Just In
- 9 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 11 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 12 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 14 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
లాక్డౌన్ ఎఫెక్ట్ : నిత్యావసరాలు డోర్ డెలివరీ చేయనున్న రాపిడో
కరోనా వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న కారణంగా భారతదేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జరీ చేసింది. భారత్ లాక్డౌన్ కారణంగా దేశంలో దాదాపు అన్ని వాహన సేవలు నిలిపివేయబడ్డాయి. దేశ వ్యాప్తంగా వాహన సేవలను నిలిపివేయడంతో సాధారణ ప్రజలు నిత్యావసరాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రజల యొక్క నిత్యావసరాలను తీర్చడానికి రాపిడో సంస్థ ఒక అడుగు ముందుకు వేసింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ మీ కోసం..
బైక్ మరియు టాక్సీ సేవా సంస్థ అయిన రాపిడో కర్ణాటక, ఢిల్లీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యంతో అవసరమైన వస్తువులను సరఫరా చేస్తుంది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ఈ సంస్థ అవసరమైన వస్తువులను డోర్ డెలివరీ చేస్తుంది.
రాపిడో తన పంపిణీ భాగస్వాములతో ఒక లింక్ ఏర్పాటు చేసుకుని డెలివరీ చేయడం ప్రారంభించింది. రాపిడో అవసరమైన వస్తువుల సరఫరాలో ఢిల్లీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. డిసిపిసి నోడ్ కింద వెనుకబడిన ప్రాంతాల్లో పాలు మరియు పుడ్ ప్యాకెట్లను పంపిణీ చేస్తోంది.
MOST READ: ఇండియన్ డాక్టరుకి 100 వాహనాల్లో సెల్యూట్ చేసిన అమెరికా ప్రజలు, ఎందుకో తెలుసా..?
రాపిడో 16,000 స్థానిక కిరాణా దుకాణాలు మరియు వైద్య దుకాణాలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని అవసరమైన వస్తువులను ఇంటికి సరఫరా చేస్తోంది. హోమ్ డెలివరీని పొందాలనుకునే వినియోగదారులు 080-61914960 కు కాల్ చేయడం ద్వారా లేదా SMS పంపడం ద్వారా నిత్యావసర వస్తువులను బుక్ చేసుకోవచ్చు.
లాక్ డౌన్ సమయంలో అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి రాపిడో బిగ్ బాస్కెట్, బిగ్ బజార్ మరియు స్పెన్సర్ వంటి సంస్థలతో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
MOST READ: అమ్మకాలలో హోండానే అధిగమించిన హీరో మోటోకార్ప్
డ్రైవర్ల సహాయంతో రాపిడో పెద్ద దుకాణాల నుండి గృహ వస్తువులను కూడా పంపిణీ చేస్తుంది. రాపిడో దేశంలోని దాదాపు 90 నగరాల్లో ఈ సేవను ప్రారంభిస్తోంది. ఈ సేవను అందించడానికి కంపెనీ డ్రైవర్లలో 70% అందుబాటులో ఉన్నారని రాపిడో ప్రకటించింది.
రాపిడో తన పంపిణీ సేవలను విస్తరించడానికి గ్రోఫర్స్, డన్జో, ఫ్రెష్హోమ్లతో భాగస్వామ్యం చేసుకునే అవకాశం ఉంది. రాపిడో తన భాగస్వాములకు మరియు వినియోగదారులకు అవసరమైన వస్తువుల డోర్ డెలివరీ చేయడానికి ఎక్స్ట్రా అమౌంట్ వసూలు చేయదని తెలిపింది.
MOST READ:ఈ మాడిఫైడ్ సుజుకి జిమ్నీ ఎస్యువి హార్స్ పవర్ ఎంతో తెలుసా..?
ఇటీవల కాలంలో ఫ్లిప్కార్ట్ మరియు ఉబర్ కాబ్ లాక్డౌన్ సమయంలో అవసరమైన వస్తువులను పంపిణీ చేయడానికి హోమ్ డెలివరీతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. అంతే కాకుండా వైద్యులకు సహాయంగా ఓలా కూడా దాదాపు 500 క్యాబ్లను వినియోగించడం అందరికి తెలిసిన విషయమే. భారతదేశం మొత్తం లాక్ డౌన్ వున్న సమయంలో ఇలాంటి సంస్థలు సాధారణ ప్రజల నిత్యావసరాలు తీర్చడానికి ముందుకు వచ్చాయి.