ఫ్యాన్ బైక్ను ఫాలో అయిన సచిన్.. మాస్టర్ బ్లాస్టర్ సర్ప్రైజ్కు అభిమాని షాక్.. ఈ వైరల్ వీడియో చూసేయండి
క్రికెట్లో సచిన్(Sachin Viral Video)కంటూ ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఫీల్డ్లోనే కాకుండా బయట కూడా మాస్టర్ బ్లాస్టర్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఇటీవల తన సోషల్ మీడియా ప్రొఫైల్లో వివిధ రకాల వీడియోలను పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా క్రికెట్ గాడ్ పోస్ట్ చేసిన ఓ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తన పేరుతో జెర్సీని ధరించిన ఓ అభిమానిని కారుపై వెంబడించి ఆశ్చర్యపరిచాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్(Sachin Followed His Fan) టెండూల్కర్. తన అభిమాన క్రికెటర్ని చూసిన ఆ వ్యక్తి ఉబ్బితబ్బియ్యాడు. సచిన్ టెండూల్కర్ తన కారుతో అతని బైక్ని ఓవర్టేక్ చేసిన తర్వాత అడ్డుకున్నప్పుడు ఆ అభిమాని నుంచి వచ్చిన రెస్పాన్స్కి అవధులు లేకుండాపోయింది. ఈ వీడియో మొత్తాన్ని సచిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అంబానీ కుటుంబానికి చెందిన ప్రముఖ IPL జట్టు ముంబై ఇండియన్స్ జెర్సీని ఆ అభిమాని ధరించాడు. జెర్సీ పైన "టెండూల్కర్" అని మరియు క్రింద "ఐ మిస్ యు" అని 10 నంబర్ రాసి ఉంది. తెలియని వారికి, ముంబై ఇండియన్స్కు ఆడటం మానేసిన సచిన్ టెండూల్కర్ ఇప్పటికీ జట్టుకు మెంటార్గా కొనసాగుతున్నారు. దీంతో ఒక్కసారిగా సచిన్ని చూసిన ఆ వ్యక్తి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సచిన్ని చూసిన ఆనందంలో ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ, "ధన్యవాదాలు, దేవుడా," అని చెప్పాడు. వెంటనే క్రికెటర్తో కరచాలనం చేసి తరువాత, అతను తన చేతిపై ఉన్న పచ్చబొట్టును సచిన్కి చూపిస్తూ మురిసిపోతాడు. అనంతరం వెంటనే సచిన్ చిత్రాలతో కూడిన అతని డైరీని కూడా అతనికి చూపిస్తాడు. దీని తర్వాత, సచిన్ టెండూల్కర్ ఆ వ్యక్తి పేరును అడుగుతాడు.

సచిన్ అతనికి ఆటోగ్రాఫ్ ఇస్తున్న వీడియోను రికార్డ్ చేస్తూ.. చివరకు తన దేవుణ్ణి కలుసుకున్నట్లు సంతోషంగా చెప్తాడు. అనంతరం అతని డైరీలో ఆటోగ్రాఫ్ ఇచ్చి సచిన్ బయలుదేరుతాడు. గతంలోనూ రోడ్లపై వెళ్లే ద్విచక్ర వాహనదారులను సచిన్ క్షేమంగా ఉండాలని అందుకోసం హెల్మెట్ ధరించడం ముఖ్యమని పేర్కొంటున్న వీడియో వైరల్ అవుతోంది. వెనుక కూర్చున్న పిలియన్ రైడర్ కూడా సీటు బెల్ట్ ధరించాలని సచిన్ సూచిస్తాడు.

ఇలా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రజల గుండెల్లో సచిన్ టెండూల్కర్(Sachin Latest Viral Video) అభిమాన క్రికెటర్గా స్థిరపడిపోయాడు. కాగా క్రికెట్కు సచిన్ గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతున్నా.. ఫ్యాన్స్ మాత్రం సచిన్ను ఇంకా ఆరాధిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో వన్డే టోర్నమెంట్లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్గా సచిన్ రికార్డు సృష్టించాడు.
కాగా గతేడాది జరిగిన క్రికెట్ వరల్డ్ కప్లో కింగ్ కోహ్లీ.. సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. సెంచరీ అనంతరం.. వీఐపీ లాంజ్లో కూర్చుని ఉన్న సచిన్ టెండూల్కర్కు కింగ్ కోహ్లీ తనదైన శైలిలో అభివాదం చేశాడు. ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సచిన్ కూడా కోహ్లీకి అభినందనలు తెలియజేశాడు.

డ్రైవ్స్పార్క్ తెలుగు వెబ్సైట్ ఆటోమొబైల్కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








