Just In
- 1 hr ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 2 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 3 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- 6 hrs ago ఎన్నో అంచనాల మధ్య లాంచ్ అయిన క్లచ్లెస్ బైక్ TVS Jive.. ఎందుకు ఫెయిల్ అయింది.??
Don't Miss
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ప్రైవేట్ బస్సుకు రూ. 5 లక్షలకుపైగా జరిమానా విధించిన గవర్నమెంట్.. కారణం ఏంటో తెలుసా ?
భారతదేశంలోని గ్రామీణ మరియు చిన్న నగర ప్రాంతాలలో ప్రభుత్వ బస్సుల కంటే ప్రైవేట్ బస్సులు ఎక్కువగా నడుస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రైవేట్ బస్సులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రవాణా శాఖ ప్రైవేట్ బస్సుకు జరిమానా విధించినట్లు సమాచారం. ప్రైవేట్ బస్సు యొక్క సరైన రిజిస్ట్రేషన్ మరియు అనుమతి లేకపోవడం జరిమానాకు ప్రధాన కారణం. దీనిపై న్యూస్ 18 ఇంగ్లీష్ నివేదించింది.
ఈ సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగింది. బస్సు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, పన్నులు చెల్లించకపోవడం మరియు ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందడంలో విఫలమైనందుకు జరిమానాలు విధించడం జరిగింది.
దీనికి ఒడిశాకు చెందిన ఆర్టీఓ అధికారులు రూ. 5.82 లక్షలు జరిమానా విధించారు. అంతేకాకుండా బస్సును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో బస్సు యజమానులు ఇబ్బందుల్లో పడ్డారు.
MOST READ:సాధారణ కార్లు లగ్జరీ కార్లుగా మారాయి..ఎలాగో తెలుసా ?
భువనేశ్వర్ ఆర్టీఓ 2 అధికారుల ఆపరేషన్ సమయంలో, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా బస్సు ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. పన్నులు చెల్లించనందుకు అతనికి రూ. 5,66,981, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేనిందుకు రూ. 15 వేలు జరిమానా విధించారు. భువనేశ్వర్ ఆర్టీఓ 2 అధికారులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని నివేదించారు. భారీ జరిమానా చెల్లించాల్సిన ఈ బస్సు కొరాపుట్ మరియు భువనేశ్వర్ మధ్య నడుస్తుంది.
ఆర్టీఓ అధికారులు బస్సును స్వాధీనం చేసుకోవడంతో ఈ ప్రాంతంలోని ప్రయాణికులు ఇబ్బంది పడటం ఖాయం. కరోనా వైరస్ కారణంగా నిలిచిపోయిన ప్రజా రవాణా రంగం ఇప్పుడిప్పుడే నెమ్మదిగా కోలుకుంటుంది. ఇంతలో ప్రైవేట్ బస్సులకు భారీగా జరిమానా విధించారు. రాబోయే రోజుల్లో ఏ వాహన యజమాని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లగించడానికి వీలు ఉండకుండా ఈ చర్య తీసుకోవడం జరిగింది.
MOST READ:మాడిఫైడ్ బెంజ్ 600 పుల్మాన్ లిమోసిన్ : ఈ కార్ ముందు ఏ కారైనా దిగదుడుపే
వాహన యజమానులు మరియు ప్రయాణీకుల సౌలభ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ పోర్టల్ను తెరిచింది. ఈ పోర్టల్ డ్రైవర్ల లైసెన్స్లతో సహా అన్ని రకాల వాహన సంబంధిత పత్రాలను డిజిటల్గా నిల్వ చేస్తుంది.
ఈ కారణంగా, వాహనదారులు పోలీసుల తనిఖీ సమయంలో వాహనం యొక్క అసలు రికార్డులను పోలీసులకు చూపించాల్సిన అవసరం లేదు. పోలీసులు వాహన సంబంధిత రికార్డులను ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు. ఈ కొత్త విధానాలు మరియు పద్దతుల వల్ల రాబోయే రోజుల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు తగ్గే అవకాశాలు ఉన్నాయి.
MOST READ:మీరు ఇప్పటివరకు చూడని అరుదైన మరియు అందమైన హిందుస్తాన్ ట్రెక్కర్