Just In
- 1 hr ago రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- 2 hrs ago కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి (వీడియో)
- 2 hrs ago టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- 4 hrs ago ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
Don't Miss
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Movies Prince yawar: ప్రిన్స్ యావర్కు హ్యాండిచ్చిన నయని పావని.. స్టేజీమీదే కన్నీరు పెట్టుకున్న కుర్రాడు!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పాత వాహనాన్ని చెత్త క్రింద పారేస్తే రోడ్డు టాక్స్లో 25 శాతం రిబేటు
పాత వాహనాలను స్క్రాప్ చేస్తే, కొత్త వాహనాల కొనుగోలుపై రోడ్డు పన్నులో రాయితీలను ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన దేశంలో 15 నుండి 20 ఏళ్లకు పైబడిన వాహనాలను స్క్రాప్ చేయాలాని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ ప్రతిపాదనను తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసినదే.
ఇందుకు సంబంధించి స్వచ్ఛంద వాహన స్క్రాపింగ్ విధానాన్ని కేంద్రం ఇటీవలి బడ్జెట్లో కూడా ప్రస్థావించింది. కాగా, ఇప్పుడు పాత వాహనాలను స్క్రాప్ చేసిన వాహన యజమానులకు కొత్త వాహనం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రోడ్డు పన్నులో 25 శాతం తగ్గింపును ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఈ మేరకు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ వాహన స్క్రాపేజ్ విధానం కింద అందించబోయే ప్రయోజనాల గురించి లోక్సభలో వివరించారు. రానున్న రోజుల్లో వెహికల్ స్క్రాపేజ్ విధానం పూర్తిగా అమలు చేయబడుతుందని తెలిపారు.
ఇలా పాత వాహనాన్ని స్క్రాప్ చేసిన వాహన యజమానులకు 'స్క్రాపింగ్ సర్టిఫికేట్' ఇస్తామని, తద్వారా వారు కొత్త కార్లపై లభించే ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవచ్చని గడ్కరీ చెప్పారు. స్క్రాపింగ్ సర్టిఫికేట్ తీసుకునే ప్రైవేట్ కార్ల యజమానులకు కొత్త వాహనం యొక్క రోడ్ టాక్స్లో 25 శాతం వరకూ తగ్గింపును అందించనున్నారు.
అదే సమయంలో, వాణిజ్య వాహనాల విషయంలో ఈ రిబేటును 15 శాతంగా నిర్ణయించారు. అంటే, స్క్రాప్ చేయబడిన వాణిజ్య వాహనాల యజమానులకు కొత్త వాణిజ్య వాహనం కొనుగోలుపై రోడ్ టాక్స్లో 15 శాతం డిస్కౌంట్ను అందిస్తారు.
భారతదేశంలో ప్రైవేటు వాహనాలను స్క్రాప్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 20 సంవత్సరాల కాలపరిమితిని నిర్ధారించగా, వాణిజ్య వాహనాలకు 15 సంవత్సరాల కాలపరిమితిని నిర్ణయించింది. ఈ వ్యవధిని దాటిన తరువాత, వాహనాల రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా ముగిసిపోతుంది.
ఈ కాలపరిమితిని మించిన వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణం అవుతాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇటువంటి వాహనాలలో ఉండే ఇంజన్లు పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర విష వాయువులను విడుదల చేస్తాయి.
ఒక నిర్దిష్ట కాలపరిమితి నిండిన వాహనాలను స్క్రాప్ చేసే విధానం ఇప్పటికే పలు దేశాలలో అమల్లో ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా స్క్రాపింగ్ యార్డులు మరియు రీసైక్లింగ్ ఫ్యాక్టరీలు కూడా నెలకొల్పబడి ఉన్నాయి. స్క్రాప్ చేసిన వాహనాల నుండి ఇనుము మరియు ఇతర ఉపయోగ వస్తువులను వేరు చేసి, వాటిని తిరిగి కొత్త వాటి కోసం రీసైక్లింగ్ చేయటం జరుగుతుంది.
ఈ విధానం వలన పాత కార్ల స్థానాన్ని కొత్త కార్లు భర్తీ చేస్తాయి. ఫలితంగా, పాత వాహనాల ద్వారా విడుదలయ్యే కాలుష్యం తగ్గుతుంది మరియు దేశంలో కొత్త వాహనాల వ్యాపారం కూడా మందగించదు. కేంద్రం ప్రకటించిన కొత్త వెహికల్ స్క్రాపింగ్ విధానంలో, తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేసిన వారికి కొత్త వాహనం యొక్క రహదారి పన్నులో మినహాయింపుతో పాటు, కొత్త వాహనం ధరలో 4-6 శాతం స్క్రాప్ విలువను కూడా సదరు కారు యజమానికి ఇవ్వబడుతుంది.
అంతే కాకుండా, వెహికల్ స్క్రాపింగ్ సర్టిఫికెట్ ఉన్న వినియోగదారులకు కొత్త కార్లపై 5 శాతం తగ్గింపు కూడా అందించాలని వాహన తయారీ సంస్థలకు కూడా సూచించడం జరిగింది. పాత వాహనాల స్థానంలో కొత్త మరియు ఇంధన సామర్థ్యం గల వాహనాలను ప్రవేశపెట్టడంతో, తక్కువ ఇంధన వినియోగం ఉంటుంది, దీని కారణంగా ప్రభుత్వం చమురు దిగుమతులను కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది.
సుమారు 50,000 ఉద్యోగ అవకాశాలను కల్పించే ఈ స్క్రాపింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనుంది. ఈ విధానం ద్వారా సుమారు 1 కోటి పాత హెవీ, మీడియం మరియు తేలికపాటి వాహనాలు స్క్రాప్ చేయబడుతాయని భావిస్తున్నారు.