Just In
- 10 hrs ago 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- 11 hrs ago ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- 12 hrs ago నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- 13 hrs ago సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
Don't Miss
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Movies కరీనా కపూర్ పోలిటికల్ ఎంట్రీ!.. ఏ పార్టీలో చేరి.. ఎక్కడ నుంచి పోటీ అంటే?
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
80 మంది అరెస్ట్ 40 వాహనాలు సీజ్.. ఇదంతా ఒక క్రిమినల్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఫలితం
ప్రపంచవ్యాప్తంగా కరోనా చాలా వేగంగా వ్యాపిస్తూ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం ఒకటి. మనదేశంలో కూడా మహారాష్ట్రలో ఎక్కువ కరోనా కేసులు నమోదయ్యాయి. ఎంతోమంది ప్రజలు కరోనా వల్ల మరణించారు. ఇప్పటికి కూడా చాలామంది ప్రజలు ఈ వైరస్ వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
కరోనా మహమ్మారిని నివారించడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలతో లాక్ డౌన్ విధించింది. ఈ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజారవాణాతో సహా దాదాపు మొత్తం ట్రాఫిక్ పరిమితం చేసింది. కావున అత్యవసర సమయాల్లో తప్ప వాహనదారులు బయటికి రాకూడదు.
ఇన్ని ఆంక్షలు విధించి చర్యలు తీసుకుంటున్న వేళ ఇటీవల, పూణేలో సుమారు 200 మంది క్రిమినల్ నేపథ్యం ఉన్న వ్యక్తి అంత్యక్రియలకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీపై ప్రజల చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూణే పోలీసులు వారిని అరెస్ట్ చేయడానికి పూనుకున్నారు.
MOST READ:మీకు తెలుసా.. టీవీఎస్ ఎన్టార్క్ 125 సేల్స్ 1 లక్ష యూనిట్లు దాటేశాయ్
ఈ చర్యకు పాల్పడిన సుమారు 80 వ్యక్తులను అరెస్ట్ చేసి 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారిని అరెస్ట్ చేయడానికి 15 పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన గురించి సమాచారం ఇచ్చిన పూణే జోన్ 2 కి చెందిన డిసిపి సాగర్ పాటిల్ మాట్లాడుతూ ఇప్పటివరకు 80 మందిని అరెస్టు చేశామని, 40 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఈ 15 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సంఘటనలో పాల్గొన్న వారిని అరెస్టు చేయడానికి అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. శనివారం హత్యకు గురైన మాధవ్ వాఘాటే అంత్యక్రియల్లో ఈ బైక్ ర్యాలీ జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.
MOST READ:స్పాట్ టెస్ట్లో కనిపించిన మారుతి వ్యాగన్ఆర్; పూర్తి వివరాలు
నివేదికల ప్రకారం మాధవ్ వాఘటేను కత్తితో పొడిచి చంపారు. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో బైక్ ర్యాలీ జరిగింది. ర్యాలీలో సుమారు 125 బైక్లు పాల్గొన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూణే పోలీసులు సుమారు 150 నుంచి 200 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
మహారాష్ట్రలోని పూణే నగరంలో కరోనా రోగుల సంఖ్య చాలా ఎక్కువైంది. ఈ కారణంగా పూణేలో లాక్డౌన్ అమలు చేయబడింది. లాక్డౌన్ సమయంలో ప్రజలు అనవసరంగా ఇంటిని నుంచ్చి బయటకు రావడం చట్టరీత్యా నేరం. కావున ప్రజలు బయటకు రాకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
MOST READ:కవాసకి జెడ్ 900 సూపర్ బైక్ రైడ్ చేసిన ఫ్రెండ్లీ పోలీస్ [వీడియో]
ఇంత క్లిష్ట పరిస్థితుల్లో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి ర్యాలీలో పాల్గొన్నారు. పూణేలో కరోనా రోగులకు సహాయం చేయడానికి చాలామంది స్వచందంగా ముందుకు వస్తున్నారు. పూణేలోని ఆటో డ్రైవర్లు తమ ఆటో రిక్షాలను ఆటో అంబులెన్స్లుగా మార్చారు. కరోనా ఈ ఆటో రిక్షాల్లో ఆక్సిజన్ సిలిండర్ అమర్చి రోగులకు సహాయం చేస్తున్నారు.
ప్రస్తుతం ఆటో రిక్షాల్లోని అమర్చిన ఆక్సిజన్ సిలిండర్లు రోగులకు ఆరు నుంచి ఏడు గంటలు వరకు ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడతాయి. ఈ ఆటో అంబులెన్స్ అవసరమైన వారికి కరోనా హెల్ప్లైన్ నంబర్లు కూడా విడుదల చేయబడ్డాయి. కరోనా సోకిన వ్యక్తులకు సంబధించి వారి ఆక్సిజన్ కోసం ఈ హెల్ప్లైన్కు కాల్ చేయడం ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు.
MOST READ:అక్కడ 2021 మే 30 వరకు లాక్డౌన్ పొడిగింపు.. అన్ని సర్వీసులు నిషిద్ధం
మహారాష్ట్రలో ఇప్పుడు కూడా రోజు రోజుకి కొత్త కేసులు అమాంతం పెరిగిపోయాయి. ఈ కారణంగా పూణేలో కేసుల సంఖ్య చాలా ఎక్కువైంది. ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆటో అంబులెన్స్ సేవను అందించే పూణే ఆటో రిక్షా డ్రైవర్లు నిజంగా ప్రశంసనీయం. ఈ రకమైన చర్యలు కరోనా సోకిన వారి ప్రాణాలను కాపాడటానికి వీరు చేస్తున్న సేవ చాలా సహాయపడుతోంది.