దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా
ప్రముఖ వాహన తయారీదారు హ్యుందాయ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో హ్యుందాయ్ ఐ10 ఒకటి. ఈ కారు మార్కెట్లో ఎక్కువ అమ్మకాలను చవి చూసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హ్యుందాయ్ కంపెనీ ఈ ఐ10 కారు యొక్క అమ్మకాలను నిలిపివేసింది. కానీ ఇప్పటి కూడా ఈ కార్లు భారతీయ రోడ్లపై అక్కడక్కడా కనిపిస్తుంది.

అయితే ఇటీవల ఒక యువకుడు హ్యుందాయ్ ఐ10 కారుని దొంగలించి ఆ కారులోనే వెళ్తున్నాడు, ఇదే సమయంలో వాహన యజమాని పిర్యాదు మేరకు పోలీసులు ఆ కారు దొంగలించిన యువకున్ని కేవలం 40 నిముషాల్లో అరెస్టు చేసి ఆ వాహన యజమానికి అప్పగించారు.

పోలీసులు దొంగలించిన ఆ కారుని 40 నిమిషాల్లోనే అరెస్టు చేసి అసలైన యజమానికి అందించడం ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వాహనదారులకు టెక్నాలజీ తెలియని సమయంలో ఇలాంటిది ఎలా సాధ్యమయ్యింది అనే ప్రశ్న మొదలైంది.

ప్రస్తుతం ఆధునిక యుగంలో జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు దొంగిలించిన కారును త్వరగా గుర్తించగలుగుతున్నారు. వాహనంలో పొందుపరిచిన జిపిఎస్ టెక్నాలజీ ఆ వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా వరకు సహాయపడుతుంది. కావున వాహనదారులు వారి వాహనంలో జిపిఎస్ టెక్నాలజీ అమలుచేయడం ద్వారా దొంగలించబడినప్పటికీ దానిని సులభంగా పొందవచ్చు.

ఇక్కడ దొంగలించిన ఈ హ్యుందాయ్ ఐ10 కారు యజమాని తమ కారులో జిపిఎస్ టెక్నాలజీని అమలుచేయడం వల్ల పోలీసులు వాహనాన్ని గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. అందుకే పోలీసులు కేవలం 40 నిముషాల్లో దొంగలించిన యువకున్ని అరెస్ట్ చేశారు.

జిపిఎస్ టెక్నాలజీ అనేది ఇటీవల వస్తున్న కార్లలో కచ్చితంగా అమలుచేసుకోవాలని ఆటో మొబైల్ పరిశ్రమ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇటీవల కాలంలో జిపిఎస్ పరికరాలను మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ జిపిఎస్ పరికరాలను వాహనాల్లో అమర్చడం వల్ల దొంగల భారీ నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాదు మీ వాహనం దొంగలించబడితే అది ఎక్కడికి వెళ్తుందో కూడా సులభంగా ట్రాక్ చేయవచ్చు.

నివేదికల ప్రకారం ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగినట్లు తెలుస్తుంది. దొంగలించబడిన ఈ కారు పూణేకు చెందిన అభిషేక్ పన్వర్ దొంగలించినట్లు గుర్తించబడింది. కారు దొంగిలించబడిన కొద్దిసేపటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కావున కారుకు ఎటువంటి నష్టం జరగలేదు.

ఆఫీస్ పార్కింగ్ స్థలం నుంచి దొంగలించబడిందని గుర్థించిన కారు ఓనర్ ముషారఫ్ షేక్ తన ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అతని కారులో జిపిఎస్ ట్రాకర్ ఉండటం వల్ల ఈ కారు ఎక్కడ ఉందొ అని తెసులుకోవడాన్కి సెల్ ఫోన్ ద్వారా ట్రాక్ చేశారు.

తరువాత చార్బావాడీ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసి, వనావాడి, లష్కర్ల సమీపంలో నిందితులను అరెస్టు చేశారు. దీన్ని బట్టి చూస్తే వాహనదారులు తమ వాహనాలో జిపిఎస్ ఏర్పాటు చేసుకుంటే తమ వాహనాలను ప్రమాదం నుంచి తప్పించవచ్చు.
Source: Pune Mirror


Click it and Unblock the Notifications








