Just In
- 2 hrs ago త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- 5 hrs ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 6 hrs ago JNCAP క్రాష్ టెస్ట్లో అదరగొట్టిన స్విఫ్ట్.. స్కోర్ ఎంతో తెలుసా?
- 6 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
Don't Miss
- News ఏపీలో కేజీఎఫ్ 3 గురించి చెప్పిన చంద్రబాబు
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Movies పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
- Sports SRH vs RCB ఉప్పల్ మ్యాచ్కు భారీ అడ్డంకి..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
దొంగలించిన కారుని 40 నిముషాల్లోనే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఎలా అనుకునుటున్నారా
ప్రముఖ వాహన తయారీదారు హ్యుందాయ్ కంపెనీ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వాహనాలలో హ్యుందాయ్ ఐ10 ఒకటి. ఈ కారు మార్కెట్లో ఎక్కువ అమ్మకాలను చవి చూసింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల హ్యుందాయ్ కంపెనీ ఈ ఐ10 కారు యొక్క అమ్మకాలను నిలిపివేసింది. కానీ ఇప్పటి కూడా ఈ కార్లు భారతీయ రోడ్లపై అక్కడక్కడా కనిపిస్తుంది.
అయితే ఇటీవల ఒక యువకుడు హ్యుందాయ్ ఐ10 కారుని దొంగలించి ఆ కారులోనే వెళ్తున్నాడు, ఇదే సమయంలో వాహన యజమాని పిర్యాదు మేరకు పోలీసులు ఆ కారు దొంగలించిన యువకున్ని కేవలం 40 నిముషాల్లో అరెస్టు చేసి ఆ వాహన యజమానికి అప్పగించారు.
పోలీసులు దొంగలించిన ఆ కారుని 40 నిమిషాల్లోనే అరెస్టు చేసి అసలైన యజమానికి అందించడం ప్రజలకు ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వాహనదారులకు టెక్నాలజీ తెలియని సమయంలో ఇలాంటిది ఎలా సాధ్యమయ్యింది అనే ప్రశ్న మొదలైంది.
MOST READ:బైకర్స్ తప్పకుండా ఈ రూల్స్ పాటించాలి.. లేకుంటే?
ప్రస్తుతం ఆధునిక యుగంలో జిపిఎస్ టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు దొంగిలించిన కారును త్వరగా గుర్తించగలుగుతున్నారు. వాహనంలో పొందుపరిచిన జిపిఎస్ టెక్నాలజీ ఆ వాహనం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి చాలా వరకు సహాయపడుతుంది. కావున వాహనదారులు వారి వాహనంలో జిపిఎస్ టెక్నాలజీ అమలుచేయడం ద్వారా దొంగలించబడినప్పటికీ దానిని సులభంగా పొందవచ్చు.
ఇక్కడ దొంగలించిన ఈ హ్యుందాయ్ ఐ10 కారు యజమాని తమ కారులో జిపిఎస్ టెక్నాలజీని అమలుచేయడం వల్ల పోలీసులు వాహనాన్ని గుర్తించడానికి పెద్దగా సమయం పట్టలేదు. అందుకే పోలీసులు కేవలం 40 నిముషాల్లో దొంగలించిన యువకున్ని అరెస్ట్ చేశారు.
MOST READ:ఆక్సిజన్ ట్యాంకర్ డ్రైవర్లకు తప్పకుండా వీటిని అందించాలి; కేంద్ర ప్రభుత్వం
జిపిఎస్ టెక్నాలజీ అనేది ఇటీవల వస్తున్న కార్లలో కచ్చితంగా అమలుచేసుకోవాలని ఆటో మొబైల్ పరిశ్రమ నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఇటీవల కాలంలో జిపిఎస్ పరికరాలను మార్కెట్లో తక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈ జిపిఎస్ పరికరాలను వాహనాల్లో అమర్చడం వల్ల దొంగల భారీ నుంచి తప్పించుకోవచ్చు. అంతే కాదు మీ వాహనం దొంగలించబడితే అది ఎక్కడికి వెళ్తుందో కూడా సులభంగా ట్రాక్ చేయవచ్చు.
నివేదికల ప్రకారం ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణేలో జరిగినట్లు తెలుస్తుంది. దొంగలించబడిన ఈ కారు పూణేకు చెందిన అభిషేక్ పన్వర్ దొంగలించినట్లు గుర్తించబడింది. కారు దొంగిలించబడిన కొద్దిసేపటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కావున కారుకు ఎటువంటి నష్టం జరగలేదు.
MOST READ:సూపర్ లుక్లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..
ఆఫీస్ పార్కింగ్ స్థలం నుంచి దొంగలించబడిందని గుర్థించిన కారు ఓనర్ ముషారఫ్ షేక్ తన ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అతని కారులో జిపిఎస్ ట్రాకర్ ఉండటం వల్ల ఈ కారు ఎక్కడ ఉందొ అని తెసులుకోవడాన్కి సెల్ ఫోన్ ద్వారా ట్రాక్ చేశారు.
తరువాత చార్బావాడీ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు చేసి, వనావాడి, లష్కర్ల సమీపంలో నిందితులను అరెస్టు చేశారు. దీన్ని బట్టి చూస్తే వాహనదారులు తమ వాహనాలో జిపిఎస్ ఏర్పాటు చేసుకుంటే తమ వాహనాలను ప్రమాదం నుంచి తప్పించవచ్చు.
MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని
Source: Pune Mirror