ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

భారతదేశంలోని గ్రామీణ మరియు చిన్న నగర ప్రాంతాలలో ప్రభుత్వ బస్సుల కంటే ప్రైవేట్ బస్సులు ఎక్కువగా నడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రవాణా శాఖ ప్రైవేట్ బస్సుకు జరిమానా విధించినట్లు సమాచారం. ప్రైవేట్ బస్సు యొక్క సరైన రిజిస్ట్రేషన్ మరియు అనుమతి లేకపోవడం జరిమానాకు ప్రధాన కారణం. దీనిపై న్యూస్ 18 ఇంగ్లీష్ నివేదించింది.

ప్రైవేట్ బస్సుకు రూ. 5.82 లక్షలు జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

ఈ సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. బస్సు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, పన్నులు చెల్లించకపోవడం మరియు ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడంలో విఫలమైనందుకు జరిమానాలు విధించడం జరిగింది.

ప్రైవేట్ బస్సుకు రూ. 5.82 లక్షలు జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

దీనికి ఒడిశాకు చెందిన ఆర్టీఓ అధికారులు రూ. 5.82 లక్షలు జరిమానా విధించారు. అంతేకాకుండా బస్సును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో బస్సు యజమానులు ఇబ్బందుల్లో పడ్డారు.

ప్రైవేట్ బస్సుకు రూ. 5.82 లక్షలు జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

భువనేశ్వర్ ఆర్టీఓ 2 అధికారుల ఆపరేషన్ సమయంలో, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా బస్సు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. పన్నులు చెల్లించనందుకు అతనికి రూ. 5,66,981, ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేనిందుకు రూ. 15 వేలు జరిమానా విధించారు. భువనేశ్వర్ ఆర్టీఓ 2 అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని నివేదించారు. భారీ జరిమానా చెల్లించాల్సిన ఈ బస్సు కొరాపుట్ మరియు భువనేశ్వర్ మధ్య నడుస్తుంది.

ప్రైవేట్ బస్సుకు రూ. 5.82 లక్షలు జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

ఆర్టీఓ అధికారులు బస్సును స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతంలోని ప్రయాణికులు ఇబ్బంది పడటం ఖాయం. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా రంగం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటుంది. ఇంతలో ప్రైవేట్ బస్సులకు భారీగా జరిమానా విధించారు. రాబోయే రోజుల్లో ఏ వాహన యజమాని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లగించడానికి వీలు ఉండకుండా ఈ చర్య తీసుకోవడం జరిగింది.

ప్రైవేట్ బస్సుకు రూ. 5.82 లక్షలు జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

వాహన యజమానులు మరియు ప్రయాణీకుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్‌ను తెరిచింది. ఈ పోర్టల్ డ్రైవర్ల లైసెన్స్‌లతో సహా అన్ని రకాల వాహన సంబంధిత పత్రాలను డిజిటల్‌గా నిల్వ చేస్తుంది.

ప్రైవేట్ బస్సుకు రూ. 5.82 లక్షలు జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?

ఈ కారణంగా, వాహనదారులు పోలీసుల తనిఖీ సమయంలో వాహనం యొక్క అసలు రికార్డులను పోలీసులకు చూపించాల్సిన అవసరం లేదు. పోలీసులు వాహన సంబంధిత రికార్డులను ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. ఈ కొత్త విధానాలు మరియు పద్దతుల వల్ల రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Article Published On: Saturday, October 17, 2020, 13:09 [IST]
English summary
Private bus fined heavily for tax evasion. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+