Just In
- 5 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 6 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 7 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 8 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Movies విడాకులు దిశగా మరో స్టార్ కపుల్.. ఇండస్ట్రీలో షాకింగ్గా..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హైదరాబాద్ రోడ్లపై రాయల్ ఎన్ఫీల్డ్ తో రచ్చ రచ్చ చేసిన రాంగోపాల్ వర్మ
పాపులర్ ఫిల్మ్ మేకర్ - రామ్ గోపాల్ వర్మ సినీ ఇండస్ట్రీలో బాగా పేరున్న వ్యక్తి. ఇటీవల హైదరాబాద్ లో అయన చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇది అంతా కొత్త తెలుగు సినిమా ఐస్మార్ట్ శంకర్ కోసం చేసాడని సోషల్ మీడియాలలో కామెంట్లు చేస్తున్నారు. వివరాలలోకి వెళితే, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బైక్ పై తాను ట్రిపుల్ రైడింగ్ చేసిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసాడు ఈయన, ఆ ట్వీట్ ను గమనించి ట్రాఫిక్ పోలీసులు జరిమానా జారీ చేశారు.
రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను ట్విట్టర్లో షేర్ చేయగా, అది రోడ్డుపై ఉన్న మరో మోటారుతో చిత్రీకరించింది. ఆయన ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ పై హెల్మెట్ లేకుండానే దర్శకులు అజయ్ భూపతి, అగస్త్యతో కలిసి మోటార్ బైక్పై ట్రిపుల్ రైడ్తో థియేటర్కు వెళ్లారు.
సిటీ మొత్తంలో పోలీసులు ఎక్కడా కనిపించలేదు? బాహుశా ఇస్మార్ట్ శంకర్ సినిమా చూస్తూ ఉండి ఉంటారు అని అన్నారు. ఆర్జీవీ ఈ క్రింది విధంగా ట్విట్టర్లో పోస్ట్ చేసాడు. అయితే ఆర్జీవీ పోలీసులకు ట్యాగ్ చేయకపోయినా..
అధికారిక ఖాతా ఉన్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆ వీడియోను గమనించి బదులిస్తూ "ట్రాఫిక్ ఉల్లంఘనులకు నివేదించినందుకు ఆర్జీవీకి ధన్యవాదాలు తెలిపారు. ట్రాఫిక్ రూల్స్ ని మీరు అనుసరించడం చేయలేదు. కేవలం థియేటర్స్ ఎందుకు?, ట్రాఫిక్ పోలీసులు చాలా డ్రామా, సర్కస్ ను ప్రతి నిమిషం రోడ్ల మీద ఇలా చూస్తారు".
దీంతో పోలీసులు రూ. 1,335 జరిమానా జారీ చేశారు. ఆ ఫైన్ ను బి. దిలీప్ కుమార్ కు పేరిట వాహనం రిజిస్టర్ చేయించుకున్న వారిపై జారీ చేశారు. అయితే ఆ వాహనానికి యజమాని ఎవరో తెలియదు. ఆర్జీవీ ఈ ట్వీట్ ను సైబరాబాద్ పోలీసులు తిరిగి ఈ క్రింది విధంగా జవాబిచ్చాడు.
టొయొటా యారిస్ - మార్కెట్ లో హోండా సిటి కారులకు
అయితే ఆ సమయంలో వాహన యజమాని దీనిని రైడింగ్ చేయలేదు, మరి ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ఫైన్ ను ఎవరు చెల్లిస్తేనో తెలియదు. అనేక ఆంక్షల కారణంగా డ్రైవింగ్ చేసే వ్యక్తికి కాకుండా వాహన యజమానికి ఈ-చలాన్లు జారీ చేస్తారు.
అందువల్లనే వాహనాన్ని అమ్మిన తరువాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద పేరును బదిలీ చేయవలసి ఉంటుంది. గతంలో ఈ వాహనాన్ని కొత్త యజమానికి అధికారికంగా బదిలీ చేయకపోవడం వల్ల ఆ వాహనానికి మునుపటి యజమాని చలానాలు వెళ్లడం జరిగిన సందర్భాలు కొన్ని ఉన్నాయి.
అధికారిక ట్రాఫిక్ పేజీల్లో ఉన్న జరిమానా మరియు చలానాలు ఎల్లప్పుడూ తనిఖీ చేస్తూ ఉండాలి. ఈ జరిమానా మొత్తం పేరుకుపోతూ ఉంటుంది, కాలక్రమేణా ఫైన్ అమౌంట్ భారీగా అవ్వవచ్చు. గతంలో ప్రజలు ఒక్కోసారి వాహనం ధర కంటే ఎక్కువ ధరకు జరిమానాలు చెల్లించవలసి వచ్చింది.
కేసులో జరిమానా చెల్లించకపోతే, డబ్బు రికవరీ చేసేందుకు వాహనాన్ని పోలీసులు సీజ్ చేస్తారు. భారత దేశంలో ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్ట విరుద్ధం, ప్రభుత్వ రహదారులపై దీనిని అత్యంత ప్రమాదకరంగా పరిణమించగలదు.