Just In
- 57 min ago హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- 2 hrs ago కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- 4 hrs ago కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- 5 hrs ago మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
Don't Miss
- News పొత్తుతో పవన్ ఆస్తులు పెరిగాయి - మనోహర్కి స్పోర్ట్స్ కారు..!!
- Movies వాడుంటే రాత్రికి పండగే.. అలా పడుకుంటా! పచ్చిగా బిగ్ బాస్ బ్యూటీ ఓపెన్
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
కస్టమైజ్ ఫోర్డ్ పిక్-అప్ ట్రక్కు డ్రైవ్ చేస్తూ కనిపించిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' [వీడియో]
సాధారణంగా యువకులకు బైకులపైన మరియు కార్లపై వ్యామోహం ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. కానీ చాలా మందికి ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మరియు ఆధ్యాత్మిక గురువు అయిన 'సద్గురు జగ్గీ వాసుదేవ్' గారికి కూడా బైక్లు మరియు కార్లంటే చాలా ఇష్టం. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు.
యువకులు కూడా ఆశ్చర్యపోయేలా సద్గురు తన 62 సంవత్సరాల వయసులో కూడా బైక్ నడుపుతున్న వీడియోలు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు సద్గురు కస్టమైజ్ ఫోర్డ్ ఎఫ్ 150 పికప్ ట్రక్కును నడుపుతున్న మరో వీడియో ఇటీవల వైరల్ అయ్యింది.
ఈ వీడియోలో కనిపిస్తున్న పికప్ ట్రక్ పూర్తిగా కస్టమైజ్ చేయబడింది. ఈ పిక్-అప్ ట్రక్కు రెడ్ కలర్ లో ఉంది. దీనిని ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోను సద్గురు స్వయంగా అప్లోడ్ చేశారు. ఈ వీడియో ఫోర్డ్ ఎఫ్ 150 పిక్-అప్ ట్రక్ కస్టమైజ్ చేయబడిందని చూపించడం ద్వారా ప్రారంభమవుతుంది.
MOST READ:కరోనా ఎఫెక్ట్: 700 మందికి పైగా అరెస్ట్.. ఎక్కడో తెలుసా?
దీనికి మునుపు ఉన్న స్టాక్ టైర్లు తొలగించబడ్డాయి, ఆ స్థానంలో ఆఫ్-రోడ్ కి అనుకూలంగా ఉండే టైర్లు అమర్చడం జరిగి, స్టాక్ అల్లాయ్ వీల్స్ స్టీల్ వీల్స్ తో భర్తీ చేయబడ్డాయ. ఈ పికప్ ట్రక్కు ద్వారా సద్గురు ఇప్పటికే 5,000 మైళ్ళు ప్రయాణించినట్లు తెలిపారు.
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక ప్రదర్శనకు హాజరు కావడానికి లాస్ ఏంజిల్స్కు వెళ్తున్నట్లు తెలిసింది. ఈ కస్టమైజ్ ట్రక్కు వాహనదారునికి అనుకూలంగా ఉండే విధంగా రూపొందించబడింది. ప్రస్తుతం కరోనా ఎక్కువగా వ్యాపిస్తున్న కారణంగా హోటళ్లలో ఉండటానికి ఇష్టపడటం లేదని చెప్పారు.
MOST READ:రైతులకు గుడ్ న్యూస్.. ట్రాక్టర్ కావాలంటే ఫ్రీగా వాడుకోవచ్చు.. ఎక్కడంటే?
ఈ ట్రక్కుపై 'ఆదియోగి' అనే పేరు వ్రాయబడి ఉంది. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఒక రోజుకి 700 నుండి 800 మైళ్ళ దూరం ప్రయాణిస్తున్నారు. ప్రయాణ సమయంలో ట్రక్కులో తానే స్వయంగా వంట చేసుకుంటున్నాడు. ఇప్పటివరకు అతడు 13 రోజులు దాదాపు 5,000 మైళ్ళ దూరం ప్రయాణించాడు.
ఈ కస్టమైజ్ ఫోర్డ్ పికప్ ట్రక్కు చాలా ఆకర్షణీయంగా ఉంది. దీని ముందు భాగంలో స్టీల్ బంపర్ మరియు గ్రిల్ అమర్చారు. ఈ స్టీల్ బంపర్లు రహదారిలో ఉన్నప్పుడు రాళ్లు లేదా ఇతర కఠిన పదార్థాల నుంచి రక్షించడానికి ఉపయోగపడుతుంది. దీని ముందు గ్రిల్లో కొన్ని ఆక్స్ లైట్స్ కూడా ఉన్నాయి.
MOST READ:'కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'గా పేరు మార్చుకున్న కియా మోటార్స్
ఇక్కడ సద్గురు డ్రైవ్ చేస్తున్న ట్రక్కు, ఎఫ్ 150 పిక్-అప్ ట్రక్ యొక్క కింగ్ రాంచ్ వెరోయింటె అని తెలుస్తుంది. ఇది కింగ్స్ రాంచ్ ఎఫ్150 పిక్-అప్ ట్రక్ యొక్క స్పెషల్ ఎడిషన్. దీని ముందు మరియు వెనుక బంపర్లలో కింగ్ రాంచ్ ఫెండర్ బ్యాడ్జ్లు కూడా ఉంటాయి.
ఫోర్డ్ ఎఫ్-150 పిక్-అప్ ట్రక్ లో 5.0-లీటర్ కయోట్ వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 10-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఈ కస్టమైజ్ పిక్ అప్ ట్రక్కు చూడటానికి అట్రాక్టివ్ గా మాత్రమే కాదు, వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.
MOST READ:ప్రమాదంలో రెండు ముక్కలైన 5 స్టార్ రేటింగ్ పొందిన కారు; పూర్తి వివరాలు