Just In
- 1 hr ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 3 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 6 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
- 6 hrs ago టోల్గేట్ల వద్ద ఇకపై ఈ బోర్డులు ఉండవు.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Don't Miss
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Movies పడక గదిలోకి వెళ్లందే ఆఫర్లు రావు.. టాప్ సింగర్పై మండిపడ్డ నటి కస్తూరి
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
లాక్డౌన్ లో రోడ్డుపై కనిపించిన కొత్త జంట మెడలో పూల మాలలు వేసిన పోలీసులు[వీడియో]
కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి లక్కకుమించిన నష్టాన్ని కలిగించింది. ఈ కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించకుండా ఉండటానికి మరియు ప్రజలు ఈ మహమ్మారికి బలైపోకుండా ఉండటానికి గత సంవత్సరం కూడా కరోనా లాక్ డౌన్ విధించబడింది.
అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ చాలా విస్తరించింది.ప్రపంచంలో కరోనా ఎక్కువగా విస్తరించిన దేశల్లో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. ఈ కారణంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో కరోనా లాక్ డౌన్ విధించబడింది. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రజలు కొన్ని కఠినమైన నిబంధనలు పాటించాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.
ప్రభుత్వం విధించిన నిబంధనల ప్రకారం ప్రజలు అత్యవసర సమయంలో తప్ప రోడ్డుపైకి రావడానికి నిషేధం. కానీ కొన్ని అత్యవసర సమయాల్లో మాత్రం కొన్ని షరతులతో అనుమతించబడుతుంది. ఇందులో వివాహ వేడుకల వంటి వాటికీ పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజలు హాజరు కావాలని అనుమతించబడింది.
MOST READ:పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు
ప్రస్తుతం ఈ లాక్ డౌన్ సమయంలో పోలీసులు చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని చాలా జాగ్రతగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో, పోలీసులు సామాన్యులతో కలిసి నడుస్తూ వారికి సహాయం చేస్తున్నారు. మరికొన్ని చోట్ల ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.
ఇప్పుడు ఐపిఎస్ అధికారి దీపన్షు కబ్రా తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో కొత్తగా పెళ్లి చేసుకున్న జంటను పంజాబ్ పోలీసులు పలకరిస్తున్నారు. వీడియోలో ఇద్దరు పోలీసులు తమ బైక్ను నడుపుతున్న జంటను ఆపటం చూడవచ్చు.
MOST READ:స్పెషల్ కార్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన చెన్నై మున్సిపల్ కార్పొరేషన్; వివరాలు
పోలీసులు ఆ కొత్త జంటను పలకరించి పూలు ఇస్తారు. అంతే కాకుండా కొంత డబ్బు కూడా ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు. పోలీసులు చేసిన ఈ చర్యకు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎంతోమంది ప్రజలు ప్రశంసిస్తున్నారు. నూతన వధూవరులు కోవిడ్ నిబంధనలను పాటించి బైక్పై ఇంటికి వెళ్లారు. పోలీసుల ప్రవర్తన అద్భుతంగా ఉందని దీపన్షు కబ్రా అన్నారు.
దీపన్షు కబ్రా చేసిన ఈ ట్వీట్కు ఇప్పటివరకు 6 వేలకు పైగా లైక్లు వచ్చాయి. అంతే కాకుండా అతని ట్వీట్ 837 సార్లు రీట్వీట్ చేయబడింది మరియు 56 వేలకు పైగా వ్యక్తులచే వీక్షించబడింది. లాక్ డౌన్ సమయంలో వివిధ రాష్ట్రాల్లోని పోలీసులు ప్రజలకు సహాయం చేస్తున్నారు.
MOST READ:ఆటోపైలట్ మోడ్లో స్టంట్ చేసిన ఇండో-అమెరికన్ అరెస్ట్; వివరాలు
కొన్ని రోజుల క్రితం అంబులెన్సులు కొరత ఉన్న సమయంలో హర్యానా పోలీసులు ఎస్యూవీ అంబులెన్స్లను నడుపుతున్న సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది. కరోనా కట్స్ కాలంలో చాలామంది ప్రజలకు పోలీసులు సహాయం కూడా చేస్తున్నారు.