Just In
- 8 hrs ago 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 10 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 11 hrs ago కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 13 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Movies Karthika Deepam 2 April 25th: దీపను టార్గెట్ చేసిన పారిజాతం.. దాడి చేస్తే దిక్కెవరు.. సుమిత్ర
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు
ఇటీవల రోడ్డుప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. గత ఆదివారం బెంగళూరులో వరుస ప్రమాదాలు జరిగాయి. ప్రమాదం జరిగిన తర్వాత కార్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న కబ్బన్ పార్క్ పోలీసులు కారు రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ ఆడి ఆర్ 8 లగ్జరీ కారు అని బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు చెందినదని పోలీసులు తెలిపారు.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా రెండు నెలల క్రితం కారును ఒక డీలర్కు అమ్మినట్లు తెలిసింది. కానీ కారుకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఇప్పటికీ రాజ్ కుంద్రా పేరుమీదనే ఉన్నాయి. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి పోలీసులకు కొంత ఇబ్బంది ఏర్పడింది.
ఆడి ఆర్ 8 లగ్జరీ కార్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ ఎంహెచ్-02 బిపి-0010 ను కలిగి ఉంది. ఈ లగ్జరీ కారు యొక్క ప్రస్తుత ఓనర్ పై కబ్బన్ పార్క్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గత ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఆటో మరియు అనేక బైక్లకు తీవ్ర నష్టం కలిగినట్లు తెలిసింది.
MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
అదృష్టవశాత్తూ, అందరూ చిన్న గాయాలతో బయటపడగలిగారు. ప్రమాద బాధితుల నుంచి కంప్లైంట్ వచ్చిన ఈ సంఘటనపై కబ్బన్ పార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శిల్పా శెట్టి భర్త నుంచి లగ్జరీ కారు కొన్న బీటీఎం 2 నివాసి మహ్మద్ సద్దాం (27) అనే కారు డీలర్పై కబ్బన్ పార్క్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో తాను కారులో ఉన్నానని, పరిస్థితి మరింత దిగజారడంతో తాను అక్కడి నుంచి పారిపోయానని ఒప్పుకున్నాడు. ప్రమాదానికి అసలైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
MOST READ:ఈ అంబాసిడర్ కారును చూశారా.. అబ్బా ఎంత అందంగా ఉందో..
ముహమ్మద్ సద్దాం భారతదేశంలోని వివిధ కార్ల డీలర్లతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ముంబైలోని కార్ డీలర్షిప్ ద్వారా రాజ్ కుంద్రా ఆడి ఆర్ 8 లగ్జరీ కారును కొనుగోలు చేశాడు.
ఈ కారు ప్రారంభ ధర రూ. 2.30 కోట్లు కాగా, టాప్ ఎండ్ మోడల్ ధర దాదాపు రూ. 3 కోట్లకు పైగా ఉంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. దీని వల్ల ఈ లగ్జరీ కార్ తీవ్రంగా నష్టపోయింది. దీనిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదికను ప్రచురించింది.
MOST READ:జరిమానా విధించాడని పోలీస్ స్టేషన్కే కరెంట్ కట్.. ఎక్కడో తెలుసా..!