెస్ బెంజ్ స్ప్రింటర్ వ్యాన్). ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. కావున ఇది ప్రధాన మంత్రి భద్రతను నిర్థారిస్తుంది.