Just In
- 2 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 4 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 6 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 9 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- Sports PBKS vs MI: చెలరేగిన సూరీడు... తెలుగోడు!
- News హైదరాబాద్ సిటీలో వర్షం: అటు ఎండలు.. ఇటు వానలు
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?
సాధారణంగా కొన్ని సార్లు చిన్న చిన్న విషయాల వల్ల కూడా ఎక్కువ నష్టాలు కలుగుతాయి. దీనికి ఉదాహరణలు కోకొల్లలు.. ఒక విమానం ఎగురుతున్నపుడు చిన్న పక్షులు అడ్డుపడితే విమానానికి చాలా ప్రమాదం సంభవిస్తుంది. ఇలాంటి సంఘటనలు మీరు ఇది వరకే విని ఉంటారు.
ఇంతకీ పక్షులకు మరియు విమానాలకు గల సంఘర్షణ ఏమిటి, పైలెట్లు పక్షులను ఢీ కొట్టకుండా ఎలా తప్పించుకుంటారు అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
పక్షుల ఆకస్మిక దాడుల వల్ల కలిగే ప్రమాదాలు:
పక్షి జాతులు తాము నివసిస్తున్న భూభాగాన్ని ఇతర జాతి పక్షులతో పంచుకోవు. ఒక వేళా వాటి భూభాగంలోకి చొరబడితే వాటిని తప్పకుండా తరిమికొడతాయి. దీనికి సంబంధించి మనం నిత్యా జీవితంలో చాలా చూసాం. ఉదాహరణకు ఒక కాకుల గుంపు తన పరిసరాల్లోకి ఇతర పక్షులు చొరబడితే వాటిని తరిమేదాకా ఊరుకోవు.
MOST READ:కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ కొన్న పంజాబీ సింగర్, ఎవరో తెలుసా?
ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు పక్షులు గుంపులు గుంపులుగా దాడి చేస్తాయి. ఈ క్రమంలో విమానాలను డీ కొట్టే ప్రమాదం ఉంది. విమానం మరియు పక్షుల మధ్య అనుకోకుండా జరిగే ఘర్షణ వల్ల విపరీతమైన నష్టాన్ని చూడవలసి వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.
ఈ నివేదిక ఒకటి రెండు దేశాలు ఇచ్చినది కాదు, ఏకంగా 91 దేశాలలో నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ సమాచారాన్ని విడుదల చేసింది. విమానం మరియు పక్షుల మధ్య ఘర్షణ ఒక్కసారి మాత్రమే జరుగుతుందని కొందరు నమ్ముతారు. కానీ ప్రపంచవ్యాప్తంగా రోజుకు కనీసం 34 ప్రమాదాలు పక్షుల- విమానాలు గుద్దుకోవడం వల్ల జరుగుతాయని ICAO నివేదించింది.
MOST READ:భారత్లో మళ్ళీ మొదలైన కరోనా లాక్డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?
అయితే పక్షుల వల్ల జరిగే అన్ని ప్రమాదాలు భారీ విపత్తును కలిగించవని ICAO తెలిపింది. దాదాపు 92% పక్షులు-విమానాలు గుద్దుకోవడం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగదు. అయితే మిగిలిన 8% మాత్రమే విపత్తు జరిగే అవకాసమ్ ఉంది.
పక్షుల సంఘర్షణను నివారించడానికి తీసుకోవాల్సిన చర్యలు:
పక్షులు విమానం యొక్క ఇంజిన్ని ఢీ కొట్టకుండా ఉండటానికి విమానయాన సంస్థలు కొన్ని ప్రత్యేకమైన వ్యూహాలను రూపొందించాయి. ఇంజిన్ ప్రాంతంలో పక్షులు చొరబడకుండా ఉండటానికి అనుకూలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇంజిన్ వద్ద వింత శబ్దాలు కూడా రావడం వల్ల పక్షులను అక్కడకు రాకుండా నివారించవచ్చు.
MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్యూవీ XUV700; వివరాలు
అయితే ఇంజిన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఒక ఉచ్చును పెద్ద పక్షి గాని ఢీ కొంటే తప్పకుండా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా విమానాల రంగులు కూడా పక్షులు ఎక్కువగా ఆకర్షించే రంగులు కాకుండా ఆకాశంలో కలిసిపోయే రంగులను ఉపయోగిస్తారు.
ఈ విధమైన కలర్స్ ఉపయోగించడం వల్ల ఎగురుతున్నప్పుడు పక్షి కంటి నుండి తప్పించుకోవడానికి వీలు కల్పిస్తుంది. అదనంగా, ఎగిరే పక్షులను తిప్పికొట్టడానికి కృత్రిమ పక్షులను ఉపయోగిస్తారు. ఈ పద్ధతిని అనేక విమానయాన సంస్థలు అనుసరిస్తున్నాయి. ఈ విధానంలో కొన్ని కంపెనీలు విజయవంతమయ్యాయి.