Just In
- 1 hr ago క్రాష్ టెస్ట్లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 4 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 5 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
- 6 hrs ago మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
Don't Miss
- Sports IPL 2024: హార్దిక్ పాండ్యా చెత్త కెప్టెన్సీనే ముంబై ఇండియన్స్ కొంపముంచింది: క్రీడా మంత్రి
- Lifestyle పనీర్ బటర్ మాసాలాను ఇలా రెస్టారెంట్ స్టైల్లో తయారు చేసుకోండి..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- News విశాఖలో కూటమికి బిగ్ షాక్.. వైసీపీలో చేరిన కీలక నేత
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Movies Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఒక రైతు కొడుకు ఇప్పుడు బిలీనియర్.. ఎలానో మీరే చూడండి
ఒక రైతు కొడుకు రైతు కావడం సహజం. కానీ ఇటీవల కాలంలో రైతు కొడుకులు కూడా ఉన్నతమైన స్థానాలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక రైతు కొడుకు ఒక బిలీనియర్ అయ్యాడు. అంతే కాదు అతని వద్ద చాలా విలాసవంతమైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. దీని గురించి పూర్తి సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం.
రవి పిళ్ళై 1953 లో రైతుల కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం ఇతని 3.5 బిలియన్ డాలర్లకు అధినేత. ఇతనికి భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా ఎక్కువ వ్యాపారము కలిగి ఉన్న ఆర్పి గ్రూప్ వ్యవస్థాపకుడు. సాధారణ రైతుకుటుంబం నుంచి ప్రారంభమైన రవి పిళ్ళై ఇప్పుడు అత్యంత సంపన్నుడు మాత్రమే కాకుండా అనేక లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు.
రవి పిళ్ళై తన యూనివర్సిటీ స్థాయిలోనే మొదటి వ్యాపారాన్ని ప్రారంభించాడు. తరువాత మరికొన్ని వ్యాపారాలు చేసిన తరువాత, అతను నిర్మాణ రంగంలోకి దిగాడు. ఈ రంగమే రవి పిళ్ళై ని బిలీనియర్ గా చేసింది. రవి పిళ్ళైకి ప్రస్తుతం యుఎఇ, ఖతార్, బహ్రెయిన్ మరియు మరెన్నో దేశాలలో వ్యాపారాలు ఉన్నాయి. అతను వద్ద ఉన్న లగ్జరీ కార్ల గురించి ఇక్కడ చూద్దాం.
MOST READ:ఫ్లైట్ టికెట్ ఉందా.. అయితే అంతర్రాష్ట్ర ప్రవేశం చాలా సింపుల్
రోల్స్ రాయిస్ ఘోస్ట్ :
రోల్స్ రాయిస్ ఘోస్ట్ అతని గ్యారేజీలో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. అతను 2011 లో ఈ కారును కొనుగోలు చేశాడు మరియు అతను ఇప్పటికీ లగ్జరీ సెడాన్ ఉపయోగిస్తున్నాడు. ఇది పాత రోల్స్ రాయిస్ ఘోస్ట్ అయినప్పటికీ, ఇది అన్ని ఆధునిక లగ్జరీ లక్షణాలను కలిగి ఉంది.
మార్కెట్లో అత్యంత సౌకర్యవంతమైన కార్లలో రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఒకటిగా ఉంది. ఈ సెడాన్ కేరళలోని తన కొల్లం ఇంటి వద్ద ఆపి ఉంచబడింది మరియు అతను క్రమం తప్పకుండా దీనిని ఉపయోగిస్తాడు.
MOST READ:ఉద్యోగులకు 6 నెలలు జీతం తగ్గించనున్న టివిఎస్, ఎందుకో తెలుసా ?
మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 :
దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మెర్సిడెస్ మేబాచ్ ఎస్ 600 ను అందుకున్న వారు రవి పిళ్ళై. మేబాచ్ అత్యంత విలాసవంతమైన సెడాన్, ఇది సీట్ మసాజర్, హై-ఎండ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, పెర్ఫ్యూమ్ సిస్టమ్తో సహా హై-ఎండ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
ఇది భారీ 6.0-లీటర్ వి 12 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 530 బిహెచ్పి మరియు 800 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇటీవల కాలంలో మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 600 ఇప్పుడు నిలిపివేయబడింది మరియు దాని స్థానంలో ఎస్ 650 వెర్షన్ వచ్చింది.
MOST READ:అత్యంత ఖరీదైన లగ్జరీ కారు కొన్న విరాట్ కోహ్లీ బ్రదర్, ఎలా ఉందొ చూసారా !
బిఎండబ్ల్యు 520 డి :
రవి పిళ్ళై తెలుపు రంగు బిఎమ్డబ్ల్యూ 5-సిరీస్ డీజిల్ వెర్షన్ కారుని కూడా కలిగి ఉన్నాడు. ఇది మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన వేరియంట్లలో ఒకటి. ఇది మిడ్-సైజ్ బిఎమ్డబ్ల్యూ సెడాన్ మరియు ఇది వినియోగదారునికి చాలా నమ్మదగినది. ఈ కారు పిళ్ళై చాల కాలం వినియోగించారు.
ఆడి ఎ 6 మ్యాట్రిక్స్ :
2015 లో తన కుమార్తె వివాహం సందర్భంగా, రవి పిళ్ళై కొన్ని అన్యదేశ కార్లను వివాహ ప్రదేశంలో నిలిపి ఉంచారు. కొత్తగా ప్రారంభించిన ఆడి ఎ 6 మ్యాట్రిక్స్ వివాహంలో నిలిపిన సరికొత్త కార్లలో ఒకటి.
ఈ కారు అత్యంత లగ్జరీ ఫీచర్లు, బుల్లెట్ ప్రూఫ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉండటమే కాకుండా, మంచి రైడింగ్ అనుభవాన్ని కూడా అందిస్తుంది. ఆడి ఎ 6 మ్యాట్రిక్స్ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది.
మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 :
రవి పిళ్లై తన కుమార్తె పెళ్లికి మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 500 ను బహుమతిగా ఇచ్చారు. ఆల్-బ్లాక్ మేబాచ్ ఎస్ 500 బ్రాండ్ యొక్క ఎంట్రీ లెవల్ వెర్షన్ మరియు ఇంకా కొన్ని అదనపు ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ రవి పిళ్ళై వద్ద ఉన్న ఎస్యూవీల్లో అంతగా లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇది ప్రతి బిలియనీర్ తప్పకుండా కలిగి ఉన్న ఎస్యూవీ. ఆల్-బ్లాక్ ఎస్యూవీ తన కుమార్తె పెళ్లి సమయంలో కూడా గుర్తించబడింది.
ఈ ఎస్యూవీ అతని ఇంటిలోనే ఎక్కువ సమయం నిలిపి ఉంచబడింది. రేంజ్ రోవర్ భారత మార్కెట్లో అత్యంత ఖరీదైన ఎస్యూవీలలో ఒకటి మరియు ఇది చాలా మంది ప్రముఖుల సొంతం చేసుకున్నారు. ఈ కారుని రాజకీయ నాయకులూ సినీ పరిశ్రమ వారు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
ఒక రైతు కుటుంబం నుంచి జీవితం ప్రారంభించిన రవి పిళ్ళై ఇంతటి స్థాయిలో ఉన్నాడంటే దీనికి ప్రధాన కారణం అతని కృషి పట్టుదల. యూనివర్సిటీలో ఉన్నప్పటినుచి చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఇప్పుడే కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా వ్యాపారాలను కొనసాగిస్తున్నాడు.