Just In
Don't Miss
- News Telangana Loksabha Polls 2024:కేసీఆర్ కుటుంబాన్ని ఆ భయం వెంటాడుతోందా....!!
- Finance IT News: రిక్రూట్మెంట్ రూటు మార్చిన ఇన్ఫోసిస్.. టాటా Elxsi న్యూ హైరింగ్..
- Lifestyle May Day 2024 Wishes : శ్రామికులు లేనిదే అభివృద్ధి లేదు.. శ్రామికుల దినోత్సవ శుభాకాంక్షలు
- Sports ధోనీకి కోపం వచ్చింది.. భయపడిన కెమెరామెన్ Video
- Movies నాతో ఆ పని చేస్తావా? ఒక రాత్రికి ఎంత తీసుకుంటావ్.. జబర్ధస్త్ బ్యూటీ ఏమన్నదో చూశారంటే!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మీకు తెలుసా.. విమానం ఎత్తులో ఎగిరేటపుడు పైలెట్స్ మాట్లాడకూడదు.. ఎందుకంటే?
ఈ ఆధునిక కాలంలో దాదాపు అందరూ విమాన ప్రయాణం చేసి ఉంటారు. కానీ చాలామందికి విమానాల గురించి గాని, విమానాలలోని కొన్ని రూల్స్ గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. అయితే విమానాలు నడిపే పైలెట్లకు విమానాలు నడిపేటప్పుడు చాలా నియమ నిబంధనలు ఉంటాయి. ఎందుకంటే భూమి నుంచి దాదాపు చాలా ఎత్తులే ప్రయాణం కాబట్టి ఎంతోమంది ప్రజల ప్రాణాలు వారి చేతుల్లోనే ఉంటాయి.
సాధారణంగా పైలెట్లు విమానం మరియు ప్రయాణీకుల భద్రత కోసమే పైలట్లు 10,000 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు మాట్లాడటం నిషేధించబడింది. దీనిని 'స్టెరైల్ కాక్పిట్ రూల్' అంటారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ చూద్దాం.. రండి.
ఈ నియమం ప్రకారం పైలట్లు 10 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు అనవసరంగా మాట్లాడకూడదు. విమాన ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల సంఖ్య కారణంగా ఈ నియమం అమల్లోకి వచ్చింది. కావున పైలెట్లు ఈ నియమాన్ని తప్పకుండా పాటించాలి.
MOST READ:హీరో హోండా యాడ్ లో సల్మాన్ ఖాన్.. ఎప్పుడైనా చూసారా..!
1974 సెప్టెంబర్ లో ఈస్టర్న్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 212 చార్లెస్టన్ నుండి షార్లెట్ డగ్లస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళుతుండగా ల్యాండింగ్ కాకముందే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 82 ప్రయాణికులున్న విమానంలో ఏకంగా 69 మంది మరణించారు.
నివేదికల ప్రకారం ఈ విమాన ప్రమాదానికి ప్రధాన కారణం, ఫ్లైట్ కెప్టెన్ మరియు మరొక అధికారి అనవసరమైన మాటల్లో మునిగిపోవడం వల్ల ఈ ప్రమాదమా జరిగిందని తేలింది. వీరిరువురు మాటల్లో మునిగిపోవడం వల్ల సరైన సమయంలో ల్యాండింగ్ చేసేటప్పుడు అవసరమైన పరికరాలను చూడటంలో విఫలమయ్యారు.
MOST READ:పోలీస్ స్టేషన్ ముందే బైక్ స్టంట్ చేసిన యువకుడు.. తర్వాత ఏమైందంటే?
ఈ విషాద సంఘటన జరిగిన దాదాపు 7 సంవత్సరాల తరువాత విమానయాన సంస్థ స్టెరైల్ కాక్పిట్ రూల్ అమలులోకి తీసుకువచ్చింది. ఈ నియమం అమలులోకి తర్వాత తప్పకుండా అన్ని విమానయాన సంస్థలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవడం జరిగింది.
విమానం మరియు విమానంలోని ప్రయాణకుల భద్రత దృష్ట్యా అమలులోకి తీసుకువచ్చిన ఈ రూల్ కేవలం పైలెట్లకు మాత్రమే కాదు, విమానాల్లో ఉన్న సహాయకులందరికీ వర్తిస్తుంది. ఈ సమయంలో ఎవరితోనూ అనవసరమైన మాటల్లో ఉండకూడదు.
MOST READ:కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు
అవసరమైన అంత ఎత్తులో మీరు కాలక్షేపానికి పుస్తకాలు వంటి వాటిని చదువుకోవచ్చు. ఇది ఆ సమయంలో ఎంతో సురక్షితంగా ఉంటుంది. విమానం 10 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
విమానంలో ఉన్న పైలట్లకు టేకాఫ్, ల్యాండింగ్ వంటి నిజంగా కొంత సవాలుగానే ఉంటుంది. ఈ సమయంలో, పైలట్లు విమాన నియంత్రణ కేంద్రంతో మాట్లాడాలి. వారు విమానం యొక్క కంప్యూటర్ మరియు క్రాస్ చెక్ పరికరాలపై సమాచారాన్ని అందించాలి.
MOST READ:సన్నీ లియోన్ కేరళ కార్ డ్రైవింగ్లో ఎదురైన చేదు అనుభవం.. కారణం ఇదే
ఈ సమయంలో విమానాలను సురక్షితంగా నిర్వహించడం పైలట్ల విధి. కావున పైలెట్లు చాలా జాగ్రత్తగా వ్యవహరించాహలి. అప్పుడే ప్రయాణికులు సురక్షితంగా ఉండగలరు. ఒకవేళ దీనిని నిర్లక్ష్యం చేస్తే అనుకోని ప్రమాదాలు సంభవించి ఎంతోమంది ప్రయాణిల ప్రాణాలు కోల్పోవడానికి కారకులవుతారు.