Just In
- 8 hrs ago గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- 9 hrs ago 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- 11 hrs ago జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- 14 hrs ago జాన్ అబ్రహం మనసుదోచిన కొత్త బైక్ ఇదే!.. మీరూ చూడండి
Don't Miss
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Movies డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శభాష్ పోలీస్; లాక్డౌన్లో బయటకు వచ్చిన రాజకీయ నాయకుడికి కూడా రూ. 11,000 జరిమానా
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా మహమ్మారి వల్ల ఎంతో మంది మరణిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి రోజు 1 లక్షకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఈ మహమ్మారి నివారణ కోసం దేశవ్యాప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైన చర్యలతో కరోనా లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ సమయంలో అత్యవరస సమయంలో తప్ప అనవసరముగా బయటకు రావడం పూర్తిగా నిషిద్ధం.
కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. లాక్డౌన్ ఉల్లంఘించి బయటకు వస్తున్న వాహనదారులపై చర్యలు తీసుకోవడమే కాకుండా వారి వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ లాక్డౌన్ ఉల్లంఘించిన ఎంతవరకైనా శిక్ష తప్పదు అని పోలీసులు రుజువు చేశారు.
నివేదికల ప్రకారం కరోనా లాక్డౌన్ ఉల్లంఘించిన ఒక రాజకీయ నాయకుడికి పోలీసులు ఏకంగా రూ. 11,000 జరిమానా విధించినట్లు తెలిసింది. ఈ సంఘటన ఉత్తర భారతదేశంలో జరిగింది. లాక్ డౌన్ లో బయటకు వచ్చిన ఆ రాజకీయ నాయకుడు పోలీసులకు తనను తాను రాజకీయ నాయకుడని పరిచయం చేసుకున్నాడు.
MOST READ:స్వయంగా ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయాలనుకుంటున్నారా.. అయితే ఇది మీ కోసమే
విధుల్లో ఉన్న పోలీసులు అతన్ని అడ్డగించినప్పుడు ఆ వ్యక్తి ఫేస్ మాస్క్ మరియు హెల్మెట్ వంటివి కూడా ధరించలేదు. ఇది మాత్రమే కాదు ఆ వ్యక్తి డ్రైవ్ చేస్తున్న వాహనానికి విరిగిన నంబర్ ప్లేట్ ఉంది. ఈ నెంబర్ ప్లేట్ లో కేవలం నాలుగు నెంబర్స్ మాత్రమే ఉన్నాయి. దీనిని మీరు వీడియోలో చూడవచ్చు.
కరోనా లాక్డౌన్ లో బయటకు రావడం, పేస్ మాస్క్ ధరించకపోవడం మరియు బైక్ పై వచ్చినప్పుడు హెల్మెట్ సైతం ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల అతనికి మొత్తం రూ. 11,000 జరిమానా విధించారు.
MOST READ:అందమైన మహిళ చీరకట్టుతో వోల్వో బస్ డ్రైవ్ చేస్తే..? సూపర్ కదూ.. వీడియో చూడండి
పోలీసులకు పట్టుబడ్డ ఆ రాజకీయ నాయకుడు అతని బైక్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో ఇది ఒక సరదా లాగా రాజకీయ నాయకులు, వారి పిల్లలు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ రాజకీయ నాయకునికి జరిమానా విధించడం నియమాలను ఉల్లంఘించిన అందరికి ఒక గుణపాఠం అవుతుంది.
కరోనా మహమ్మారి సమయంలో ప్రజలను కాపాడడానికి మరియు కరోనా నివారించడానికి ఎంతోమంది తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేస్తుంటే, రాజకీయ నాయకుల ముసుగులో నియమాలను ఉల్లంఘిస్తున్న వారిని మరింత కఠినంగా శిక్షించాలి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా చేయడం ఏ మాత్రం సమంజసం కాదు.
MOST READ:మీకు తెలుసా.. 'సైకిల్ గర్ల్' తండ్రి గుండెపోటుతో కన్నుమూశాడు
Image Courtesy: News Times 24